పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/358

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

125


బుష్పాపచయవేళఁ బొడవులయ్యును గరాం
        బురుహంబునకు నందుఁ దరులు వేగ
నన్యోన్యవైరంబు లడఁచి సత్త్వంబులు
        వాత్సల్య మమరఁ బార్శ్వములఁ దిరుగు


గీ.

నార్తవం బగు గుణ మెల్ల నపనయించి
మేని కింపైనగతిఁ బర్వు భానురశ్మి
యతిమునీశ్వరుఁడగు నృపాలాగ్రగణ్యుఁ
డతులనిష్ఠఁ దపోలక్ష్మి నందుకొనుఁడు.

19


ఉ.

వాడదు మేను నిట్టు లుపవాసము లుండిన ధైర్య మింతయున్
వీడదు సారెకున్ బొడమువిఘ్నములం గని యింద్రియంబులన్
గూడదు నెమ్మనంబు సమకూరిసనిష్ఠఁ గురంగపాణిపై
నూడనిభక్తి గల్గి తన మొప్పఁగఁ జేయునృపాలహేళికిన్.

20


క.

పరిమితదినములలోపల
జిరకాలతపఃఫలంబు క్షితిపతి గాంచెన్
హరకరుణాసంపన్నుల
కరుదారఁగ నందరానియట్టిది గలదే?

21


సీ.

మండువేసవినాఁడు మార్తాండుఁ గనుఁగొంచు
        నుండునగ్నులు చుట్టు మెండుకొనఁగ
బలు వానకాలంబు చలన మింతయు లేక
        పద్మాసనస్థుఁడై బయట నిలుచుఁ
దుస్తరంబైన శీతుం గందువను గంఠ
        దఘ్ననీరంబులఁ దవిలి యరలు(?)
హరుఁడు శీఘ్రమునఁ బ్రత్యక్షంబు గామిని
        శంకింపఁ, డాత్మ నిస్తంద్రుఁడగుట