నాగార్జున కొండ


రచయిత:

మారేమండ రామారావు, యం ఏ , పిహెచ్ డి.

చరితాచార్యుడు - నిజాంకళాశాల

ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు

అజంతా ప్రచురణ

పీఠిక

బుద్ధభగవానుడి ధాతువుమీద నిర్మించబడిన మహాచై త్యమున బోధిసత్వ నాగార్జునుడు నివసించిన శ్రీపర్వతమూ, కళాపిపాసులు సమ్యక్సంబుద్దపాదభక్తులూ అయిన ఇక్ష్వాకు రాజపుత్రికలు తయారు చేయించిన లోకోత్తరశిల్పాలూ, ఇక్ష్వాకు చక్రవర్తుల రాజధాని ఆయిన: విజయపురీ గల నాగార్జునకొండలోయ ఆంధ్రులందరికీ పుణ్యస్థలము 1828 నుంచీ యిక్కడ జరుగుతూన్న ఖననపరిశోధనకి ఫలితం ఇక్కడ ఎన్నో అద్భుతములైన అవశేషాలు వెలికి వస్తున్నాయి.

నాగార్జునసాగరకట్ట నిర్మాణం పూర్తి అవడంతో ఈలోపుల యావత్తూ కృష్ణాజలంలో లీనం అయిపోతుంది. ఆ మీద ఈ పుణ్యస్థల "కలలోని వార్త" అయిపోతుంది. ఈలోగానే ఇక్కడికి యాత్ర చేసి ఈ పుణ్యస్థలాన్ని దర్శించి ఆంధ్రులంతా తమ విధిని నిర్వహించాలి ఈ లోయ విగురించిన వివరాలు ప్రభుత్వంవారి ప్రచురణలలో ఉన్నవి. అవి సామాన్యులకి అందుబాటులో లేవు. ఈ పుణ్యక్షేత్రాన్ని చూడబోయేవారి ఉపయోగార్థం ఈ చిన్న పుస్తకం వ్రాయబడింది. దీనికి నాగార్జునకొండ ప్రాముఖ్యం సంగ్రహంగా చెప్పబడింది. ఇక్కడ శిల్పాల ఫొటోలు కొన్ని పుస్తకం చివర వేయబడినవి మిగతవి ఎక్కడ లభిస్తాయో సూచించబడింది.

ఈ గ్రంథం విషయమై ఆసక్తి చూపి, దీనిని చక్కగా ముద్రించి ఆజంతా ప్రచురణాధిపతులకు నా కృతజ్ఞత.

ఈ పుస్తకం ఆంధ్రలోకం యొక్క ఆదరాభిమానాలని పొందుతుందని నేను ఆశిస్తున్నాను.
హైదరాబాదు)
11- 12--1956

మారేమండ రామారావు

సుప్రసిద్ధమైన బౌద్ధతీర్థం ఒకటి ఉండేది. ఇక్కడ అంతకుపూర్వమే బుద్ధుడి ధాతువుమీద నిర్మించబడిన మహాచైత్యం ఉండేది. అది ఖిలం అయిపోతే ఇక్ష్వాకు రాజులకాలంలో దానిని జీర్ణోద్ధారం చేసి, దానికి చక్కని శిల్పాలుగల చలవరాతి పలకలు మలిచారు. చైనా, సింహళం మొదలయిన దూరదేశాలనించి అనేకమంది బౌద్దులు ఇక్కడి తీర్థాన్ని దర్శించడానికని యాత్రలు చేశారు.

ఈ విధంగా చెట్లు చేమలతోటీ, వన్యమృగాలతోటీ భయంక రంగా ఉంటూ వచ్చిన ఈ నాగార్జునకొండలోయ ఒక్కసారిగా తన పూర్వవైభవాన్ని బయలుపరచింది. ఇక్కడికి దగ్గరలోనే నంది కొండవద్ద ప్రభుత్వంవారు కృష్ణకి అడ్డంగా ఒక కట్ట నిర్మిస్తు న్నారు. దీనికి ఫలితంగా కృష్ణ నీరు పైకి ఎగతన్ని నాగార్జునకొండ, లోయ యావత్తునూ ముంచివేస్తుంది. అందుకని ప్రభుత్వంవారు ఈలోయ అంతటా ఖననపరిశోధన సాగించి ఇక్కడి ప్రాచీ నావ శేషములనన్నిటినీ బయటికి తరలించడానికి ప్రయత్నం చేస్తున్నారు. 2 నాగార్జునుడు, నాగార్జున కొండ

ఈ నాగార్జునకొండలోయలో కృష్ణ ఒడ్డున నాగార్జునకొండ అనే పేరుగల పెద్దకొండ ఒకటి ఉన్నది. ఈ కొండకి ఈ పేరు నాగార్జునుడనే వ్యక్తినిబట్టి వచ్చి ఉంటుంది. ఈ కొండకి ఈ పేరు చిరకాలంనించీ ఉంటూ వస్తున్నది. అందువల్ల నాగార్జునుడి సంబంధాన్ని గురించి ఇక్కడ సంగ్రహంగా చెప్పడం ఉచితం. బౌద్ధుల వాజ్మయంలోనూ, గాథలలోనూ నాగార్జునుడి పేరు తరుచుగా కనిపిస్తుంది. ఈ ప్రశంస చైనా, టిబెటు దేశాలలో ఎక్కువగా ఉన్నది. నాగార్జునుడనే పేరుగల వ్యక్తులు ఇద్దరు ఉండేవారు. అందులో ఒక నాగార్జునుడు క్రీ. శ. 2వ శతాబ్దిలో ఆంధ్రసాతవాహనచక్రవర్తి అయిన యజ్ఞశ్రీ సొతకర్ణి సమకాలి కుడుగా వుండేవాడు. రెండవ నాగార్జునుడు క్రీ. శ. 6వ శతాబ్దిలో ఉండేవాడు. ఇద్దరూ ఆంధ్రదేశంలో బౌద్ధమత ప్రచారం చేశారు మొదటి నాగార్జునుడు నాగార్జున జోధిసత్వుడనీ, నాగార్జున పూస అనీ చాలా ప్రసిద్ధి కెక్కాడు. విదేశాలలో ఈ మహా నీయుడు బుద్ధుడి తరువాత మళ్ళీ అంతటి వాడని కీర్తి చెందాడు టిటెటు దేశంలోని ఒక గాథననుసరించి ఇతడు శ్రీపర్వతముమీద నివసించినట్లు తెలియవస్తుంది. ఈ శ్రీపర్వతమనే పేరు నాగార్జుని కొండకి వర్తిస్తుంది. అందువల్ల నాగార్జున బోధిసత్వుడు ఈ కొండమీద నివసించడంవల్లనే ఈ కొండకి నాగార్జునకొండ అనే పేరు వచ్చింది అని నిర్ణయించవచ్చును.

ఈ నాగార్జునుడు విదర్భ దేశంలో జన్మించిన బ్రాహ్మణుడు. మహా మేధావి అయిన ఇతడు బాల్యంలోనే సర్వశాస్త్రములను అభ్యసించి, హేతువిద్యలోనూ, ఇంద్రజాలంలోనూ నిపుణుడు ఆయాడు. యౌవనంలోనే సన్యసించి ఇతడు దేశాటనం చేశాడు. హిమాలయాలలో ఒక ముసలి భిక్షువువద్ద ఇతడు ఎన్నో మహా యాన బౌద్ధమత గ్రంథాలని చూచి, వాటి సారం గ్రహించాడు. అమీద నాగార్జునుడు సింహళద్వీపానికి పోయి అక్కడనించి మరి కొన్ని గ్రంథాలు తెచ్చాడు. వీటిలో చాలా గ్రంథాలమీద ఇతడు చక్కని వ్యాఖ్యానాలు వ్రాసి మహాయానమతం అందరికీ తెలిసే టట్టు చేశాడు. ఆమీద ఈ మహనీయుడు తన పాండిత్యాన్ని, ఉపజ్ఞనీ తోడుచేసుకొని మాధ్యమికవాదమూ, శూన్యవాదమూ అనే క్రొత్త సిద్ధాంతాలని ప్రతిపాదించి, ప్రచారం చేశాడు. అనేక మంది శిష్యులూ, ప్రశిష్యులూ ఈ సిద్ధాంతాలని దేశమంతా ప్రచారం వేశారు. ఈ ఆచార్యుడు వ్యాఖ్యానములుకాక 24 స్వతంత్ర గంథాలు వ్రాశాడు. నాగార్జునుడు కొంతకాలం కుషాను రాజైన హువిష్కుడి ఆస్థానంలో ఉన్నాడు. అమీద విదర్భలో ఒక సంఘారామంలో ఇంతకాలం నివసించాడు. చివరకి కృష్ణాతీరాన వున్న శ్రీపర్వతం (నాగార్జునకొండ) మీది విహారంలో జీవిత శేషం గడిపాడు. ఈ బౌద్ధాచార్యుడు భార దేశపు తాత్త్వికులలో అగ్రశ్రేణికి చెందినవాడు. ఇతడు వైద్యశాస్త్రంలో మంచి ప్రావీణ్యం సంపాదించి సుశ్రుతమనే ఆయుర్వేద గ్రంధానికి వ్యాఖ్యానం వ్రాశాడు. ఇతనికి రసాయనశాస్త్రంలో చక్కని ప్రవేశం ఉండేది స్వర్ణ యోగం కని పెట్టి ఇతడు రాళ్ళను బంగారంగా మార్చాడట !

' యజ్ఞశ్రీ చక్రవర్తి ధాన్యకటకం (అమరావతి) లోనూ, బోధిసత్వ నాగార్జునుడు శ్రీపర్వతం (నాగార్జునకొండ) మీదనూ నివ సిస్తూ, ఇద్దరూ మిత్రులై చాలా సన్నిహితులుగా ఉండేవారు. ఈ బౌద్ధాచార్యుడి ప్రేరణవల్లనే జగత్ప్రసిద్ధమైన అమరావతీ మహా చైత్యానికి లోకోత్తరమురైన శిల్పములతో అలంకరింపబడిన ప్రాకారం నిర్మించబడింది.

ఈ విధంగా శ్రీపర్వతంమీద నివసించి బోధిసత్వ నాగార్జునుడు నాగార్జునకొండలోయనీ, యావదాంధ్రదేశాన్ని కూడా పవిత్రం చేశాడు.

ఇక్ష్వాకు రాజులు

క్రీ శ 3వ శతాబ్దిలో నాగార్జునకొండలోయలోని విజయపురి రాజధానిగా సుమారు ఏభై సంవత్సరాలకాలం దక్షిణాపధ ప్రాగ్భాగాన్ని ఇక్ష్వాకువంశీకులైన రాజులు పరిపాలించి ప్రఖ్యాతులైనారు. వీరి పరిపాలనాకాలం ఆంధ్రదేశ చరిత్రలో ముఖ్యమైన ఘట్టం. పురాణములలో ప్రాచీన రాజవంశముల ప్రశంస ఉన్నది. వాటిలో ఆయా రాజవంశముల పేర్లు, వంశముల క్రమమూ, ఆ వంశాలలోని రాజుల పేర్లూ, వారి పరిపాలనాపరిమితీ మొదలయిన అంశాలు ఉన్నవి ఇందులో ఆంధ్రరాజుల ప్రశంసకూడా ఉన్నది. ఈ ఆంధ్రరాజులే సాతవాహనరాజులు. ఈ ఆంధ్రసాత వాహనవంశంలో ముప్పయిమంది రాజులు 450 సంవత్సరాలు పరిపాలించినతర్వాత క్రీ. శ. 218 ప్రాంతంలో వారి సామ్రాజ్యం అంతరించింది. ఆతర్వాత మరి 50, 60 సంవత్సరముల కాలం అనేక రాజవంశములవారు సమకాలికులుగా పరిపాలించారు. ఇందులో కొందరు సాతవాహనుల కాలంనించీ ఉంటూ వచ్చారు. ఇట్లాంటి వారిలో ఆంధ్రభృత్యులూ, శ్రీపర్వతీయులూ ముఖ్యులు. ఈ రెండువంశాలవారూ ఆంధ్రులలోనివారే అని పురాణములలో చెప్పబడిఉన్నది. పురాణములలోని శ్రీపర్వతీయులే, శాసనముల వల్ల తెలియవచ్చే ఇక్ష్వాకువంశీయులని చరిత్రకారులు నిర్ణ యించారు.

ఇక్ష్వాకువంశం చాలా ప్రాచీనమైనది. వేదవాజ్మయం లోనూ, పురాణములలోనూ ఈ వంశం ప్రశంస ఉన్నది. ఈ వంశపు రాజులు అయోధ్యా, మిథిలా, వైశాలీలవంటి కేంద్రాల నించి రాజ్యం చేశారు. ఈ వంశీకులు అనేకమంది దక్షిణాపథానికి వలస వచ్చి ఇక్కడ స్థిరపడి కొన్ని రాజ్యాలు స్థాపించుకున్నారు. వీరిలో కొందరు ఆంధ్రులలో కలిసిపోయి, క్రమక్రమంగా దక్షిణంగా వ్యాపించి, సాతవాహనసామ్రాజ్యం వైభవంగా సాగుతూన్న కాలంలో నాగార్జునకొండప్రాంతంలో స్థిరపడ్డారు. క్రీ. శ. 2వ శతాబ్దిలో ఈ వంశీకులలో కొందరు ప్రబలులై సాతవాహన చక్రవర్తులకు మహాతలవరు లనే పేర సామంతులుగా ఉండేవారు, క్రీ. శ. మొదటి పాదాంత్యంలో సాతవాహన సామ్రాజ్యం క్షీణించింది. నాలుగవ పులోమావి అనే రాజు మరణించడంలో అది అంతరించింది. ఆమీద సామంతులు స్వతంత్రులయారు. రాజవంశం యొక్క వివిధశాఖలవారు ఎక్కడివారు అక్కడ స్వతంత్రులై. ఎవరికి దొరికిన భూమిని వారు ఆక్రమించి స్వతంత్రంగా పాలిస్తూ వచ్చారు. ఈ సమయంలో వాసిష్ఠీపుత్ర చాంత మూలుడనే ఇక్ష్వాకు వంశీయుడు విజృంభించాడు. సామంతమండలీకులు కొంత మందిని కూడగట్టుకుని ఇతడు దిగ్విజయం ప్రారంభించి, మిగిలివున్న సాతవాహన వంశీయులందరినీ జయించి స్వతంత్ర రాజ్యస్థాపన చేశాడు. ఇక్ష్వాకువంశంలో నలుగురు రాజులు స్వతంత్రులుగా పరి పాలన చేశారు. వారిలో మహారాజ వాసిష్ఠీపుత్ర చాంతమూలుడు మొదటివాడు. ఇతనిని మొదటి చాంతమూలుడనికూడా వ్యవహ రిస్తారు. ఇతనికి చాంతిశ్రీ, హమ్మశ్రీ అని యిద్దరు సోదరీలు ఉండేవారు. ఈ రాజు భార్య మాఢరీదేవి. మొదటి చాంతమూలుడికి మహారాజ శ్రీవీరపురుష దత్తుడనే కుమారుడు, అడవి చాంతిశ్రీ అనే కుమార్తె ఉండేవారు. ఇందులో పురుషదత్తుడు ఉజ్జయినీ రాజపుత్రిక అయిన రుద్రధర భట్టారికను, భటిదేవను, తన మేనత్తల కుమార్తెలు ముగ్గురినీ వివాహం చేసుకున్నాడు. ఇతనికి మహారాజ ఏహువుల చాంతమూలుడనే కుమారుడూ కొడబలిశ్రీ అనే కుమార్తె వుండేవారు. వీరిలో కొడబలిశ్రీ వన వాసిమహారాజును వివాహం చేసుకున్నది. ఇక్ష్వాకుల ఆడపడుచులు కొందరు ధనకులు, పూగియులు అనే తెగలవారికి కోడళ్లుగా వెళ్లారు. ఇక్ష్వాకువంశంలోని కడపటిరాజు శ్రీరుళుపురుషదత్తుడు.

ఇక్ష్వాకు వంశీయులు 100 సంవత్సరములు పాలించినట్లు కొన్ని చోట్లను, 52 లేక 50 సంవత్సరములు పాలించినట్లు కొన్ని చోట్లను పురాణములలో చెప్పబడి ఉన్నది. ఈ రెండు కాలపరి మితులూ సరియైనవే కావచ్చును. ఈ రాజుల శాసనములను బట్టి వీరు 35 సంవత్సరములైనా పరిపాలించినట్లు తెలుస్తూంది. మొదటి చాంతమూలుడు ఎంతకాలం ఏలినదీ సరిగా తెలియదు. (అతడు 16, 17 ఏళ్ళు పాలించి ఉండవచ్చును. ఇక మిగిలిన 50 సంవత్సరములూ ఇక్ష్వాకులు సాతవాహనులకు సామంతులై మహా తలవరులుగా ఏలినకాలం కావచ్చును మొదటి చాంతమూలుడు క్రీ శ. 218_285 నడుమ, వీరపురుషదత్తుడు క్రీ శ. 235_255 నడుమ, రెండవ చాంతమూలుడు 255_266 నడుమ, రుళపురుష దత్తుడు 268_270 నడుమ పరిపాలించినట్లు నిర్ణయించవచ్చును.

మొదటి చాంత మూలమహారాజు : ఇతడు మహావైభవంతో పరిపాలన చేసిన ప్రతిభాశాలి. ఇతడు అశ్వ మేధాగ్నిష్టోమ వాజ పేయాగ్నిహోత్రము లనే యజ్ఞములను చేశాడు. అనేక కోటి గోదానములను' హిరణ్యహలశతసహస్రదానములను చేశాడు. " ఇతడు అప్రతిహత సంకల్పుడు. మహాసేనుడనే కుమారస్వామి భకుడు. అశ్వమేధయాగం చేయడం చాలా కష్టసాధ్యం అయిన పని. అనేకమంది రాజులు తన అధికారానికి తలలొగ్గిన పరాక్రమశాలిగాని ఈ యజ్ఞం చెయ్యలేదు. అలాగే వాజపేయ యాగం చేయడానికి ఎంతో అర్థబలం, అంగబలం కావాలి. ఈ యజ్ఞములు చేసి చాంతమూలుడు సమ్రాట్ సార్వభౌమ బిరుదులను వహించాడు. నాగార్జునకొండలో దొరికిన ఒక స్తంభంమీద ఈ మహా రాజు హిరణ్యదానంచెయ్యడం యజ్ఞములు చేసినతర్వాత ఊరేగడం శిల్పించబడినవి. ఇతని రాజ్యం పశ్చిమోత్తరంగా ఉజ్జయినీ పాలకులయిన శకక్షాత్రపుల రాజ్యం వరకూ, దక్షిణ పశ్చిమాన వనవాసీపాలకు లైన ఆంధ్రభృత్యుల రాజ్యంవరకూ వ్యాపించి ఉండేవి. చాంతమూలుడు మంచి రాజనీతి చతురుడు. ఇతడు తన సోదరి చాంతిశ్రీని పూగియులనే తెగకు చెందిన స్కందశ్రీ, తన కూతురు అడవిచాంతి శ్రీని ధనకులనే తెగకు చెందిన స్కంద . విశాఖుడికీ వివాహము చేసి ఇరుగుపొరుగువల్ల ప్రమాదం రాకుండా చేసుకున్నాడు. నాసిక ప్రాంతంలో విజృంభిస్తూండిన ఆధీడులబల్ల ఏప్రమాదం రాకుండా వారికి పొరుగున రాజ్యం చేస్తున్న శకక్షేత్రవుల ఆడపడుచు రుద్రధర భట్టారిక అనే ఆమెను ఈ మహారాజు తనకుమారుడు శ్రీవీరపురుషదత్తుడికి పెళ్ళి చేశాడు. ఈ విధంగా మహాప్రతిభాశాలి అయిన యీ మహారాజు దక్షిణాపధంలో ఏకై కసమ్రాట్టుగా వెలుగొందాడు.

శ్రీవీర పురుషదత్తుడు : ఇతడు తండ్రి అంత ప్రతిభాశాలి కాకపోయినా తనకి సంక్రమించిన విశాలమైన సామ్రాజ్యాన్ని నిల చెట్టుకోగలిగాడు. తన తండ్రి చూపిన రాజనీతినే అనుసరిస్తూ యీ మహారాజు తన కుమార్తె కోడబలిశ్రీని వనవాసీ మహా రాజయిన శివస్కందనాగశ్రీకి ఇచ్చి వివాహం చేశాడు ఆగవరాజ్యసంవత్సరంలో ఇతని మేనత్త చాంతిశ్రీ యొక్క, ఇతరరాజవంశ స్త్రీల యొక్క సహాయంతో నాగార్జునకొండలోయలో బుద్దుడి ధాతువు మీద నిర్మించబడిన మహాచైత్యం చక్కని శిల్ప ఫలకాలతో కొత్తదిగా చేయబడింది. ఈ మహారాజు తన పద హారవరాజ్య సంవత్సరంలో తాను అంతవరకూ అవలంబిస్తూ వచ్చిన వైదికమతాన్ని వదలి' బౌద్ధమతాన్ని అవలంబించాడు • ఈ ఘటన నాగార్జునకొండశిల్పములలో చక్కగా నిరూపించబడింది.

ఏహుపుల చాంతమూలుడు : ఇతడు పదకొండు సంవత్సర ములు రాజ్యంచేశాడు. ఇతని కాలంలో కూడా విజయపురిలోని బౌద్ధ

తీర్థం బాగా వర్ధిల్లింది. ఇక్ష్వాకు రాజవంశపు స్త్రీలు చాలామంది విహారాలనూ, మండపాలనూ కట్టించారు.

రుణుపురుషదత్తుడు : ఇక్ష్వాకు రాజులలో ఇతడు కడపటి వాడు. ఇతని పరిపాలన విగురించి వివరాలు ఏమీ తెలియవు. ఈ కాలంలో దక్షిణాన పల్లవులు విజృంభించారు. బహుశః వీరు సాతవాహన సామ్రాజ్యం దక్షిణసీమలో సామంతులుగా వుండి వుంటారు. ఈ పల్లవవంశీకుడయిన సింహవర్మ వనవాసి పాలకులైన ఆంధ్రభృత్యుల, రాజపుత్రికను పెళ్ళి చేసుకొని ఆరాజ్యానికి ఏలిక ఆయాడు. అక్కడ నించి విజృంభించి అతడు దక్షిణంగా కంచివరకూ పోయి, ఆనగరాన్ని పట్టుకొని దానిని తనకు రాజధానిగా చేసుకున్నాడు. ఆమీదట సింహవర్మ ఉత్త రంగా దండెత్తివచ్చి, ఇక్ష్వాకులనీ, వారి సామంతులనీ ఓడించి, వారి పరిపాలన అంతమొందించాడు. కృష్ణానదివరకూగల భూమిని అంతనీ జయించి, ధాన్యకటకంలో ఒక ప్రతినిధిని ఉంచి యీ మహారాజు యీ ప్రాంతాన్ని పరిపాలించసాగాడు. చరిత్ర ప్రసిద్ధమైన ఇక్ష్వాకు సామ్రాజ్యం ఈ విధంగా నశించిపోయింది.


1. PII 2 PL II 3. PI, III
4. PI IV 5. PI V

శాసనములు

నాగార్జునకొండలోయలో జరిగిన ఖనన పరిశోధనలో కట్టడములతోటీ, శిల్పాలతోటీపాటు ఎన్నో శాసనములుకూడా దొరికినవి. ఈ శాసనములవల్లనే మనకుఈ కట్టడములము గురించి, ఇక్ష్వాకు రాజులవి గురించి ఆనాటి బౌద్ధమతాన్ని గురించి వివరాలు తెలియవస్తాయి.

ఈ శాసనాలు చూడడానికి ముచ్చటగా వుండే లిపిలో వ్రాయబడినవి. ఈ లిపికి బ్రాహ్మీలిపి అని పేరు. ఈ శాసనాల భాష ప్రాకృతం. ఈ ప్రాకృత భాష సంస్కృతానికి చాలా దగ్గ రగా వుంటుంది. ఈ శాసనాలలో సామాన్యంగా హ్రస్వాక్షరాలు ఎక్కువగా వుంటాయి. అలాగే ద్విత్వాక్షరాలకి బదులుగా 'రెండేసి అక్షరాలు ఉంటాయి. (ఉ. శ్రీకి బదులు సిరీ; స్తంథకిబదులుత భౌ).

నాగార్జునకొండలో దొరికిన శాసనాలు Epigraphia Indica అనే పత్రిక XXవ సంపుటము 1-87 పుటలలోనూ, XXI వ సంపుటం 61.71 పుటలలోనూ, XXIX వ సంపుటము 137-130 పుటలలోనూ, నాగార్జునకొండసంచిక 32-34 పుటల లోనూ మూలపారములతోటీ, వ్యాఖ్యానములతోటి ప్రకటించ బడినవి. ఇవి మొత్తం 44 శాసనాలు ఉన్నవి. ఆయా ఈ శాసనాలు ఇక్ష్వాకు రాజులలో రెండవవాడైన శ్రీవీర పురుషదత్తుడి యొక్క, మూడవవాడైన ఏహువుల చాంతమూలుడి యొక్క పరిపాలనాకాలంలో వేయబడినవి. వీటిలో రాజ్యసంవత్సరాలు, ఋతువులు, పక్షాలూ చెప్పబడతాయి కాని ఏ శకమూ పేర్కొనబడదు.

శాసనములనించి ఎన్నో చారిత్రకాంశాలు తెలుస్తాయి. మొదటి చాంతమూల మహారాజు అశ్వ మేధము, అగ్నిష్టోమము మెదలయిన యజ్ఞాలూ, గోహిరణ్యహలాది దానాలు చేశాడనీ, అతడు కుమారస్వామి భక్తుడనీ ఇందుమూలంగానే తెలుస్తుంది పురుషదత్తుడు శకరాజుల అల్లుడనీ, అతని కూతురు వనవాసి రాజు భార్య అనీ శాసనాలవల్లనే తెలుస్తుంది. అలాగే యీ శాస నాలు ఆనాటి బౌద్ధాన్ని గురించి వివరాలు తెలుపుతాయి. ఇచ్చట ఆపరమహావినశై లీయులు, బహుశృతీయులు, మహిశాసకులు అనే భిక్షు శాఖలవారూ, సింహళ ద్వీప భిక్షువులు నివసించేవారని శాసనాల మూలంగానే తెలుస్తుంది. అలాగే ఇక్కడి కట్టడాలని గురించి వివరాలు కూడా వాటివల్లనే తెలుస్తాయి ఈ శాసనాలు దొరికివుండకపోతే ఈలోయలో బుద్ధుడి ధాతువు మీద నిర్మిచ బడిన మహాచైత్యం వుండేదనీ, ఇక్కడి విహారాలు ఫలానా ఫలానా వ్యక్తులు కట్టించారనీ, నాగార్జునకొండకు శ్రీపర్వతుమ నే పేరుండేదనీ అనే వివరాలు మనకు తెలిసేవి కావు. ఈ విధంగా ఇక్కడ లభించిన శాసనాలు చరిత్రరచనకి చాలా ఉపకరిస్తాయి.


(12) మహాపరినిర్వాణం" : అనేక ప్రాంతాలలో అనేక వేలమందికి తన ధర్మాన్ని బోధించి తిన 80వ యేట బుద్ధుడు కుశీనగరము, రామగ్రామమూ అనే రెండు గ్రామాల సరిహద్దులో కొద్దిగా జ్వరం తగిలి పరమపదించాడు. ఆతర్వాత అతని శిష్యులు అతనిని ఒక చైత్యం రూపంలో ఆరాధించారు

జాతకకధల శిల్పాలు

బోధిసత్వుడు సిద్ధార్ధుడుగా అవతరించక పూర్వం ఎన్నో జన్మలు ఎత్తి ఎన్నో మంచిపనులు చేశాడట. ఈ పూర్వజన్మ వృత్తాంతాలకు జాతకములని పేరు ఇట్లాంటి జాతకక ధలు కొన్ని పందలు ఉన్నాయి. ఇతరచోట్ల వలెనే నాగార్జునకొండలోగల శిల్పా లలో కూడా జాతకకధలు శిల్పించబడినవి. ఇక్కడ తొమ్మిది జాతకముల శిల్పాలు కనిపిస్తాయి. ఇవి యీ క్రింద సంగ్రహంగా, వర్ణించబడుతున్నవి :

(1) ఉమ్మగజాతకం : బోధిసత్వుడు ఒకప్పుడు మహో సధుడనే పేరుతో ఒక వర్తకుడి కుమారుడుగా పుట్టాడు. చిన్న తసంలోనే మహామేధావి అని పేరు తెచ్చుకున్న ఇతనిని రాజు మంత్రిగా నియమించాడు. అదివరకే నలుగురు మంత్రులున్నారు. వీళ్ళకి మహోసధుడిమీద అసూయ కలిగింది. అతన్ని ఎలాగైనా నాశనం చెయ్యాలని సంకల్పించి వారు నలుగురూ రాజుగారి ఇంటినుంచి కిరీటంలోని మాణిక్యమూ, కంఠాభరణము. ఉన్ని కంచుకమూ, బంగారు పాదుకలూ దొంగిలించారు. ఆతర్వాత

వీటిని తమ కానుకలుగా మహోసధుడి భార్య అమరకు పంపిం చారు. ఆమె భర్తను మించిన మేధావి. ఆమే ఈ వస్తువులలో దేనిని ఏమంత్రి పంపాడో ఋజువు సంపాయించి వుంచింది. ఈ మంత్రులు రాజుదగ్గరికి వెళ్ళి పోయిన వస్తువులు మహోస ధుడి యింట్లో వున్నాయని చెప్పారు. రాజు మహోసధుడిమీద మండిపడ్డాడు. దీనితో భయపడి మహోసధుడు ఊరు విడి " పారిపోయాడు. ఆమీద మంత్రులు అమరతో వినోదించాలో ఒక్కొక్కరే ఆమె యింటికి వచ్చారు. ఆమె ఒక్కొక్క........ మంత్రికే తల గొరిగించి, ఒక చాపలో చుట్టబెట్టించింది. తర్వాత ఆమె రాజుగారి వస్తువులతోటీ యీచాప చుట్టలతోటీ ఆస్థానానికి వెళ్ళి నిజం రుజువుచేసి తన భర్త నిర్దోషిత్వాన్ని స్థాపించింది.

(2) చంపెయ్యజాతకం : ఒకప్పుడు బోధిసత్వుడు చంపెయ్యుడనే నాగరాజుగా అవతరించాడు. అతడు అప్పుడప్పుడూ మనుష్యులతో కలిసి ఉపవాసాలూ, వ్రతాలు చేసేవాడు. ఒకసారి ఒక బ్రాహ్మణుడు మంత్రం వేసి యీ నాగరాజును కట్టేసి ఆనేక విధాల అతనిని ఆడించి డబ్బు సంపాయిస్తూ వచ్చాడు. ఒకరి ..... కాశీరాజు ఎదుట ఈ ఆట జరుగుతుంది. ఇంతలో నాగరాజు భార్య అక్కడికి వచ్చి కాశీరాజుతో తన భర్త వృత్తాంతం చెప్పి అతనిని విడిపించింది.

(3) మాంధాతుజాతకం" : బోధిసత్వుడు ఒకసారి మాంధాత అనే పేర ఒక రాజుగా జన్మించి గొప్ప చక్రవర్తి ఆయాడు. ఇక్కడ అనుభవించిన సుఖం చాలక అతడు స్వర్గానికి

వెళ్ళాడు. ఇంద్రుడు అతనిని గౌరవించి అర్ధరాజ్యం ఇచ్చాడు. రాజ్యం చిరకాలం పాలించాక మాంధాతకి ఇంద్రుడిని చంపి అంత రాజ్యమూ తానే ఏలాలనే దుర్బుద్ధి కలిగింది. వెంటనే అత నికి హరాత్తుగా ముసలితనం వచ్చేసింది. కాని స్వర్గంలో ముసలి తనం ముదరడానికి వీలులేనందున అతడు కింద భూమిమీద పడి పోయాడు అనుచరులు అతనిని పట్టుకుని శయ్యమీద వుంచారు. తర్వాత మాంధాత భూమిమీదా, స్వర్గంలోనూ కూడా లభించే సుఖం శాశ్వతం కాదనీ, దానికోసం ఆశపడవద్దనీ లోకాన్ని హెచ్చరించి మరణించాడు.

(4) శిబిజాతకం : బోధిసత్వుడు. ఒకసారి శిబిచక్ర వర్తిగా జన్మించి గొప్ప దాత అని పేరు పొందాడు. ఒకప్పుడు ఒక గద్ద బారినించి తప్పించుకుని ఒక పావురం శిబిశరణు చొచ్చింది. గద్దరూపంలో వచ్చిన ఇంద్రుడు పావురానికి బదులుగా శిబిని ఎత్తుకు ఎత్తు తన మాంసం ఇయ్యమన్నాడు. శిబి తన మాంసం ఇచ్చి గౌరవం నిలుపుకున్నాడు.

(5) మహాపద్మజాతకం* : ఒకప్పుడు బోధిసత్వుడు మహాపద్ముడనే పేర కాశీరాజు కొడుకుగా అవతరించాడు. అతని తల్లి చనిపోగా తండ్రి మరియొక ఆమెను పెళ్ళి చేసుకున్నాడు. ఒకసారి రాజు యుద్ధానికి వెళ్ళాడు. ఈ సమయంలో సవతితల్లి యువకుడైన మహాపద్ముడినిచూచి మోహించింది. మహాపద్ముడు ఆమెని తిరస్కరించాడు. దీనితో అతనిమీద పగబట్టి అతని సవతితల్లి రాజు యింటికి రాగానే మహాపద్ముడు తనని బలవంతం చేశాడని విలపించింది. ఉగ్రుడై ముసలిరాజు కుమారుడిని ఒక కొండమీదనించి కిందికి తోయించాడు. ఒక నాగరాజు అతనిని రక్షించి అర్ధరాజ్యం ఇచ్చాడు. ఏడాదికూడా గడవకుండగానే మహాపద్ముడికి వైరాగ్యం కలిగి, హిమాలయాలకి పోయి ముని వృత్తి అవలంబించాడు. కొందరు రాజభటులు ఇతనిని ఆనవాలు పట్టి కాశీరాజుతో చెప్పారు. వెంటనే తండ్రి వచ్చి ఇంటికి రమ్మని కొడుకును బతిమాలాడు. మహాపద్ముడు రానన్నాడు. ఆమీదరాజు తనని మోసం చేసిన రాణిని చంపించాడు.

(6) ఘటజాతకం : ఈ జాతకంలో భాగవతంలోని కృష్ణుడి జనన వృత్తాంతం ఉంటుంది. కంసదేశానికి మహాకంసు డనే రాజు ఉండేవాడు. అతనికి కంస, ఉపకంస అని యిద్దరు కొడుకులూ, దేవగర్భ అనే కూతురూ ఉండేవారు. ఈమెకు పుట్టే కుమారుడు కంసవంశాన్ని నాశనం చేస్తాడని జోస్యం చెప్పారు. పెద్దలు. కంసుడు రాజయాక చెల్లెలిని ఒక యింటిలో ఖైదుచేశాడు. ఇంతలో ఉపసాగరుడనే రాజపుత్రుడు ఇక్కడికి వచ్చాడు. ఇతడూ దేవగర్భా ఒకరినొకరు ప్రేమించుకుని, నేవకులని వశపరచుకొని తరచుగా కలుసుకునేవారు. వీరికి చాలామంది పిల్లలు కలిగారు. అందులో ఎని మిదవవాడు కృష్ణుడు.

(7) దీఘీతికోసలజాతకం" : ఒకప్పుడు కోసల దేశానికి దీఘీతి అనేరాజు ఉండేవాడు. కాశీరాజు దండెత్తివచ్చి ఇతనివి తరిమివేశాడు. దీఘీతి భార్యతో కలిసి కాశీ రాజ్యపు సరిహద్దులో ఒక పల్లెలో ఒక కుమ్మరి యింట్లో తల దాచుకుని కాలక్షేపం

చేస్తూ వచ్చాడు. అప్పుడు అతనికి దీర్ఘాయువనే కొడుకు పుట్టాడు. కొన్నాళ్ళకి కాశీరాజు దీఘతిని ఆనవాలుపట్టి అతనినీ, భార్యనూ చంపించేశాడు. దిఘీతి తనకొడుకుకి “ద్వేషాన్ని ప్రేమతో జయించు" అని బోధించి మరీ పోయాడు. కొంతకాలానికి దీర్ఘా యువు కాశీరాజు కొలువులో చేరి, ఒకనాడు అతనిని చంపి పగ దీర్చుకోబోయాడు. ఇంతలో తండ్రి ఉపదేశం జ్ఞాపకానికి వచ్చి. తన వృత్తాంతం రాజుకి తెలియచేశాడు. కాశీరాజు ఇతనికి కోసల రాజ్యం ఇచ్చేశాడు .

చారిత్రక శిల్పాలు

నాగార్జునకొండవద్ద దొరికిన కొన్ని శిల్పాలు ఇక్ష్వాకు రాజుల చరిత్రకి సంబంధించిన కొన్ని ఘట్టాలని నిరూపిస్తాయి. వాటిలో ఈ క్రిందివి ముఖ్యములు : (1) చక్రవర్తి : ఈ పేరువి రెండు శిల్పాలు ఉన్నవి. వీనిలో మధ్యన రాజు ఉన్నాడు. చుట్టూ అతని లాంఛనములు అయిన రాణులూ, మంత్రులూ, సేనాపతీ, చక్రమూ, కంఠాభర ణమూ, ఏనుగూ, గుర్రములు మొదలైనవి ఉన్నవి. ఈ రాజు మొదటి ఇక్ష్వాకు చాంతమూలుడు.

(2) శైవధిక్కారము : ఇలాంటివి రెండు శిల్పాలు ఉన్నవి. వీటిలో ఒక రాజు కొందరు వ్యక్తుల యెదురుగా ఒక శివలింగాన్ని కింద పడదోసి, కుడికాలుతో తొక్కుతూ ఉన్నాడు. ఈ రాజు ఇక్ష్వాకులలో మొదటి వీరపురుషదత్తుడు. 28

(3) యుద్ధము : ఇది రెండు పక్షాలవారికి జరిగింది. ఒక వైపు ఏనుగులు, గుర్రాలూ ఉన్నవి. రెండోవైపు సామాన్య ప్రజలు. ఇది వీరపురుషదత్తుడు ప్రజల తిరుగుబాటును అణచిన ఘట్టం.

(4) బౌద్ధస్వీకారం . ఇందులో ఒక వైపున రాజు శివ లింగాన్ని కాలితో తొక్కుతున్నాడు. రెండవవైపు అతడు బోధి సత్వుని కాళ్ళకింద కూర్చుని వున్నాడు. ఈ రాజున్నూ వీరపురుష దత్తుడే.

(5) దానాలు : ఒక స్తంభంమీద అయిదువరుసల శిల్పం ఉన్నది. అడుగువరుసలో బంగారపు ముద్దల రాశి ఉన్నది. దానిని రాజు ధారాపూర్వకంగా దానం చేస్తున్నాడు. పై వరు సలో రాజు ఏనుగుని ఎక్కి ఊరేగుతున్నాడు. ఇంకో శిల్పంలో రాజుముందు ఒక ఆవును నిలిపి అలంకరిస్తున్నారు. ఈరాజు మొదటి చాంతమూలుడు. ఈ దృశ్యాలు గోహిరణ్యదానాలనీ, అశ్వ మేధవాజ పేయయాగాలని సూచిస్తాయి.


వివిధ శిల్పాలు

వీటిలో అనేకము లున్నవి. అందులో బుద్ధపాదాలుగల పలక," చైత్యం బొమ్మగల పలకలూ, సింహాలు త్రిరత్న చిహ్నాలుగల అంచుదూలాలు," మాలాలంకారములుగల పలకలు, ఒక శకయోధుడి బొమ్మగల పలక, మిధున శిల్పాలూ ముఖ్యము లైనవి.

నాగార్జునకొండ శిల్పి మరి యితరచోట్ల శిల్పులు చూపిం చని విశిష్టమయిన పద్ధతిని బుద్ధ జీవిత దృశ్యాలనీ, జాతక కధలనీ విశాలమైన ప్రదేశంలో చిత్రించి దృశ్యానికి దృశ్యానికీ మధ్య కొద్దిపాటి జాగాలలో అత్యద్భుతములైన మిధునశిల్పాలని సృష్టించాడు అనేకమహాకవుల కావ్యములలో వర్ణించబడిన శృంగారభావాలకీ, నాయికానాయకుల చిత్తవృత్తులు మెరుగులు దిద్ది యీ శిల్పి వాటిని చలవరాతిలో ప్రతిబింబింపచేశాడు. ఇలాటి మిధున శిల్పాలు ఎన్నో వున్నవి. వాటిలో యీ క్రింది మూడు శిల్పాలూ ఎంతో హృద్యములుగా వున్నాయి.

(1) మధుపాత్ర సమర్పణం* : ఒక ప్రియుడు చిరకాలం ఎక్కడనో వుండి తన ప్రియురాలివద్దకి వచ్చి, పూర్వం వలెనే ఒక పాత్రలో మధువుపోసి ఆమెకి ఇస్తాడు. అతడు దగ్గర లేనప్పుడు మధుపానం చేసే అలవాటు తప్పిపోయినందున ఆమె ముఖం ఒక వైపుకి తిప్పుకుంటుంది.

(2) రాగోదయం : ఒక చిరకాలానంతరం ప్రియురాలివద్దకు వచ్చి వినోదభాషణాలతో కాలం వృథా చేస్తాడు. నాగినికి అంతలో రాగోదయం అవుతుంది. ఆమె తన చెవికి వున్న పద్మరాగాభరణాన్ని చూపించి తన రాగోదయాన్ని అత నికి సాంకేతికంగా సూచిస్తుంది.

(ఆ) నితంబాన్వేషణ" : ఒక ప్రియుడు కుపిత అయిన ప్రియురాలి దగ్గరకు చేరి ఆమెకి రాగోద్దీపన కలిగించే నిమిత్తం అంగస్పర్శచేస్తూ వీపు నిమిరి, నడుము తడమవలెనని సత మధ్యంలో ఎంతతడిమినా నడుము దొరకదు. అంతతో విసిగి అతడు చేతిని కిందికి పోనిచ్చి నితంబస్పర్శ చేసి కృతకృత్యుడు అవుతాడు.

8 PI Vil
9 PI VIII
10 PI IX
11 Arch, Sur Ind, Mem No 54 , PI XXI a / 12 Ibid Pl XXXII a /13 Pl X
14. Arch Sur Ind Mem No 54 , PI XXII a ....... /15 PI XI /16 PIXI
17Arch Sur Ind Mem No 54, PI XXXII b /
18 PI XIII ....... / 19 Arch Sur lod Mem No 54 PI XXXVIII a
20 Ibid Pl XXXVIII b / ....... 21 Ibid PI XXXIX a,b
22 Ibid P1 XLII a .......... / 23 Ibid PI XLV ......... / 24 Ibad Pl XLVIa
25 Ibid PI. XLVII a/ ........ 26 PI XIV ........ 27 Pl. XV
28. PI XVIa ......... / 29 P} XVID ....... / 30. PI XVIC

భారతదేశాన్ని అతి తరచుగా పీడించే బాధలలో క్షామ బాధ చాలా ముఖ్య మయినది. పంటలు సరిగా పండక పోవడం వల్ల తగినంత ఆహారం దొరకక అనేకమంది బాధ పడుతూం టారు. మనదేశంలో ఆహారోత్పత్తి ఎక్కువ అయితేనే కాని మనకి క్షామ బాధ తప్పదు. పంటలు ఎక్కువ కావాలి అంటే ఇంతవరకూ బీడుపడి సాగులోకి రాకుండా వున్న భూమికి నీటి సదుపాయం లభించాలి. స్వతంత్ర భారత ప్రభుత్వం ఈముఖ్య సమస్యని ఎదుర్కొనే నిమిత్తం అనేక (ప్రాజెక్టులు) ప్రణాళికలు తయారు చేసింది. ప్రస్తుతం అనేక నదులలో నీరు చాలా భాగం వృథాగా సముద్రంలోకి పోతూన్నది. ఈ నదులకి అడ్డకట్టలు కట్టి వాటిలో నీటిని నిలవ చేసి మెట్ట ప్రాంతాలకి మళ్ళించి వాటిని సాగులోకి తెచ్చే నిమిత్తం యీ ప్రణాళికలు ఏర్పడినవి.

ఆంధ్రదేశంలో కృష్ణాగోదావరులు ముఖ్యనదులు. వీటిలో చాలా నీరు వృథాగా పోతూన్నది. అందుకని ప్రభుత్వంవారు గోదావరికి అడ్డకట్ట కట్టి రామపాదసాగరం ఏర్పాటు చెయ్యాలనీ కృష్ణకి అడ్డకట్ట కట్టి నాగార్జునసాగరం ఏర్పాటు చెయ్యాలని సంకల్పించారు.

కృష్ణానదిలో ఎన్నో ఉపనదులు, వాగులూ కలుస్తాయి ఒక్క టెజవాడ దగ్గరనే ఏడాది మొత్తం మీద ఎల్లప్పుడూ 1716 T. M C అడుగుల నీళ్ళు ప్రవహిస్తూంటాయి. ఈ నదికి సంబంధించి ఇదివరకే కొన్ని ప్రణాళికలు సాగుతున్నవి. వీటి వల్ల ఉపయోగపడే నీరూ, ప్రస్తుతం ఉపయోగ పడుతూన్న నీరూ మొత్తం పోను ఇంకా 970 T. M. C. అడుగుల నీరు మిగిలి వృథాగా పోతూంది.

ఈ మిగిలే నీటిని ఉపయోగించే నిమిత్తం సిద్ధేశ్వరం, నందికొండ, పులిచింతల అనే చోట్ల నదికి అడ్డకట్టలు కట్టాలి అని ఒక పధకం ఉన్నది. సిద్ధేశ్వరంకట్టవల్ల 8.64 లక్షల ఎక రాల భూమినీ, నందికొండకట్టవల్ల 31.38 లక్షల ఎకరాల భూమినీ, పులిచింతల కట్టవల్ల మరికొన్ని లక్షల ఎకరాల భూమిని సాగు చెయ్యడానికి సరిపోయే నీరు లభిస్తుంది. ఇది కాకుండా ఈ కట్టల వల్ల 175,000 K.W.ల విద్యుచ్ఛక్తి నికూడా ఉత్పత్తి చెయ్య వచ్చును.

పైన చెప్పబడిన స్థలాలు అన్నిటిలోకీ నందికొండ వద్ద కట్ట కట్టడం సుకరమూ, లాభదాయకమూను. నందికొండ అనే గ్రామంవద్ద నదికి అడ్డంగా కట్ట కడతారు.ఈ స్థలం అటు మాచర్ల రైలు స్టేషనుకు 10 మైళ్ళదూరంలోనూ, ఇటు మిరియాల గుడా దేవరకొండ రోడ్డుకు 10 మైళ్ళదూరంలోనూ ఉన్నది. ఈ కట్ట 8,880 అడుగుల పొడుగు వుంటుంది. దీనిమూలాన కృష్ణా నది నీరు 110 చదరపు మైళ్ళదూరం ఎగువకి వ్యాపిస్తుంది. ఈ నీటిని

నదికి కుడివైపున ఒకటీ, ఎడమవైపున ఒకటి రెండు కాలువలు తవ్వి వాటిలోకి మళ్ళిస్తారు. కుడివైపున కాలవ 276 మైళ్ళ పొడుగు ఉంటుంది. దీనిమూలాన గుంటూరుజిల్లాలోని సత్తెనపల్లి నరసరావుపేట, ఒంగోలు తాలూకాలు పూర్తిగానూ, పల్నాడు. వినుకొండ, గుంటూరుతాలూకాలు కొంతవరకునూ, నెల్లూరు జిల్లాలో కందుకూరు, కొవ్వూరు, కావలితాలూకాలు పూర్తిగానూ, దర్శి, పొదిలి, కనిగిరి. ఉదయగిరి, ఆత్మకూరు తాలూకాలు కొంత వరకూనూ కర్నూలు జిల్లాలో కొద్దిభాగమూ సాగుబడిలోకి వస్తాయి ఎడమవైపు కాలవ 140 మైళ్ళ పొడుగు ఉండి హైదరాబాదు రాష్ట్రంలోని వరంగల్లు, నల్లగొండ జిల్లాలలో కొంత భాగానికీ ఆంధ్రరాష్ట్రంలో కృష్ణాజిల్లాలోని నందిగామ తాలూకాకీ వ్యవ సాయానికి నీరు అందిస్తుంది.

ఈ నందికొండ కట్ట కట్టడానికి తొమ్మిది సంవత్సరాల కాలం పడుతుంది. దీని నిర్మాణానికి 21.28 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది.

ఈ కట్టవల్ల ఇప్పుడు బీడుపడివున్న భూమిలో కొన్ని లక్షల యెకరాల నేల సాగుబడిలోకి వస్తుంది. ఇందువల్ల ఎక్కువ ఆహారధాన్యాలు ఉత్పత్తి అయి కరువు కాటకాల బాధ చాలావరకూ తగ్గుతుంది. ఈ కట్టమూలంగా తయారయే విద్యు చ్ఛక్తివల్ల చాలా ప్రదేశానికి దీపాలసౌకర్యమూ. పరిశ్రమలకి శక్తి సౌకర్యమూ, లభిస్తుంది. కాని దీనినిర్మాణంవల్ల ఆంధ్రదేశ చరిత్రకూ. ఆంధ్రదేశకరాచరిత్రకూ, ఆంధ్రదేశమతచరిత్రకూ

అతిముఖ్యమైన నాగార్జునకొండలోయ కృష్ణా గర్భంలో లీనమయి పోతూంది. బుద్ధభగవానుడి ధాతువుమీద కట్టబడిన పవిత్రమహా చైత్యం మనకి కనుపించదు. బోధిసత్వ నాగార్జునుడి విద్యాపీఠం కనుమరుగై పోతుంది. ఇక్ష్వాకు చక్రవర్తుల రాజధానిగా కీర్తి చెందిన విజయపురి అదృశ్యమైపోతుంది. ఈ పవిత్రనిర్మాణాలూ, స్థలాలూ భావుకులైన వారి హృదయఫలకాలమీదనూ, మనో వీధులలోనూ మాత్రం నీలిచి వుంటాయి.

Plate I.

మొదటి చాంతమూలుడు గోదానము చేయుట

Plate II.

మొదటి చాంతమూలుడు హిరణ్యదానము చేయుట.

Plate III.

సామ్రాట్ చాంతమూలుడు, అతని ఏడు అలంకారములు.