పుట:కాశీఖండము.pdf/435

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

423


బులు గలవు. కేదారేశ్వంబునకు నుత్తరంబునఁ జిత్రాంగదేశ్వరలింగంబు, తత్సమీపంబునం గేదారేశ్వరస్థానంబు, దక్షిణంబున నీలకంఠేశ్వరలింగంబు, నీలకంఠక్షేత్రంబునకు వాయవ్యభాగంబున నంబరీషేశ్వరలింగంబు, తత్సమీపంబున నింద్రద్యుమ్నేశ్వరలింగంబు, నాదక్షిణంబునఁ గాలంజరేశ్వరలింగంబు, చిత్రాంగదేశ్వరు నుత్తరంబున క్షేమేశ్వరలింగం, బిది కేదారలింగమాహాత్మ్యంబు. ఇంక ధర్మరాజేశ్వరలింగమాహాత్మ్యం బభివర్ణించెద.

305


తే.

అనినఁ బ్రియ మంది నైమిశమునిగణంబు
సూతు నర్చించి భక్తిసమేతు లగుచు
ధర్మరాజేశ శివమహాస్థానమహిమ
గుహుఁడు సెప్పె నెవ్విధమునం గుంభజునకు?

306


వ.

అవ్విధంబు మాకు నానతి మ్మనుటయు.

307


ఆశ్వాసాంతము

శా.

కల్పాంతానిలఘూర్ణమానజలముగ్దర్జానినాదోద్భటా
నల్పాటోపకఠోరధాటిపటహోద్యదోషవిధ్వస్తసం
కల్పారాతినృపాలసంశ్రితకులక్ష్మాభృద్గుహాగేహ! యా
కల్పక్షౌమపటీపటీరవిశదా కాశ్మీరచంద్రప్రదా!

308


క.

వీరావతార! వితరణ
పారాయణహృదయ! రాజపరమేశ్వర! ది
గ్వారణకరసన్నిభభుజ!
ధారాసురతాణదర్పధరణీధ్రపవీ!

309