పుట:అమ్మనుడి జనవరి 2021 సంచిక.pdf/23

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంవ్రదాయం - సాధికారత

డా. పి. శివరామకృష్ణ 'శక్తి ' 9441427977


అమ్మనుడి కోసం తపించిన 'జంగల్‌ నామా” సత్నాం

పంజాబి రచయిత సత్నాం- గెరిల్లా దళాలతో కలిసి, బస్తర్‌ తిరిగి రాసిన అనుభవాలను 'జంగల్‌ నామా 'గా


అంగ్లంలో, అదేపేరుతో తెలుగులో వచ్చింది. ఆఫ్రికన్‌ రచయిత గుగిలాగే అతడు గోండుజాతి జ్ఞాపకాలను వినాలని తపించాడు. 'గోండుతెగవారిలో కథలు చెప్పుకునే సంప్రదాయం ఒకటి ఉంది ఉంటుంది. కానీ గెరిల్లాదళ నాయకుడు రాజు నడిగితే తను ఇప్పటివరకు విన్న కథలేవీ లేవన్నాడు.నేను చాలామందిని అడిగాను కానీ వారికీ కూడా మనవళ్ళకు మనవరాళ్ళకు కథలు చెప్పే తాతయ్యలు, నాయనమ్మలు కనబడలేదట. దక్షిణ బస్తర్‌లో గిరిజనులకు పాటలు పాడుకునే సంప్రదాయం ఉన్నది. కానీ రాజు అతని మిత్రులకు తెలియని కథలు ఏవో ఉండి ఉంటాయి. కథ అంటే ఒక ఆలోచనల సమాహారపు సృష్టి, లేదా మనిషి సాధించిన విజయాల జ్ఞాపకాలను సజీవంగా ఉంచే ప్రయత్నం. ఒకతరం నుండి మరోతరానికి అందివచ్చే క్రమంలో ఇవే పురాణాలుగా మారతాయి.

వారు పాడే పాటలు వినండి, మనుషులను ఎలా సంఘటిత పరుస్తాయో ! నారిని నిర్దేశించే వారెవరూ లేకున్నా మొత్తం గ్రామస్తులంతా కలిసి ఆడి పాడతారు. వారి పాదాలను చూడు, ఎంత లయబద్ధంగా నాట్యం చేస్తున్నాయో! లయబద్దత వారికి సహజంగా వస్తుంది. దాన్ని ఏ పాఠశాలలో నేర్పరు. వారికి నిజానికి జీవితమే ఒక పాఠశాల. ప్రతిఒక్కరూ బస్తర్‌ చలామణిలో అటువంటి పురాగాథలు గురించి తెలుసుకోవాలనే నేను ప్రయత్నించాను ఇంకొంచెం సమయం ఉండుంటే ఈ విషయాన్ని లోతుగా పరిశిలించేవాడిని. అయినప్పటికీ ఇటువంటి సాహసగాథ ఒకటి నాకు పరిచయం అయ్యింది. 1910లో బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు లేవదీసిన గుండధుర్ అనే సాహసవీరుడి గురించి తెలిసింది. ఎందుకోగాని గుండధుర్‌ కథ అటు పాటలరూపంలో కానీ కథారూపంలో ఇక్కడి ప్రజలలోకి వెళ్ళలేదు. దండకారణ్యంలో గెరిల్లాలు నిరహించిన సదస్సులో తెలుగుపాత్రకేయ మిత్రుడొకడు నాకు గుండధుర్‌ గురించి ..గోండులు ఇతర గిరిజనులపై ఎన్నో పుస్తకాలు రాసిన వేరియర్‌ ఎల్విన్‌ గురించి కూడా చెప్పాడు ఇలా గుగీ లాగా, సత్నామ్‌ వాళ్ళ జ్ఞాపకాలు తెలుసుకోడానికి తాపత్రయ పడుకుంటే, వాళ్ళ ఆకలి బాధకు అవి ఎగిరిపోయాయి. గెరిల్లాలు పాడే విప్లవ గీతాలే మిగిలాయి అంటారు తెలుగు అనువాదం సంపాదకులు. దక్షిణ బస్తర్‌లో ఉన్న సంప్రదాయం విప్లవ రాజ్యంలో అంతరించడం విచారకరం.

“బంగారపు కంచానికైనా గోడ చేర్పు “అమ్మనుడి. కావాలి.

వరంగల్‌ జిల్లాలో బంజారా పిల్లలు ఎక్కువగా చదివే ప్రాంతంలో కారేపల్లి జూనియర్‌ కళాశాలలో ఉపాధ్యాయుడు సీతారాం ఏంతో విమర్శనాత్మకంగా రాసిన అనుభవాలు కారేపల్లి కబుర్లు .ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ “ప్రతివిద్యార్థి ఇంగ్లీష్‌ ఖచ్చితంగా పాస్‌ అయ్యేందుకు కృషి చేశారు. స్వయంగా ఆంగ్లం భొధించారు. స్లిప్‌ టెస్ట్‌లు పకడ్బందిగా పెట్టారు. చదువు తప్ప మరోపని లేకుండా చేశారు .ఆయన కృషి ఒక విపరీత సంస్కృతి ఏర్పరిచింది అంటున్నరచయిత సీతారాం. పరిశీలన, చిరకాలం గిరిజన విద్యారంగంలో పనిచేసిన చినవీరభద్రుడి 'కొన్ని కలలు, మెలకువలు ' ఆయన సంతోష చంద్రశాలలో చదువుకొత్తల అనుభవాలతో రాసిన “బడికతలు” గుర్తుకు వస్తాయి. ఆ విపరీత సంస్కృతి గిరిజనపిల్లలను మరబొమ్మలుగా మార్చిన క్రమాన్ని సీతారాం ఇలా వివరిస్తాడు.

'గిరిజన పిల్లల్లో ఉండే పట్టుదలను ప్రిన్సిపాల్‌ channelse చేయగలిగారు. అయితే ఆ పిల్లల సృజన సామర్ధ్యాలను పెంచటంలో జరిగిన కృషి పెద్దగా ఏమీలేదు. పిల్లలు ఎంత మెటిరియల్‌ ఇచ్చినా చదివి పారేస్తారు తప్పు స్వయంగా ఆలోచించరు. ఫలితాల సాధన అనే మహత్తర లక్ష్యం ఉపాధ్యాయుల ముందు ఉండటం చేత విద్యార్థుల సృజనసామర్థాన్ని గురించి ఆలోచించే వ్యవధిని వారు తీసుకుపోలేకపోయారు. కాంట్రాక్టు పద్ధతిలోని టీచర్ల భయం, జిల్లా సగటుకన్నా తగ్గితే ఉద్యోగం పోతుందనే భయం వల్ల ఆ భయం పిల్లలకు బదిలీ అయింది. వాళ్ళు కూడా తమకు ఆలోచనాశక్తి ఉందనే విషయాన్ని విస్మరించారు. పోనీ ఇదైనా జరిగితే మేలే అని సరిపెట్టుకోడానికి వీలుచిక్కటం లేదు. పిల్లలు ప్రశ్నించటం మరిచిపోయారు. జ్ఞాపకం ఉండటమే జ్ఞానం అనేస్థాయికి చేరుకున్నారు.

తరగతిలో పాఠం వింటున్న పిల్లలకు ప్రశ్నలు పుట్టటం లేదంటే ఆలోచించే శక్తి ఆగిపోయింది అని. ఒక వేళ ప్రశ్నించమని ప్రొత్సహించినా ఏం అడగాలో తెలియని పరిస్థితికి పిల్లల మెదళ్ళు మూసుకుపోయాయి. రాష్టంలో రెండవ స్థానంలో ఫలితాలు సాధించిన కళాశాల సాధించిందేమిటి?

గిరిజన విద్యార్థులను, వారి అభ్యసనపద్దతులను గమనిస్తే మనకొక సంగతి విశదమౌతుంది ఈ పిల్లల తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జనవరి-2021 |