పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/344

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

111


గీ.

కాఁపురము నాకుఁ గడుఁబెద్ద కంచియంత
యిల్లు శ్రీధాన్యకటకమై హెచ్చు మిత్రు
లరయఁ దలవెండ్రుకలయంద ఱచ్చికంబు
లేదు గ్రాసంబునందు నోవేదమూర్తి.

253


వ.

అనిన విని యట్లకాక నీవు మాకుం గుమారునిమాఱు నీ కెవ్విధంబున నుండవలయు నవ్విధంబున మాతోడం గలసి వర్తింపుమని ప్రహర్షలోలుండై విద్యాపాలుండు నాళీకబాంధవుం డస్తశైలశిఖరం బరుగుడుఁ దడయక సంధ్యాదికృతంబు లవంధ్యప్రకాగంబున నొనరించి యథోచితంబుగఁ దృణాస్తరణంబగు ధరణిశయనంబునం బవ్వడించి నిద్రించుసమయంబున.

254


గీ.

ఆకృతఘ్నుండు బ్రాహ్మణునందుఁ జాల
ధనము గలుగుట వీక్షించి తత్తఱించి
అది సమస్తంబు మృచ్చిల నాత్మఁ దలఁచి
ప్రబలసంతమ సార్ధరాత్రంబునందు.

255


మ.

తనుఁ జాకుండఁగఁ బ్రోచినాఁ డనక వృద్ధబ్రాహ్మణుం బిన్నవాఁ
డని కొం కింతయు లేక తత్తనయునిన్ బ్రాణంబులం బిట్టు వా
పి నయం బింతయు లేక చేరి వెరజెం బేలైనతద్విత్తమున్
ధనకాంక్షాపరుఁడైనవానికి నిషేధం బేల చూపట్టెడిన్.

256


గీ.

వెతకబోయినతీఁగ వేవేగఁ గాలఁ
జుట్టికొనినట్లు కోరినయట్టియర్థ
మిట్లు దొరకిన సంతుష్టహృదయుఁ డగుచు
గనకలత కిత్తునని నిరాఘాటగతిని.

257