పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2019-20.pdf/34

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పరిపాలన

ప్రియః ప్రజానాం దాతైవ,
న పునః ద్రవిణేశ్వరః

అంటే,

ఎన్ని నీళ్లున్నా ఏం లాభం? ఎవరూ సముద్రాన్ని ఇష్టపడరు.
కాసిన్ని చినుకులు చిలకరించినా సరే, మేఘాన్నే కోరుకుంటారు.

97. ప్రస్తుతం రాష్ట్రంమంతటా బాధితులు చెప్పుకోలేని ఇబ్బందికి దారితీసే ఎన్ని భూ వివాదాలు ఉన్నాయనే విషయం అందరికీ తెలుసు. ప్రస్తుతం వున్న సర్వే రికార్డులు చాలా పాతవి. 1880 నుండి 1910 మరియు 1960 నుండి 1980ల మధ్యకాలంలో నిర్వహించిన సర్వేల సమయంలో తయారు చేసినవి. రికార్డుల కంప్యూటరీకరణతోపాటుగా తీసుకున్న అనేక చర్యలు, కృషి ఫలితంగా స్పష్టమయిన, ఖచ్చితమయిన భూ హక్కు పత్రాలు సృష్టించబడుతున్నాయి. రికార్డులను ఇంకా తాజాపరచలేదు. వాస్తవికతను ప్రతిబింబించడం లేదు. తగురీతిలో విషయపరంగా మరియు రేఖాత్మకంగా అనుసంధానించబడిన రికార్డు లేదు. ఇబ్బందులు లేని భూ రికార్డులను అందించే ఏకగవాక్ష వ్యవస్థ లేదు.

98. రాష్ట్రంలోని ప్రతి భూభాగం యొక్క అన్ని అంశాలను సమగ్రపరచడం ద్వారా భూమి రికార్డులను తాజాపరచడం మరియు నవీకరించడం, రియల్ టైం సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ ను నిర్వహించడం అవసరంగా ఉంది. సవివర భూ సర్వేను చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది. అన్ని అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పుడు వినియోగిస్తున్నట్టి, నిరంతరంగా నిర్వహించు సూచిక కేంద్రం (సీఓఆర్ఎస్), సాంకేతికతను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించడమైనది. ఈ సాంకేతికతను వినియోగిస్తూ, భూమి భాగాల జియో-కో-ఆర్డినేట్లు ఏ సమయంలోనైననూ నమోదు చేయబడవచ్చు. భవిష్యత్తులో ప్రతి వ్యక్తిగత భూ యజమాని జియో-కోడ్స్ ఉపయోగిస్తూ అతని / ఆమె భూమిని సొంతంగా గుర్తించగలుగుతారు. తిరిగి సర్వే చేస్తూ భూమి రికార్డులు నూటికి నూరు శాతం సరిగా ఉంచడానికి గ్రామ సచివాలయంలో గ్రామ సర్వేయరును నియమించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది మరియు ఆ తరువాత, గ్రామ స్థాయిలో మాత్రమే భూ సంబంధిత సమస్యలను పరిష్కరించడమవుతుంది.

34