తాతా చరిత్రము/ముఖ్యవృత్తాంతములు

తాతా చరిత్రకు సంబంధించిన ముఖ్య వృత్తాంతములు.

  • 1839- జంషెడ్జితాతా జననము.
  • 1853- జంషెడ్జితాతా కళాశాలాప్రవేశము.
  • 1856- జంషెడ్జితాతా వివాహము.
  • 1857-58- సిపాయియుద్ధము.
  • 1859- వ్యాపారారంభము (చీనాతో), జ్యేష్ఠపుత్రుని జననము.
  • 1864- ఇంగ్లండు ప్రయాణము. (దూది యెగుమతి వ్యాపారము.)
  • 1867-68- అబిసీనియా యుద్ధము.
  • 1870- (బొంబాయి) 'అలెగ్జాండ్రా' మిల్లు స్థాపనము.
  • 1877- (నాగపురం) ఎంప్రెసుమిల్లు ఆరంభము. విక్టోరియారాణి మనదేశపు చక్రవర్తిని అగుట.
  • 1882- లోహపరిశ్రమకై ప్రయత్నారంభము.
  • 1885- భారతజాతీయ మహాసభాస్థాపనము.
  • 1886- (బొంబాయి) 'స్వదేశీమిల్లు' ఆరంభము. నస్సర్వంజితాతా మరణము.
  • 1887- ఆర్. డి. తాతా, దొరాబ్జితాతా, తాతా అండ్ సన్సులో చేరిరి.
  • 1892- విదేశవిద్యావేతనఫండు ఏర్పాటు, హెర్షెలు కమిటీ నివేదిక.
  • 1893-94- తాతా జపాను నౌకాసంఘము. (మైసూరు) పట్టుపరిశ్రమ ఆరంభము.
  • 1894. మిల్లుబట్టలపన్ను తగాదా ఆరంభము.
  • 1896. ఈజిప్టు ప్రత్తిసాగు యత్నపు ఆరంభము.
  • 1897. జలవిద్యుచ్ఛక్తికై ప్రయత్నారంభము.
  • 1898. విజ్ఞానాలయముకై ఆస్తి దానము.
  • 1898. 'తాజ్‌మహల్‌' హోటలు నిర్మాణారంభము. (బొంబాయి)
  • 1899. కర్జనుప్రభుత్వారంభము.
  • 1900. అడ్వాన్సుమిల్లు సంపాదన (అహమ్మదాబాదు)
  • 1903. 'తాజ్‌మహల్‌' హోటలు సంపూర్తి. క్రొత్తలోహపుగనుల గనుగొనుట.
  • 1904. జంషెడ్జితాతా మరణము.
  • 1907. తాతా లోహపరిశ్రమసంఘపు స్థాపనము.
  • 1910. తాతా జలవిద్యుచ్ఛక్తిసంఘపు స్థాపనము.
  • 1911. విజ్ఞానాలయపు పని ప్రారంభము.
  • 1915. దొరాబ్జి భారతపారిశ్రామికసభ కధ్యక్షుడగుట.
  • 1916. ఆంధ్రలోయ విద్యుచ్ఛక్తిసంఘపు స్థాపనము.
  • 1918. రత్నజీతాతా మరణము.
  • 1919. తాతా పవర్ సప్లైకంపెనీ స్థాపనము.
  • 1919. జంషెడ్పురపువృద్ధి, నామకరణము.
  • 1919. తాతా పవర్ సప్లై స్థాపనము.
  • 1932. దొరాబ్జితాతా మరణము.


__________