పుట:కాశీఖండము.pdf/431

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

419


జలుపు యాతాయాతములఁ బ్రదక్షిణములు
        మాటమాటికి గర్భమంటపికకు
సోమసూత్రప్రణాళీమార్గనిష్ఠ్యూత
        తీర్థోదకంబులు దివుటఁ గ్రోలు
భక్షించు గేహళీబల్యర్తవిక్షిప్త
        పిండోదకములు సంప్రీతి యెసఁగ


తే.

వినుఁ ద్రికాలంబు నర్చనావేళలందు
శంఖకాహళపటహజర్జరరవంబు
కాశినగరంబునఁ ద్రివిష్టపేశునగర
నవ్విహంగమరత్నంబు లనుదినంబు.

292


వ.

ఇవ్విధంబునం బారావతస్త్రీపుంసంబులు సంసారసుఖంబు లనుభవించుచు నొక్కనాఁడు నద్దివ్యదేవుదివ్యభవనచంద్రశాలాగర్భవితర్దితానిర్యూహవిటంకనీడంబునం మెలంగి యాడుచుండ నొక్కశ్యేనం బమ్మిథునంబు దవుదవ్వులం గనుంగొని చేర వచ్చి జాలకంబులలో నుండి తన్ను నలవోకయుం బోలెఁ గనుంగొనుచు దుర్గసమాశ్రయబలంబున నయ్యుగ్మంబు లెక్కసేకయున్న నప్పటికి నొడుపు దప్పి తొలంగి యెక్కడికేనియుం బోయె. పరేంగితజ్ఞానచతుర యగు నప్పారావతి తనపతి కి ట్లనియె.

293


సీ.

మనపాలివేరువిత్తని యెఱుంగుదు గాదె
        యెఱుఁగవో శ్యేనంబు హృదయనాథ!
ప్రబల మైనట్టి దుర్గంబులో నున్నార
        మగుట నేటికిఁ దప్పెఁ బ్రాణభయము