మ. విను భూపాలతనూజ నే యిదుకులోర్వీవల్లభుం డైన కృ
ష్ణుని నెయ్యంపు వయస్య నవ్విభు మహాశుద్ధాంతరంగంబులో
నన నర్తింపుచు నుందు నెల్లపనులన్ మందారమాలాఖ్య న
మ్మనుజేంద్రాభరణంబు నర్మసఖిగా మన్నించు న న్నెప్పుడున్. 91
క. మందరధరు ఖడ్గం బిది
నందకమనఁ బరఁగు నతని నామాంకనముల్[1]
పొందుగఁ దాలుచు రిపురా
డ్బృందాంగకసంగజనితభీతింబోలెన్. 104
గీ. అనిన నాయింతి నాచేతి యా కృపాణ
వల్లి యల్లన కొని పాణిపల్లవమునఁ
బట్టి తన చారువక్షోజభారమునను
జేర్చె నానందరసమగ్నచిత్త యగుచు. 105
గీ. దర్శనీయ యగుచుఁ దనరారు నీ ఖడ్గ
పుత్రి నాకుఁ బ్రాణమిత్ర మయ్య
నింతి నీకుఁ దక్క నిమ్ము నా కని సారె
నప్పు డా లతాంగి యడిగె నన్ను. 109
చ. అడిగిన గుట్టుచేసి దనుజాంతక నే నిటులంటి దానితోఁ
బడఁతుక నాకు నీకపటభావము సర్వముఁ గానవచ్చె న
ప్పుడ ప్రియమిత్ర మయ్యె నసిపుత్రిక నీకిదె నాకు నియ్యెడం
దడయఁ బనేమి పోయెద మదస్థిరులం దుచితంబ తౌల్యముల్. 110
గీ. కుదురు పాలిండ్లపైఁ జీరకొంగు జార
సంభ్రమంబునఁ బరతెంచి సకియ నాదు
కరముఁ గరమునఁ గీలించి కరము వినయ
భంగి మృదురీతి నిట్లని పలికె నపుడు. 116
గీ. ముదిత మున్నీటి నడునీట మునుఁగఁ బాఱు
నరున కోడయుఁ బోలె నై నాకు నీవు
చేరి తని యుండ డించిపోఁ జిత్తగించె
దింతి నాభాగ్య మెట్లైన నేరుపడదె. 118
- ↑ ప్ర.స.వ.-నామాంకణముల్-సా.ప.