పుట:కాశీఖండము.pdf/251

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

238

శ్రీకాశీఖండము


వినినను, వ్రాసినను నరుల కాయురారోగ్యైశ్వర్యాలవృద్ధులు సంభవించు. శివశర్మ! నీ వీరహస్యధర్మమర్మం బెఱింగి హరిహరత్వంబులయందు భేదంబు సేయకుండుమని చెప్పిరి.
అంత నవ్విమానంబు విష్ణులోకంబు గదియుటయు నాతనిం జూచి, యిది వైకుంఠలోకంబు. ఇందు లక్ష్మీసహాయుండై వైకుంఠుం డుండు. నీ విందుఁ బరమానందంబున శతానందపరివత్సరపర్యంతంబు వసియింపుము. ఇటమీఁదివృత్తాంతంబు చెప్పెదము. పుణ్యతీర్థోపాంతమరణంబున నైనఫలంబునను, భూతసుకృతశేషంబునను, భూమండలంబునకు డిగ్గి నందివర్ధననగరంబున వృద్ధకాలుం డనుపేరిరాజువై పెద్దకాలంబు రాజ్యంబు సేయంగలవు. నీ రాజ్యంబునందు.

300


క.

కురియు నెలమూఁడువానలు
సురభులు చ న్నవిసి పితుకు సుకృతము జరుగున్
ధరఁ గొండ్ర వేలు పండును
బరఁగుం బురుషాయుషంబు ప్రజలకు నెల్లన్.

301


వ.

ఇవ్విధంబునం బెద్దకాలంబు రాజ్యంబు సేసి సుతవిన్యస్తరాజ్యభారుండవై కాశి కరిగి యయోధ్యావంతీమధురామాయాద్వారావతీకాంచ్యుజ్జయినీతీర్థసేవాఫలంబున విశ్వనాథుప్రసాదంబున నపవర్గంబుఁ గాంచెద వని పలికి విష్ణుకింకరు లతని దివ్యవిమానంబువలన డించి నారాయణదేవు సముఖంబునం బెట్టిరి. అప్పుణ్యశ్లోకుండును విష్ణులోకంబునం బెద్దకాలంబు సుఖం బనుభవించి పుణ్యశీలసుశీలురు చెప్పినప్రకారంబున మోక్షంబు వడసె నని లోపాముద్రకు గుంభసంభవుండు శ్రీశైలకటకంబునందు సకలతీర్థంబులుం