ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సీ. అలమె దిక్చక్రవాళాచలప్రాచీన
మతులితగుణశాలితాప్తిచేత
విరియించె శాత్రవోర్వీనాథనీహార
ముగ్రాసి నవవసంతోదయమున
వాసించె బ్రహ్మాండభవనపేటికలను
సత్కీర్తికర్పూరనారమహిమ
నలరించె నాప్తమిత్రాననాంభోజముల్
ప్రచలితైశ్వర్య[1]ప్రభాతములను
తే. నతని వర్ణింపఁధగు మహోదాత్తపటహ[2]
భేరిభాంకారరవధావి తారినృపతి[3]
కామినీవేష్టితాహార్యగహ్వరుండు
ఘనుఁడు గోవిందమంత్రి నాగప్రభుండు. 39
సీ. ఆరసాతలగభీరాంబుపూరములుగాఁ[4]
గట్టించెఁ జెఱువు లుత్కంఠతోడ
నందనోద్యానకాననమున కెనగాఁగ
నొప్పుగా నిర్మించె నుపవనములు
గగనకూలంకషాకారశృంగములుగా
నిలిపించె దేవతానిలయసమితి
పక్వశాకాపూపపాయసాన్నంబులఁ
దనిపె ధాత్రీసురోత్తముల భుక్తి
తే. ననఁగఁ గొనియాడఁదగు సమస్తావనీశ
సభల సత్కీర్తి లక్ష్మీవిశాలుఁ డగుట
మహిమ గోవిందమంత్రి కుమారవరుఁడు
మారగుణహారి నారనామాత్యశౌరి. 40