చీనా - జపాను/వూహానులో కమ్యూనిష్టు ప్రభుత్వము

స్టేలిను యొక్కయు అభిప్రాయమైయుండెను.ఈ కారణముల వల్ల చీనా విప్లవ నాయకులు లేక క్యూమింగు టాంగు వామపక్ష నాయకులగు వాంగుచిన్‌వెయి మొదలగువారు దక్షిణపక్షముతో గట్టిగా పోరాడలేదు సరేగదా దానికి ప్రతికూలముగ కొందరు భూస్వాములలోను పూంజీదారులలోను దూరిపోయిరి.ఇట్టి చర్యలు మాత్రము అవకతవకవే యైనను ఈసమయమున మోటాయించి కర్షకశ్రేణిని విసర్జించుట సరియైన మార్గము కాదని అందరును ఒప్పుకొనుచున్నారు.

వూహానులో కమ్యూనిష్టు ప్రభుత్వము

చియాంగ్‌ కాయ్‌షేకు నాంకింగులో బూర్జువా ప్రభుత్వమును స్థాపించినను అది బలవత్తరముగా లేకుండెను. క్వాంగుటాంగు,షాంఘే జిల్లాలలోని కర్షక కర్మిక సంఘముల నణగత్రొక్కుటయే అతడు తన మొట్టమొదటి పనిగాబూనెను.

కర్షక కార్మిక సంఘముల యెడల నాతడవలంబించిన ఇట్టి ఘోరచర్యలు వారిద్వేషమును మఱింత బలపర చెను. వీరును విద్యార్థిసంఘములును కలసి వూహాన్‌ నగరమునందు 1927లో మరియొక ప్రభుత్వమును నెలకొల్పిరి.ఈప్రభుత్వము స్థాపించబడినప్పటి నుండియు కర్షకసంఘములు మరింత బలపడినవి. హూనాన్‌, హూపే జిల్లా కర్షకసంఘములో నున్న 800,000 సభ్యులసంఖ్య మే మాసము నాటికి,

11
12
చీనా-జపాను

2,000,000,లకు పెరిగినది.ఈ రెండుమాసములలోనే హూనాను జిల్లా కర్షక సంఘసభ్యుల సంఖ్య 5,000,000 లకు పెరిగినది.

ఈసంఘముల సభ్యులసంఖ్య పెరుగుటయే కాక వీరి చర్యలుకూడ విప్ల వమార్గములు పట్టినవి. అనేక గ్రామములలోను నగరములలోను క్యూమిటాంగు ప్రభుత్వపుటాజ్ఞలు ధిక్కరించబడినవి.భూస్వాముల భూము లను సాహుకార్లసంపదను వీరు స్వాధీనము చేసుకొని తమకుటుంబములలో పంచుకొనిరి.పెద్ద కుటుంబముల వారికి పెద్దవంతు,చిన్నకుటుంబము వారికి చిన్నవంతు, ఈ రీతిగా కుటుంబసభ్యులసంఖ్యనుబట్టి పంచుకొనిరి. అనేకమంది భూస్వాములు సాహుకార్లు ఈ అపాయములను గుర్తించి తమ ఆస్తులను తామే వీరికి ఒప్ప చెప్పిరి.అట్లా ఒప్పచెప్పని వారిని వీరు అరెస్టుచేసి శిక్షింప మొదలు పెట్టిరి.పట్టణములలో కార్మికసంఘము లు, ట్రేడుయూనియనులు కూడా ఇట్టి సాహసములే యొనరించినవి.

కాని దిగువ మధ్యతరగతులవారికి,విజ్ఞానసంతతులవారికి,భూస్వాముల పుత్రులకుగూడ ఇట్టిచర్యలు విపరీత ములుగా దోచినవి.వీరుఇంతకుముందు విప్లవోద్యమపోషకులేయైనను ఈకార్యములను చూచి భయపడి జాతీయ పక్షముతో చేతులు కలుపజొచ్చిరి.ఈ సమయముననే విదేశప్రభుత్వములవారు షాంఘేనగరమును ముట్టడించి అక్కడకు ఆహారాది పదార్థములు పోకుండా ఆటంకపెట్టిరి.వూహాను ప్రభుత్వప్రదేశములలోనే ఇట్టిచర్యలవలన ఆర్థికపరిస్థితులు,అకటావి
చీనా

కటకమైనవి.వస్తువుల వెలలు పడిపోయినవి.క్రొత్తగా దేశాభివృద్ధికై విధించిన పన్నులను ప్రజలిచ్చుకొనలేక పోయిరి; కనుక ఈ పన్నులను ప్రభుత్వము తీసివేయవలసి వచ్చినది.డబ్బు లేకుంటే దక్షిణపక్ష సేనా నాయకులతో యుద్ధము సాగదాయెను.అమెరికాకు ఇట్టిచర్య లిష్టము లేకుండుటచేత అది ఆహారపదార్థములను చీనాకు పంపుట మానివేసెను.ప్రజలు మలమల మాడిపోవుచుండిరి.వెదేశ వ్యాపారము ఈ కారణములవల్లనే క్షీణించినది.డబ్బు కోసం వూహాను ప్రభుత్వము నోటులెక్కువగా వేయించి ఆ పదార్థములకు కృత్తిమపు హెచ్చువెలలు కలిగించెను.ఇందువల్ల పరిస్థితులు మరీ విషమించినవి.అనేకులు ప్రభుత్వపక్షమును వీడి క్యూమిన్‌టాంగు దక్షిణపక్షములో చేరిపోయిరి.ఇందువల్ల ఆపక్షము బలపడి ఒకసేనా నాయకునిక్రింద తిరుగబడి కర్షకసంఘములను ట్రేడుయూనియనులను రద్దుచేసి వందలకొలది వీరి నాయకులను కాల్చివేసెను. ఇది యంతయు మే 21 తేదినాటికే జరిగెను.తక్కిన వామపక్ష నాయకులు కూడ భూస్వాములలోను పూంజీదారు లలోను దూరిపోయిరి.జూలై నాటికి ఈ సంఘములన్నియు అక్రమసంఘములుగా ప్రకటింపబడినవి.

దీనివల్ల చీనాప్రజలకు ఒక్కసంగతి బాగా విశదమైనది.కర్షకకార్మికులు తక్క ఇతలెవ్వరును నిజమైన దేశ స్వాతంత్ర్యమునకై పోరాడరనియు,ఇతరులందరును భాగ్యవంతులతోనో తద్వారా జపానులేక యితర విదేశసామ్రాజ్య ప్రభుత్వముల

13
14
చీనా-జపాను

తోనో చేతులు కలుపుకొని వారిని అణచివేయుటకు సంకోచింపరని తేటయైనది.ఇందుకు తగినట్లు వారు కట్టు బాట్లు చేసుకొనప్రారంభించిరి.

కాంటనులో కమ్యూనిష్టు ప్రభుత్వము

1927 ఆగస్టు 1 వ తేదినాటికి ఈ ప్రయత్నములు పూర్తియైనవి.అనేకమంది జాతీయవిప్లవసేనా నాయకులు కూడా వీరిలోనికి వచ్చిరి.కమ్యూనిష్టు సేనానులు యేటిన్‌,హొలంగు అని వారలక్రింద ఈ సేనలు తిరగబడి క్యూమింగుటాంగు పక్షమును కియాంగ్స రాష్ట్రరాజధాని యగు నాంచాంగు నగరమున ఓడించెను. ఆరువారములలోనే క్వాంగుటంగు రాష్ట్రములో స్వాటోనగరము వరకును పోయి ఆనగరమునాక్రమించుకొనిరి. ఈసమయమున క్వాంగుటంగు కియాంగ్సీ రాష్ట్రముల సేనానులు తమలో తాము పోరాడుకొనుచుండిరి.దీని నాధారముగా గొని ప్రజలఉత్సాహము నూత చేసుకొని క్వాంగుటంగు రాష్ట్ర రాజధానియగు కాంతనులో వీరు కమ్యూనిష్టుప్రభుత్వము స్థాపించిరి.

డిసెంబరు 11 వ తేదిని వీరిమీద తిరుగుబాటు లేచెను.కాని కమ్యూనిష్టు పార్టీవారు మధ్యతరగతులవారినుండి ఆయుధములను పెరుకుకొనిరి.పోష్టు,టెలిపోను,టెలిగ్రాపు,పోలీసు బేరక్సు మొదలైన శాఖలన్నింటినీ తమ ఆధీనములోనికి తీసుకొనిరి.క్యూమింటాంగు ఆఫీసులన్నింటినీ కాంటనులోనికి