4
అహల్యాసంక్రందనము
యానందభరితుండనై యుండ నన్నుఁ గనుంగొని యద్దేవుండు గంభీరమధుర
భాషణంబుల నిట్లనియె.13
తే. సముఖమీనాక్షినృపగర్భవిమలజలధి
చంద్ర, వేంకటకృష్ణేంద్ర, శౌర్యసాంద్ర,
మునుపు జైమిని భారత మనఁగ వచన
కావ్య మొనరించినట్టి సత్కవివి గావె!14
శా. వాసిన్ రంగవిభుండు నేను, ధరణిన్ వాక్ ప్రౌఢిమన్ నీ వహ
ల్యాసంక్రందన మన్ బ్రబంధము రసోల్లాసంబుగాఁ జేయ బే
రాసం గోరి వినంగ వచ్చితిఁ బ్రియం బౌనట్లు నాపేరిటన్
భాసిల్లం దగ నంకితంబు నొనగూర్పన్ నీకు మేలౌ నికన్.15
వ. అనియానతిచ్చుటయును దోడన మేలుకాంచి మేలుకాంచినహృద
యంబున నుదయంబునఁ గాల్యకరణీయంబులు నిర్వర్తించి యంత దందడి
మెఱయ బురోహితభృత్యామాత్యసామాజికబంధువర్గంబులు గొలువం
గూర్చుండి యుభయభాషాకవితావిశేషులైన శేషము వేంకటపతి, బుణిగె
కృష్ణకవీంద్రుఁడు నాకాప్తసఖులుఁ గావున వారిం బిలిపించి, యీశుభస్వ
ప్నంబు వినిపించుటయు, వారలు సంతోషభరితాంతరంగులై శ్రీరంగ
వల్లభుండు శ్రీభూమిసమేతుండై నీకుం గనుపట్టెం గావున నితోధికధనధాన్య .
కరితురగభటకదంబకాది నానావిధసంపదలును, బహుగ్రామభూములునుం
గలుగు; సప్తసంతానంబులలో నతిశ్లాఘ్యం బైన ప్రబంధసంతానంబు నిర్మింపు
మనియెం గావున శీఘ్రంబె మీతండ్రికి నీవు జనియించినచందంబున సకల
గుణాధారులైన కుమారులు నీకుం గలుగుదురు; స్వామిహితకార్యఘటనా
ధుర్యుండవు, బంధుజనపోషకుఁడవు, శ్రీరంగపతిపదారవిందమిళిందాయమా
నమానసుండవుం గావున నీ కిట్టిశుభస్వప్నంబు గలిగె; భవదీయవంశావ
తారక్రమంబు వర్ణించెద మాకర్ణింపుమని యిట్లనిరి:16
క. శరణంబులు జగముల కా
భరణంబులు వేదములకుఁ బంకజలక్ష్మీ