ఆంధ్ర విశ్వవిద్యాలయంలో
పరిశోధనలు
ఆంధ్రశాఖ
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆంధ్రశాఖలో ఆంధ్రుల సంస్కృతి గురించి జరిగిన పరిశోధన గురించి క్రింద విశదీకరింపబడుతున్నది. అనగా, సిద్ధాంతవ్యాసము పేరు, పిహెచ్.డి డిగ్రీ వచ్చిన సంవత్సరము సిద్ధాంతవ్యాస రచయిత పేరు, పర్యవేక్షకుని పేరు, ఆ వ్యాస విషయము, క్రమముగా క్రింద సూచింపబడుతున్నాయి.
సిద్ధాంత వ్యాసములు (Ph.D.theses):
1. 'ఆంధ్ర ప్రబంధము - అవతరణ వికాసములు (1945)
రచయిత : డా.కె.వి. ఆర్. నరసింహంగారు
పర్యవేక్షకులు; ఆచార్య పింగళి లక్ష్మీకాంతంగారు
ఈ సిద్ధాంత వ్యాసములో ఆంధ్ర వాఙ్మయమునందు మిక్కిలి ప్రసిద్ధిపొందిన ప్రబంధశాఖమొక్క అవతరణము, వికాసము 28 ప్రకరణములలో వివరింపబడియున్నది. తెలుగులో ఇది మొదటి సిద్ధాంత వ్యాసము. ఆంధ్ర విశ్వవిద్యాలయప్రచురణ.
2. 'ఆంధ్ర వాఙ్మయముపై ఆంగ్ల ప్రభావము' (1956)
రచయిత : డా.కె. వీరభద్రరావుగారు
పర్యవేక్షకులు: ఆచార్య జి.కె. సోమయాజులుగారు
17వ శతాబ్దినుండి 20వ శతాబ్దమువరకు ఆంధ్రభాషా వాఙ్మయములమీద ఆంగ్లమునకున్న ప్రభావాన్ని ఈ సిద్ధాంతవ్యాసము వివరిస్తున్నది. ముద్రితము.
3. 'ప్రాచీనాంధ్ర శాసనములు' (1956)
రచయిత : డా.టి.వి. నారాయణశాస్త్రిగారు
పర్యవేక్షకులు : ఆచార్య జి.జె. సోమయాజులుగారు
రేనాఁటి చోళుల దగ్గరనుండి ఉన్న ప్రాచీన శాసనాలు పరిశోధించి అందులో వృత్తగ్రంథులున్నాయని శ్రీ నారాయణశాస్త్రిగారు నిరూపించినారు.
19