పుట:కాశీమజిలీకథలు-06.pdf/188

ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

(25)

రత్నపాదుని కథ

193

మాయాబలములని తెలిసికొని తమ ప్రజలకెల్ల వెరవవలదని బోధించినది. కాని ధైర్యము నిలువక వారు పారిపోవ దొడంగిరి.

రత్నపాదుఁ డొరులకుఁ గనం బడకయే యొకసారి భూకంపముఁ గలుగఁ జేసి బొంగరమువలె నా ప్రోలంతయుం గిరగిరఁ ద్రిప్పివైచును. మరియొక మాటు మహావాతంబుతోఁగూడ జీమూత సంఘంబులు కల్పించి పిడుగులే వర్షముగాఁ గురిపించును. ఒకతేప లంకాపురంబువోలె విస్పులింగచ్చటారావములతో నా భీలజ్వాలా సముజ్వల౦బగు పావకంబుఁ గల్పించి గృహంబుల దహింపంజేయును. దేవదానవ క్షుభితమగు మందర నగరంబు చాడ్పున నప్పురంబు సంక్షోభించుటయు నది యకాల ప్రళయమని ప్రజలు తల్ల డించుచుండిరి. స్వప్నమందుఁ బొందు బాధలకు వెఱచుచు మేల్కొనినపిదప నేమియుందోపని భంగి జాలానంతర మావంత యావంతయైనఁ గానిపింపదు.

ఒకనాఁడు పౌరులెల్లరు రాజపుత్రిక యొద్దకుఁబోయి దేవీ! నీవిట్లుపేక్షించిన నిలువఁ గలమా? ఇట్టి యుపద్రవము లేనాఁడును మే మెరుఁగము. ఈ మాయలన్నియు నీ రాజ్యముననే పొడముచున్నవి. ఈ విపరీతములకు హోమములుగాని శాంతులుగాని జేయింపుమని యేకగ్రీవముగా మొఱవెట్టిరి.

అ చిన్నది యిదియొకవాలము. ఇందులకు వెఱవ నక్కరలేదు. ఈ బాధలేమియు. మిమ్ముఁ బొందవు. రెండు మూడు దినములలోఁ బ్రతిక్రియఁ గావించెదఁ జింతింపకుఁడని యూరడించుచు మన పట్టణమునకు వింతవా రెవ్వరేని వచ్చి రేమో చూచిరమ్మని నలుమూలలకు దూతలం బంపినది.

రత్నపాదు డొక్క దేవాలయములో వసియించెను. రాజభటు లతనిజూచి మీ దేయూరు? ఇందేమిటికి వచ్చిరి? మీ వృత్తాంతముఁ జెప్పుడని యడిగిన నతండు, పో పొండు. నాజోలి మీకేల? నే నెవ్వండనో ఏదోశస్థుఁడనో యని తిరస్కారముగా డుత్తరముఁ జెప్పుటయుఁ గింకరులరిగి యత్తెఱవ కెరింగించిరి. అప్పుడా రాజపుత్రిక కపటవిద్యా ప్రయోగసరిణియగు కేసరిణింజీరి యతనియొద్ద కనిపినది. అదివోయి దేవళమున బ్రహ్మతేజంబున విరాజిల్లుచున్న యా భూసుర కుమారుంజూచి తల యూచుచుఁ జేరి నమన్కరింపుచు నిట్లనియె.

మహాత్మా ! తమ వియోగమున కేదేశవాసులు చింతింపు చున్నారు? అభిఖ్యావర్ణంబు లెట్టివి? మీ వేషముచూడ భూసురువంశ పావనులని తోచుచుచున్నది. మరియు మా నగరప్రజలకు నాశ్చర్యకరమగు వింతలం గనబరచినవారు దేవరయే యని తలంచెదను. మా రాజపుత్రిక మీ సేమమరసి రమ్మన్నది. మీ వార్త దెలిసికొని అతిధికి స్వాగతము

ఎ అన్నలు... ఆతరి. త్యాగలయయుం. అతనతల్‌ నడిగని ఎని నవ్వుచు నరం

కః

మి సపిదు కేసరిటయా యేషు? సమిటలు చొల -ఎప్పునిచ్ళా న.