పుట:కాశీమజిలీకథలు-06.pdf/268

ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

(35)

ముంజుని కథ

273

రాజపుత్రు నిటకు రప్పింపుడని కోరిన నతండు పరిజనుల నంపి విద్యామందిరమునుండి భోజు నచ్చటికిఁ బిలిపించెను.

భూమి కరుదెంచిన మహేంద్రుడోయన రూపుఁ గైకొనిన మన్మధునిచందమున మూర్తీభవించిన సౌభాగ్యంబుకరణిఁ బ్రకాశించుచు భోజకుమారుఁ డా సభామండలి కరుదెంచి రాజకుమారవర్గంబు సిగ్గుపడి చూచుచుండ రెండవ తండ్రివలె నొప్పుచున్న ముంజుని పాదంబులకు నమస్కరింపుచు నుచితాసనాసీనుం డయ్యె నట్టి యెడ నా బ్రాహ్మణుఁడు తల్లక్షణంబు లన్నియు పరీక్షించి దేవా ఈ కుమారుని భాగ్యోదయ మెరింగింప విరించియుం జాలడననాబోటి కుక్షింభరి‌ యేమి చెప్పఁగలడు? అయినను నా బుద్దికిఁదోచినరీతి నివేదించెద. నీ కుమారశేఖర నధ్యయనశాల కనువుఁడని చెప్పుటయు నన్నరపతి యట్లుఁ గావించెను.

రాజా ! బోజకుమారుం డవతారపురుషుండు నా జీవితములో నిట్టి యద్భుత భాగ్యోదయముగల జాతకముఁజూచిఁ యెరుంగ. వినుండు. ఏబదియైదుసంవత్సరముల యేడుమాసముల మూడుదినము లీగౌడదేశ మంతయు నేకచ్ఛత్రముగా నీ కుమారుండు పాలింపగలడు. అరువదినాలుగువిద్యలు వీనికిఁ గరతలామలకముగా నుండును. శిబికర్ణదధీచుల మించిన దాతృత్వముఁగలిగి భూమండలమునఁ గలిగిన పండితుల నెల్లనాదరించుచు విజయశోవిసరంబుల దిగంతముల విరజిమ్మఁ గలఁడని యక్కజముగా వక్కాణించెను. ఆ కథవిని ముంజుండు చాతుర్యంబున సంతసించు చున్నట్టభినయించినను విచ్చాయవదనుండై యప్పటికిఁ దగిన కానుకలిచ్చి యాబాడబు ననిపి యేకాంతగృహంబున కరిగి యిట్లు విచారించెను.

అయ్యో ? ఈ రాజ్యలక్ష్మి భోజకుమారు నాశ్రయింపఁ గలదు. అప్పుడు నేను బ్రతికియున్నను జచ్చినవానితో సముండ నగుదును. ఇంద్రియములు బుద్దియు నామము మాటలు వెనుకటివేయైనను సిరి విడిచినవాఁడు మఱియొకఁడైపోవును. పూర్వము వాఁడు సంభాషించుటయే పండుగగాఁ దలంచువా రిప్పుడు పిలిచినను దాపునకు రారు. మగ్నింపరు నీ కొన్నిదినంబు లైశ్వర్య మనుభవించి దరిద్రుడైనవాని జీవనముకన్న మృతియే శ్రేష్ఠము. కావున నిందుల కొక యోచన చేయవలసి యున్నది రాబోవు ననర్థమునకు ముందుగనే ప్రతీకారము సేయవలయును. అదిదాక్షిణ్యము గలిగి పరాపవాదములకు వెఱచుచుఁ జేయఁదగిన కార్యంబులఁ జేయని వానికి సంపదలు దూరములై పోవును. చేయఁదగిన పనులవిషయమై జాగుచేయువాని సంపదలను గాలము మ్రింగివేయఁగలదు. అభిమానముఁ వెనుకకుద్రోచి


ఆటం బసిలోర్యి! ప్ర

ఫ్‌ ఈల? "స్టైలు “మంచే మూర్థత. నుతిసుంరు ఏస్‌? నసయము; గ్‌ జి గ

భగ టీకాను. స్వల్పకార్యం. ఎన నధ కార్యం, నా రషచకొనదటే