పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2021-22.pdf/36

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కంపెనీల ద్వారా రూ.31,668 కోట్ల పెట్టుబడితో పాటు 67,716 మందికి ఉపాధి అవకాశాలు కూడా కల్పించబడతాయి.

73. కడప జిల్లా కొప్పర్తిలో 3,155 ఎకరాలలో, రూ.25 వేల కోట్ల పెట్టుబడితో, 2 లక్షల 50 వేల మందికి ఉపాధి అవకాశాలను కల్పించే విధంగా 'మెగా ఇండస్ట్రియల్ హబ్'ను మా ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఇదే సమయంలో, స్థిరమైన పట్టణ మరియు పారిశ్రామిక మౌళిక సదుపాయాలను సృష్టించడానికి పారిశ్రామిక నడవలైన (కారిడార్లు) విశాఖపట్నం - చెన్నై పారిశ్రామిక నడవ (V.C.I.C.) , చెన్నై-బెంగళూరు పారిశ్రామిక నడవ (C.B.I.C.) మరియు హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక నడవ (H.B.I.C.) లతో వివిధ పారిశ్రామిక, నోలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది.

74. కోవిడ్-19 మహమ్మారి కలిగించిన కష్టనష్టాలను తొలగించడానికి, ప్రభుత్వం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (M.S.M.E.)ల కోసం పునర్నిర్మాణ ప్యాకేజీని ప్రవేశపెట్టి, 11,238 యూనిట్లకు గాను, 904 కోట్ల 89 లక్షల రూపాయల ప్రోత్సాహకాలను విడుదల చేసింది. విద్యుత్తుపై లాక్డౌన్ సమయంలో కనీస డిమాండ్ ఛార్జీలను కూడా 3 నెలల పాటు మా ప్రభుత్వం మాఫీ చేసింది. 'వై.యస్.ఆర్. నవోదయం పథకం క్రింద 2,807 కోట్ల రూపాయల విలువైన 1 లక్ష 2 వేల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల రుణ ఖాతాలను పునరుద్దరించడమైనది.

75. రాష్ట్రంలో మూడు గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. 2021 మార్చి 28 నుండి ఉయ్యాలవాడ నరశింహారెడ్డి ఓర్వకల్ విమానాశ్రయం షెడ్యూల్డ్ విమానాల సమన్వయంతో హైదరాబాద్ మరియు విశాఖపట్నంలకు వాణిజ్య సేవలను ప్రారంభించింది. 2021-22 సం॥లోగా భోగాపురం గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం మరియు దగదర్తి గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలకు భూసేకరణ పూర్తవుతుందని భావిస్తున్నాము.

36