పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/220

ఈ పుట ఆమోదించబడ్డది


వ.

ఇట్టినాలుగుదెఱంగుల భేద్యు లెట్టివా రన్నను విభునిచేత జీతంబులు
చెందని లుబ్ధుండును, నవమానంబు చెందిన యభిమానియు,
వెఱపింపఁబడిన భీతుండును, గోపింపఁబడిన కృద్ధుండును,
ననంబరగుచుండుదురు. తత్ప్రకారంబు గ్రమంబున వివరించెద.

139


సీ.

అళుకులఁ బెట్టింప నరుగుచుండెడివాఁడు
           మిగులంగఁ బేదయై నొగులువాఁడు
పతిచేతఁ జెఱుపఁగాఁబడిన ధర్మంబును
           గామంబు నర్థంబు గలుగువాఁడు
వెలుపట రొక్కంబు గలిగినవాఁడును
           నధికభోగముఁ గోరునట్టివాఁడు
వసుధ నెంచఁగ లుబ్ధవర్గమై దనరుదు
           రిట్టివారల మార్గ మెల్ల నెఱిఁగి


గీ.

యర్థములయందు మిగులఁగ నాశఁ గొల్పి
మఱియు నందుకుఁ దగినట్టి మాట లాడి
భేద మొందించవలయును బెంపుఁ జూపి
నీతిమార్గం బెఱింగిననృపవరుండు.

140


వ.

అభిమానిప్రకారంబు.

141


సీ.

కలహంబుపైఁ గాంక్ష గలిగియుండెడువాఁడు
            సాహసవృత్తి నెసంగువాఁడు
ధనముచేఁ గులముచేఁ దనకు నీడైనవాఁ
            డెంచ లేఁడంచు గర్వించువాఁడు
పూజార్హుఁడై యుండి పూజ నొందనివాఁడు
            నేపాటిమాపైన నెడయువాఁడు
సరిగానివానితో సాటిచేసినఁ గోప
            మంది సమర్ధుఁడైనట్టివాఁడు