63
ద్వితీయాశ్వాసము
గీ. దనకుఁ గైదండ యొసఁగినతరుణికేలు
వదల నెఱుఁగమి నది తోన వచ్చుచుండఁ
గనిసవా రెల్ల నొదుఁగుచుఁ గలఁగుచుండ
మురరిపుఁడు వాకిటిహజారమునకు వచ్చె. 17
తే. ఇట్లెదుర్కొని ప్రణమిల్లి యింపు బెంపుఁ
దనరఁ గైదండ యొసఁగి తోడ్కొనుచు నేఁగి
యతనియాజ్ఞ వెంబడిని శుద్దాంతనికట
భాసి యగునొక్కమణి సభాభవనమునను. 18
మ. జగదీశుండు తపోధనాగ్రణికిఁ బూజావర్తన ల్నాఁడ క్రొ
త్తగ నేతెంచినవానికిం బలె మహాతాత్పర్యసంయుక్తుఁడై
తగఁజేసెంగడుఁ గ్రొత్తక్రొత్తగుచు నత్యంతాదరంబెక్కు ధ
ర్మగరిష్ఠాత్ములబుద్ధి పూజ్యు లగువార ల్పల్మరు న్వచ్చినన్ 19
ఉ. అప్పుడు తత్సభాగృహసమాగమనార్హులు కొల్వు సేతఁ కై
యెప్పటియట్ల యందుబహిస్థ్సితులై యెఱిఁగించిపంపఁదా
నప్పరమర్షి వీడ్కొలుపునంతకు రమ్మనఁ గొంకి యచ్యుతుం
డప్పలుకు ల్గణింపక తదంచితగోష్ఠిన యుండె నింపుతోన్. 20
వ. అప్పు డది యెఱింగి.21
ఉ. మౌనివరేణ్యుఁ డిట్లనియె మాకొక పెద్దతనం బొనర్చి రా
జ్యానుగుణప్రవర్తనల కక్కట యిమ్మెయిఁ గొంకితేని న