పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2014-15 ఆర్థిక మంత్రి ఉపన్యాసము.pdf/45

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

136. దశల వారీగా సుమారు 3,000 మెగావాట్ల పవన విద్యుత్ మరియు 2,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ సమకూర్చుకోవాలని ప్రతిపాదించడం జరుగుతున్నది. పవన మరియు సోలార్ విద్యుత్‌ల గ్రీన్ కారిడార్ ఎవాక్యువేషన్‌కి గాను రూ. 5,000 కోట్ల మేరకు పెట్టుబడి పెట్టాలని ప్రతిపాదించడం జరిగింది.

137. రాష్ట్రంలో వ్యవసాయదారులకు 7 గంటల ఉచితవిద్యుత్ సరఫరా చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. రానున్న కాలంలో రైతులకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా చేయబడుతుంది. గ్రామీణ ప్రాంతాలలో నాణ్యమైన, విశ్వసనీయమైన త్రీ-ఫేస్ విద్యుత్ సరఫరాకు గాను వ్యవసాయ ఫీడర్లు దశలవారీగా ఏర్పాటు చేయబడతాయి.

138. ఇందుకుగాను 2014-15 బడ్జెట్ అంచనాల్లో రూ.7,164 కోట్లు ప్రతిపాదించడమైనది.

నీటిపారుదల రంగం

139. రాష్ట్రానికి గోదావరి, కృష్ణా, పెన్నా అనే మూడునదులు వరదానంగా లభించాయి. ఈ మూడింటి కింద భారీ, మధ్య, చిన్నతరహా సాగునీటి పారుదల కింద 101.60 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నది. 2004 నుండి రూ. 80,620 కోట్ల అంచనా వ్యయంతో 54 భారీ, మధ్య తరహా సాగునీటి పథకాలు చేపట్టబడ్డాయి. ఈ 54 పథకాల్లో 13 పథకాలు పూర్తిచేయబడ్డాయి. 14 పథకాలు పాక్షికంగా నీరు సమకూరుస్తున్నాయి. ఈ పథకాల ద్వారా రూ. 19,378 కోట్ల వ్యయంతో 11.878 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి వచ్చింది. 8 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించబడింది.

43