పుట:కాశీఖండము.pdf/220

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

207


తే.

నెలలు తొమ్మిది మోచి కాష్ఠలు గఠోర
గర్భలై సూతిమాసంబు గదియుటయును
సత్త్వభారంబు భరియింప శక్తి లేక
వ్రాలె భూమండలంబుపై వడఁకి వడఁకి.

174


వ.

ఆదిగ్దేవతలగర్భంబున నుద్భవించిన తేజం బేకీభవించి చందురుండై యఖిలజగద్ధితార్థం బయ్యరవిందభవునాజ్ఞ నతనిదివ్యస్యందనం బెక్కి యష్టాదశద్వీపంబులం జరియించి తనకుందాన వృద్ధి బొందె. అతని తేజోనిస్సరణంబున సకలజగదుపకారం బగునదీనివహం బుద్భవించె. అట్లు వర్తించి యాసుధాకరుం డవిముక్తస్థానంబున నమృతలింగమూర్తిఁ జంద్రేశ్వరాహ్వయు నీశ్వరుం జంద్రమౌళి దనపేరం బ్రతిష్ఠించి యమృతోదర(క)౦ బనుకుండంబు నిర్మించి తత్సమీపంబున బహుదివ్యవర్షంబులు దపంబు చేసి యాదేవదేవుని ప్రసాదంబున నోషధీతోయంబులకు నగ్రజన్ములకు రా జయ్యె. అమ్మహాదేవుననుగ్రహంబున వెండియు నాజైవాతృకుండు.

175


ఉ.

ఏటికిఁ దానకం బయినయిక్షుశరాసనవైరిజూటీకా
కోటికి మల్లికాకుసుమగుచ్ఛముఠేవ వహించి కైకొనున్
బాటలిమంబు మేనపరిపాటివినోదనవేళఁ బార్వతీ
పాటలగంధిచారుపదపద్మనఖంబుల క్రొత్తలత్తుకన్.

176


తే.

రాజరా జయి పాలించె రాజసమున
వసుధ యెల్ల నేకాతపవారణముగఁ
గాశికాక్షేత్రమునఁ బెద్దగాల మేనిఁ
దపము చేసిన బహులఖేదంబు వాయు.

177


వ.

అంత నక్కాశియందు హిరణ్యగర్భాత్రిభృగువులు ఋత్విజు