పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(VOA) ప్రసంగం 2024-25.pdf/33

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

125. సుస్థిర పర్యావరణ ప్రమాణాలను పాటిస్తూ, ప్రజల రవాణా అవసరాలను తీర్చడానికి, తిరుపతిలో మా ప్రభుత్వం వంద ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశ పెట్టటం జరిగింది. వీటితోపాటు 1,500 కొత్త డీజిల్ బి. ఎస్. - VI బస్సులకు మా ప్రభుత్వం అనుమతులను ఇవ్వటం జరిగింది.

126. న్యాయ వ్యవస్థలో మౌలిక సదుపాయాల అభివృద్ధిని చేపట్టటంలో భాగంగా, మా ప్రభుత్వం 32 న్యాయ భవనాలను పూర్తిచేయగా, మరో 13 న్యాయ భవనాల నిర్మాణం పురోగతిలో ఉన్నాయి.

పట్టణ అభివృద్ధి

127. జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ ల కింద 1,426 ఎకరాలలో 12,042 ప్లాట్లతో ఎంఐజీ లేఅవుట్లను అభివృద్ధి చేస్తున్నాము. అమృత్ 2.0 క్రింద, 5,000 ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న 101 పట్టణ నీటి వనరుల పునరుజ్జీవనం ప్రాజెక్టు వ్యయం 189 కోట్ల రూపాయలు అలాగే 481 నగర ఆరోగ్య కేంద్రాలు కొత్తగా ఏర్పాటు చేశారు.

128. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం కింద, ఇంటింటికీ చెత్త సేకరణ మరియు వేరుచేయడం కోసం ULB లకు 3000 వాహనాలు అందించబడ్డాయి. గుంటూరు మరియు విశాఖపట్నంలో రెండు వేస్ట్-టు ఎనర్జీ ప్లాంట్లు ప్రారంభించబడ్డాయి. మొత్తం 123 ULB లలో లెగసీ వ్యర్థాల శుద్ధి ప్రారంభమైంది. జాతీయ స్వచ్ అవార్డులలో మూడు ULBలు టాప్ 10లో ఉన్నాయి.

ఇతర గ్రామీణ మౌలిక సదుపాయాలు

129. గ్రామీణ మౌలిక సదుపాయాల కింద, 10,893 గ్రామ పంచాయతీ భవనాలు, 10,216 వ్యవసాయ ఉత్పత్తుల గోదాముల నిర్మాణాలు, 8,299 భారత్ నిర్మాణ్ సేవా కేంద్రాలు మరియు 3,734 భారీ పాల శీతలీకరణ కేంద్రాలు నిర్మించబడ్డాయి.

33