పుట:అమ్మనుడి మార్చి 2021.pdf/17

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాతృభాషే బోధనా మాధ్యమంగా ఉండేలా చూడాలని స్పష్టం చేశాడు. ఇలా అంటున్నామంటే మన విద్యావ్యవస్థలో ఇంగ్లీషుకు అసలెలాంటి స్థానమూ లేకుండా చేయడం కాదనీ, యూరప్‌, అమెరికాల్లో సాధించిన అభివృద్ధితో సంపర్కంలో ఉండడానికి ఇంగ్లీషు సాంగత్యం అవనరమనీ, ఇంగ్లీషు అంతర్జాతీయ భాషగా ఉంది కాబట్టి మన ప్రయోజనాలకోసమే దాన్ని ఒక ముఖ్యమైన ద్వితీయభాషగా చదువుకోవాలనీ తెలియజేశారు. (“సెలెక్టెడ్ వర్స్క్ఆఫ్‌ మౌలానా అబుల్‌ ఆజాద్‌” రవీంద్రకుమార్‌ (సంపాదకులు), సంపుటి. ౩ పుటలు 97-106).

1948 జనవరి 13న సెంట్రల్‌ అడ్వైజరీ బోర్డ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ 14 వ సమావేశంలో మాట్లాడుతూ “ఒక విదేశీ భాష ద్వారా విద్యనందించడం ప్రాధమికంగా తప్పు” అని నిక్కచ్చిగా అభిప్రాయపడిన మౌొలానా అజాద్‌ ఒక విదేశీ భాషద్వారా (ఇంగ్లీషుద్వారా) విద్యాభ్యాసం చేయడం ఒక మద్రాసీకి గాని, పంజాబీకి గాని, బెంగాళీకి గాని కష్టం కానపుడు ఒక భారతీయ భాషద్వారా (మాతృభాష) విద్యాభ్యాసం చేయడం వారికేవిధంగా కష్టమౌతుందని ప్రశ్నించారు. ఆంగ్లం కాకుండా ఏదేని భారతీయ భాషద్వారా విద్యాభ్యాసం చేయడంద్వారా కూడా భారతీయులు మేధోపరమైన ఐక్యతను సాధించగలరనీ, నిజానికి భారతీయ భాషల్లో విద్యాభ్యాసం చేయని పక్షంలోనే మన మేధోపరమైన ఐక్యత తప్పకుండా దెబ్బతింటుందనీ స్పష్తంగా చెప్పారు. కాబట్టి విశ్వవిద్యాలయ స్థాయి బోధన కూడా మాతృభాషా మాధ్యమంలోనే జరగాలని నొక్కివక్కాణించారు. (సంపుటి ౩పు. 113) విశ్వవిద్యాలయ స్థాయిలో బోధనా మాధ్యమ మార్పుకు సంబంధించిన విషయాన్ని చర్చించడానికి 1948 లో విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో సమావేశాన్ని యేర్పాటు చేశాడు. అందులో క్రమక్రమంగా ఇంగ్లీషుకు నుండి మాతృభాషలకు మారడానికి నిర్ణయం తీసుకోవడంతోపాటుగా ఉన్నత విద్యకు తోడ్పేడే విధంగా పారిభాషిక పదాలను తయారు చేసుకోవడానికి ఒక బోర్టును నియమించడానికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. (సంపుటి. 6,పు. 233)

1951 మార్చి 15న ఆల్‌ ఇండియా కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ లెటర్స్‌ మొదటి సమావేశంలో ప్రసంగిన్తూ బ్రిటీష్‌ పరిపాలనా కాలమంతటిలోనూ యూనివర్సిటీ స్థాయిలో మాతృభాషలు బోధనామాద్యమంగా లేకపోవడంచేత వాటి అభివృద్ధి కుంటుపడిందనీ, స్వతంత్ర భారతదేశంలో వాటికి గుర్తింపూ, గౌరవం లభించాయి కాబట్టి, రాబోయే 15 సంవత్సరాలలో అవి యూనివర్సిటీ స్థాయిలో ఇంగ్లీషు స్థానాన్ని అక్రమించబోతున్నాయి కాబట్టీ ప్రభుత్వాల తోడ్పాటుతోనూ, యూనివర్సిటీ స్థాయి విద్యాబోధనతోనూ దేశీయభాషలు (మాతృభాషలు) అభివృద్ధి చెందబోతున్నాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. (సంపుటి 5,పు. 15)

ఉన్నత విద్యలో మాతృభాషా మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నాక ఈ మార్గాన్ని సులభతరం చేసుకోవడానికి పారిభాషిక పదాలను తయారు చేసుకోవాల్సిన అవసరం గూర్చి ఆలోచించారు మౌలానా ఆజాద్‌. 1948 జనవరి 16న కొత్తడిల్లీలో జరిగిన “ఆల్‌ ఇండియా ఎడ్యుకేషనల్‌ కాన్ఫరెన్స్‌లో ప్రారంభోపన్యాసం చేస్తూ పారిభాషిక పదాలు అంతర్జాతీయంగా ఆమోదం పొందినవి కాబట్టి వాటిని దేశీయభాషల్లోకి అనువదించుకోవాల్సిన అవసరం లేదన్నారు. సెంట్రల్‌ అడ్వైజరీ బోర్డ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ కూడా దీనికి అంగీకరించిందని తెలియజేశారు. తన వాదనకు వత్తాసుగా ఈజిప్టును ఉదహరించారు. అది అరబిక్‌ నుండి పారిభాషిక పదాలను తయారుచేసుకున్నప్పటికీ తర్వాత వాటిని యథాతథంగా వాడడానికే నిశ్చయించుకొంది ఎందుకంటే పారిభాషిక పదాలు అంతర్జాతీయంగా ఆమోదించబడి ఉన్నాయి. టర్కీ ఇరాక్‌, చైనా, జపాన్‌లుకూడా ఈ పద్ధతినే అవలంబించాయని తెలిపారు. అయినప్పటికీ తత్త్వశాస్త్రం, తర్కం, గణితం, మొదలైన వాటిల్లో ప్రాచీన భారతదేశంలో వాడుకలో ఉన్న పదజాలాలను వాడాలని సలహా ఇచ్చారు. (సంపుటి3,పు. 121-122)

కానీ 1950 నాటికి పారిభాషిక పదాలను యథాతథంగా వాడాలనే ఆలోచనను ఆయన మార్చుకొన్నట్లుంది. 1950 మార్చి 15 న పార్లమెంటులో సాధారణ బడ్జెట్‌ సమావేశంలో మాట్లాడుతూ యూనివర్సిటీ స్థాయిలో మాతృభాషలో విద్యాబోధన చేయాలంటే పారిభాషిక పదాలకు సంబందించిన అదిపెద్ద సమస్యను ఎదుర్కొనాల్సి వస్తోందని వివరించారు. అందుకే హిందీకి సంబంధించినంతవరకు పారిభాషిక పదాలను తయారు చేయడానికి ఒక బోర్జును నియమించడానికి కేంద్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. సదరు బోర్జుకు పారిభాషిక పదాల నిఘంటువును తయారుచేసే బాధ్యతను అప్పగిస్తామన్నారు. దీనికోసం బడ్జెట్‌లో కొంతమొత్తం కేటాయించినట్లుకూడా తెలిపారు. వివిధ రాష్ట్రప్రభుత్వాలు కూడా తమతమ ప్రాంతీయ భాషల్లో పారిభాషిక పదాల నిఘుంటువులను తయారు చేయాలని వాంచించాయి.(సంపుటి. 4పు. 217)

భాషాపరమైన మైనారిటీల హక్కులకు సంబంధించి కూడా మౌలానా అజాద్‌కు స్పష్టమైన అభిప్రాయాలుండేవి. వారి హక్కుల పట్ల ఆయన మిక్కిలి సున్నితత్వాన్ని ప్రదర్శించాడు. ఏదేని ఒక రాష్ట్రంలో అ రాష్ట్రభాషకు భిన్నమైన మాతృభాషను కలిగి ఉండిన భాషాపరమ్లైన మైనారిటీల సమూహానికి తమ మాతృభాషలో విద్యాభ్యాసం చేసే హక్కూ అవకాశమూ ఉండాలని నొక్కిచెప్పారు మౌలానా అజాద్‌. సెంట్రల్‌ అడ్వైజరీ బోర్డ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌లో ఈ విషయానికి సంబంధించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని ప్రకారం ప్రాధమిక స్థాయిలో కనీసం 40 మంది విద్యార్థులూ, మాధ్యమిక స్థాయిలో “తగినంతమంది” ఉంటే వారి మాతృభాషలో విద్యనందించే విధంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తగిన యేర్చాట్లు చేయాలని కోరారు. 1949 ఫిబ్రవరి 25 న కేంద్రశాసన సభలో ఈ విషయానికి సంబందించి జి.యస్‌.గుహ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. కొన్ని రాష్ట్రాల్లో భాషాపరమైన మైనారిటీలు మాతృభాషలో విద్యార్జన హక్కుకు సంబంధించిన ఉల్లంఘనలకు సంబంధించి తనకు ఫిర్యాదులందుతున్నాయని ఆవేదనతో అన్నారు. (సంపుటి. 4ఉ పు.67)

1949 ఆగష్టు 19న కొత్తడిల్లీలో జరిగిన వివిధ రాష్ట్ర ప్రభుత్వాల తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * మార్చి-2021 |