చీనా - జపాను

చీనా

పాశ్చాత్యజాతులతో ప్రధమసంబంధములు

చీనా ప్రాచీనచరిత్రతో మనకిప్పుడు ప్రయోజనము లేదు.18 వ శతాబ్దముతో చీనాయొక్క నవీనచరిత్ర ప్రారంభిం చబడినది.బ్రిటిషు తూర్పుఇండియా వర్తకసంఘము హిందూదేశములో పండించిన నల్లమందును చీనా దేశమున కెగుమతిచేయుటకై సర్వహక్కులను అనుభవించగోరినది.కాంటను నగరమునందలి చీనావర్తక సంఘ ములు ఆసదుపాయములను కూడా వారికి కలుగజేతుమని యొప్పుకొనిరి.కాని 1839 లో చీనా ప్రభుత్వము చీనాలో నల్లమందును మానిపించబూని ఒక నిషేధాజ్ఞను ప్రకటించినది.ఇది ఈస్టుఇండియా కంపెనీ వారికోరికకు విరుద్ధము కనుక ఈ కంపెనీ నల్లమందు ప్రచారమునకై చీనాతో మూడు“పవిత్ర” యుద్ధములనొనరించినది.

ఈయుద్ధముల ఫలితముగా ఇండియాలోపండిన నల్లమందును, లంకాషైరులో నేయబడిన మిల్లుబట్టలను నిరాటంకముగా చీనాదేశములో దింపి విక్రయించగల సర్వాధికారములు బ్రిటిషు ఈస్టు ఇండియా కంపెనీకి చిక్కినది.ఇంతే 2
చీనా-జపాను

కాకుండా హాంకాంగు అనేద్వీపము వీరికి దానముచేయబడినది.బ్రిటిషు వస్తువులమీద చీనాప్రభుత్వము దిగు మతి సుంకములను విధించకుండా చూచుటకై బ్రిటిషు ఉద్యోగస్థులను కంపెనీవారు యేర్పాటు చేసుకొనుటకు చీనా అంగీకరించినది.పైగా,చీనాలో కిరస్తానీ మత ప్రచారము చేయుటకు కూడ బ్రిటిషువారికి అనుజ్ఞ యీయ బడినది.

చీనా సింహద్వారము మొట్టమొదట పాశ్చాత్యవర్తకులకు ఈ రీతిని తెరువఁబడినది.ఒక్కబ్రిటను ప్రవేశించిన, తక్కిన దేశములు ఊరకుండునా?జారుప్రభుత్వము క్రిందనుండిన రష్యా కూల్జారాష్ట్రమును తీసుకొని మంగోలియా ఆక్రమణమునకుపక్రమించెను.ఫ్రెంచివారు అన్నాము అను విశాలప్రదేశమును తీసుకొనిరి.జర్మనీ,ఇటలీఁ బెలిజియము దేశములు కూడా ప్రవేశించి వారివారికి కావలసిన వర్తకసౌకర్యములు మొదలగువానిని నిర్బంధించి తీసుకొనియెను.చీనా మీద జపానుయుద్ధమును ప్రకటించి ఫార్మోజా, కొరియా, దక్షిణమంచూరియా యందున్న లియావోటంగు రాష్ట్రములను తీసుకొనెను.

ఈ దేశములు ఈరాష్ట్రములను చీనానుండి త్రుళ్లగొట్టి తీసుకొనిటయే కాక తమకు కావలసిన షరతులను పత్రముపై వ్రాసుకొని చీనాప్రభుత్వముచే బలవంతముగా సంతకము చేయించి“ఒడంబడిక”లు చేసుకున్నవి.ఈఒడంబడికల షరతులు విచిత్రములు.(1)చీనాలో యెక్కడ పట్టిన నక్కడ
చీనా


ఇవి స్వేచ్ఛగా వాణిజ్యము చేసుకొనవచ్చును.(2)వీరి దేశపు వస్తువులమీద చీనాప్రభుత్వము నూటికి 5 కంటె యెక్కువగా దిగుమతి సుంకములను విధించరాదు.(3)ఇట్లు విధించకుండా చూచుటకై ఈ దేశముల "నేషనల్సు" అనగా రాయబారులను లేక ప్రతినిధులను వీరు నియమించి చీనాలో కాపలా యుంచుటకు చీనా అంగీకరించవలెను.(4)ఈ విదేశస్థులు చీనాలో యెట్టినేరములు చేసినను వీరిని చీనాచట్టముల ప్రకారము శిక్షిం చరాదు.వీరిని వేరే కోర్టులలో విచారణ చేయవలెను.వీనికి"ఎక్స్ట్రాటెర్రిటోరియలు" కోర్టులు లేక చీనాదొరతన ప్రవేశమునకతీతమైన కోర్టులు అని పేరు.ఈ కోర్టుల ఉద్యోగస్థులను,సూత్రములను నిర్ణయించుట లేక యేర్పా టు చేయుట ఈ కూటము పనికాని చీనాకందులో నెట్టి ప్రమేయమును ఉండరాదు.(5)మంచిమంచి వర్తక కేంద్రములు,రేవు పట్టణములు మొదలగు వానిలో స్థిరావాసములు చేసుకొనుటకు వీరికి హక్కు లీయబడి నవి.(6)చీనామధ్య ప్రదేశములందు సేనలు,రేవు పట్టణములందు నావలు నిలువయుంచుకొని వారి దేశపు రాయబారులు(నేషనల్సు)కు అపాయము రాకుండా వారు చూసుకొనవలెను.(7)ఇంతే కాకుండగా చీనారెయిళ్ళు,ఫోస్టాఫీసులు,ఉప్పు మొదలైన వానివల్లవచ్చే ఆదాయములను తనిఖీచేయుటకు హక్కులను పిండుకొనినారు.

3
4
చీనా-జపాను

సమృద్ధిలో దారిద్ర్యము

ఈసంబంధముల వలన చీనాప్రజలు నానాటికి దరిద్రులగుచున్నారు.చీనా వ్యావసాయక దేశమై జీవనాధారములైన పంటలన్నిటినీ యెక్కీదొక్కీ పండించుచున్నను, ఈ పంటయంతయు నేమియగుచున్నదో కాని, చీనావారికి కావలసిన ఫోక్తు ఆహారపదార్థములలోనే నూటికి యెనిమిది వంతులు విదేశములనుండి అవి విధించిన వెలలకు కొనుక్కొన వలసి వచ్చుచున్నది.దీనికి సరిపడునట్లు వ్యవసాయమును వృద్ధిచేయవలె నంటే, భూమికి కొదువలేదు.ఇప్పుడు నూటికి 10 వంతుల భూమి సాగులోవుంటే తక్కిన 90 వంతులూ బీడే, ఈ 90 వంతుల భూమి తక్షణ వ్యవసాయమున కర్హమైనదే అయినప్పటికీ అందుకు తగిన పరికరములే చిక్కకున్నవి.పూర్వపు సాగు కాలువలను జలాధారములను మరమత్తు చేయుంచేటందుకు క్రొత్తవానిని నిర్మించే టందుకు దిక్కులేదు.కొన్ని చేలు యెండలకు మాడి పోతూవుంటే కొన్ని వరదలకు కొట్టుకొనిపోవుచుండెను. పేదలై నిరాధారులైయున్న ప్రజలు ఇట్టి దుర్భర వ్యయప్రయత్నముల కెట్లు పూనుకొనగలరు?అన్యదేశ నిర్బంధ ప్రభుత్వమునకు వీరిని బాగుచేయగల సమర్ధతకాని దీక్షకాని యెట్లు కుదరగలదు?

ఈస్వల్పమాత్రపు ఫలసాయమైనను ప్రజలు అనుభవించగలరేమో అంటే,దానిని అమ్ముకొని విదేశవస్తువులను
చీనా

కొనుక్కొని వారు దరిద్రులు కాక తప్పకున్నది.విదేశివస్తు ప్రవాహము నఱికట్టు యీ పంటల యెగుమతి నాపుదమని కొందరు ఫ్యాక్టరీల పరిశ్రమల వైపునకు కూడ మరలుచున్నారు.ఫ్యాక్టరీ పరిశ్రమలంటే పెట్టుబడి తోడిమాట.ఈ పెట్టుబడి ద్రవ్యమునుకూడ ఈ ఫ్యాక్టరీదారులు అప్పుచేసి సంపాదింపవలసి వచ్చుచున్నది.ఈ అప్పులిచ్చేవారు కూడా విదేశస్థులే.ఈ అప్పులకు వీరు పద్ద వడ్డీలు విధించుటయేకాక, యెన్నో వాణిజ్య సౌకర్యములను కూడ గుంజుకొనుచున్నారు.ఇంతకు ముందే వీరు చీనాదేశమంతటను తమ స్వంతఫ్యాక్టరీలను పెట్టి లాభములు అనుభవించుచున్నారు గనుక ఆలాభములకు వట్టము రానట్లుగానే యీ సదుపాయములను వారు చేయుచున్నారు.ఇందు వలన చీనాకు మరింత నష్టమే కాని లాభము కలుగకున్నది.

చీనా గనులలో 930,000,000,000టన్నుల బొగ్గు పడివున్నను,సంవత్సరమునకు 28,000,000 టన్నుల కంటె యెక్కువ త్రవ్వుటకు వీలులేకున్నది.1,000,000,000 టన్నుల ఇనుము పడివున్నను, సంవత్సరమునకు 2,500,000 టన్నుల కంటె యెక్కువ త్రవ్వుటకు సాధ్యము కాకున్నది.ఈగనులలో చాలాభాగము మంచూరియా,జహోలు ప్రాంతములందుంటచేత ఆ భాగ్యమును జపాను దోచుకొనుచున్నదేగాని చీనాకు దక్కకున్నది.ఈ కారణములవల్ల సుప్రసిద్ధమైన చీనా నేత పరిశ్రమలలో నూటికి 85 వంతులు ప్రత్తినూలు బట్టలు, 6
చీనా-జపాను

40 వంతులు పట్టుబట్టలు ఫ్యాక్టరీలలోగాక చేతిమగ్గముల మీదనే తయారుచేయవలసి వచ్చుచున్నది. పెక్కు మంది వ్యవసాయజీవులే యైనను మిల్లులలో పనిచేయువారు 2,750,000 మంది గృహపరిశ్రమలవారు 12,000,000 మంది ఉన్నారు.ఈ పరిశ్రమలవారందరూ దగ్గిర దగ్గర నగరములలోను,విదేశస్థుల మిల్లుల లోను జీవించుటచేత వీరికి మంచి ఐకమత్యము,బలము ఉన్నది.పనిచేయు గంటలు తగ్గించుమని, కూలి హెచ్చించు మని.నిరుద్యోగమును తొలగించమని. ఇతర హక్కులిమ్మని,ఇందుకు తగిన శాసనములుండవలెనని వారు నిరంతరాందోళనము చేయుచు పల్లెటిగ్రామములవారిని గూడ ఉద్బోధించి విప్లమును లేవనెత్త జూచు చున్నారు.చీనాదేశమునకు మహత్తరమయిన శక్తిస్వాతంత్రములు రావలెనంటే వీరి ప్రయత్నములవల్లనే వచ్చుననుటకు సందేహము లేదు.

జాతీయ ప్రభుత్వ స్థాపనము

చీనాకు ఈవిధము ఆర్థికదారిద్య్రము,రాజకీయదాస్యము,కాయిక కష్టము ఒక్కముహూర్తమున సంభవించినవి. దీని కంతటికిని విదేశసామ్రాజ్యతత్వ ప్రభుత్వముల చర్యలే కారణములని చీనాప్రజలు గుర్తించిరి.1900లో బాక్సరుతిరుగుబాటు పేరుతో"యుహొచుఆను" అను ఉద్యమము లేచినది.ఈతిరుగుబాటును విదేశ ప్రభుత్వ ములన్నీకలసి అణగద్రొక్కినను ఉద్యమము మాత్రము
చీనా

చావలేదు.ఈ విదేశప్రభుత్వము లనేకములై ఒకటి నొకటి మించిపోకుండా కాచుకొనుచుండుట చేత చీనా సామ్రాజ్య వంశమసలే అంతరించలేదు.మంచూ వంశస్థులక్రింద నింకనూ అది నామమాత్రావశిష్టమై యున్నది ".పరదేశస్థులెట్లు చెప్పితే అట్లుచేయడం,స్వదేశస్థులెట్లు నిందిస్తే అట్లు పడడం,ఇదిరాజవంశం యొక్క గతి.

ఈ రాజవంశం కూడా 1911 వ సంవత్సరం తిరుగుబాటువల్ల తొలగిపోయినది.ఈ సంవత్సరములో చీనా రిపబ్లికు స్థాపించబడినది.అధికారము పౌరుల వశమైనది.అయినను చీనాకష్టము లింతటితో గట్టెక్కలేదు. ముందు రానున్న మహాప్రళయమున కిదియొక సూచనమాత్రమే.

1911లో నెలకొల్పబడిన చీనారిపబ్లిక్కునకు జనరల్ యుఆన్‌షీకేయ్‌ మొట్టమొదటి అధ్యక్షుడు.ఈ రిపబ్లిక్కు స్థాపనకు కూడా పాశ్చాత్యసామ్రాజ్య ప్రభుత్వములే తోడుపడినవి.వారి సహాయముతోనే అధ్యక్షుడు చీనా పరి స్థితులను చక్కబెట్టజూచెను.అంతకు ముందు సన్‌యట్‌సేను నాయకత్వముక్రింద చీనా ఉద్యమమును క్యూమిన్‌ టాంగు పక్షము వారు నడిపించుచుండిరి.దీనికి పాశ్చాత్యసామ్రాజ్యముల అధికారమంటే కిట్టదు.దానిని అణగ ద్రోక్కుటకే ఈ పక్షము కంకణముకట్టుకొని పనిచేయుచుండెను.పాశ్చాత్యప్రభుత్వముల ఆధారముతో చీనా రిపబ్లిక్కును స్థాపించిన యుఆన్‌షిన్‌కేయ్‌ ఈ పక్షమును ధ్వంసముచేసి వారియండ నిలువగలిగెను.

7
8
చీనా-జపాను

కాని ఈ విజయము చిరకాలము నిలువలేదు.దక్షిణప్రాంతములలో సన్‌యట్‌సేను క్రమక్రమముగా బలవంతుడై క్యూమిన్‌టాంగును బలపరచి తిరుగుబాటును లేవదీసెను.

ఇంతలో ఐరోపాయుద్ధము వచ్చెను.ఈ యుద్ధములో జపాను పాలుగొనలేదు సరేగదా చీనాసముద్రములో జర్మనీ పడవలను ముంచివేయుచు,జర్మనీరాష్ట్రమగు షాంటాంగును ఆక్రమించుచు చీనాలో పాశ్చాత్య దేశము లనుమించి తన ప్రతిభ నెక్కువగా స్థాపించుకొనజొచ్చెను.జపాను ఈ విధముగా బలవంతమై చీనా ప్రభుత్వము ను తన యురవైయొక్క డిమాండులను అంగీకరిస్తావా అంగీకరించవా అని 1915లో బెదరించెను.ఇందుకు చీనా ఒప్పుకుంటే అనేక పాశ్చాత్యప్రభువులకు బదులు ఒక్క జపాను దాస్యమునకు అంగీకరించినట్లే అగును; కనుక చీనాప్రజలు దీని కంగీకరించలేదు,సరేగదా,అమెరికా సామ్రాజ్యము కూడా దీనిని ప్రతి ఘటించెను. ఏమైనా సరే ఐరోపాయుద్ధానంతరమున 1918 వ సంవత్సరము నాటికి తక్కిన దేశము లన్నింటిని తీసికట్టు చేసి జపాను బలవత్తరమైన శక్తియై చీనాను గడగడలాడించుచుండెను.1919 లో జరిగిన వార్సయిల్సు ఒడంబడిక ప్రకారము షాటాంగు,మంచూరియా,మంగోలియా రాష్ట్రములందు జపాను చేసుకొనిన అక్రమణ ములను ఆదేశములు పూర్తిగా అంగీకరించినవి.
చీనా

రష్యాలో జారు ప్రభుత్వము అంతరించి కమ్యూనిష్టు రాజ్యము రాగానే చీనా కార్మికులకు కూడా పెద్ద ఉత్సాహ ము జనించినది.వారుకూడా కమ్యూనిష్టు పార్టీని యేర్పరచుకొనిరి.రష్యా కమ్యూనిష్టు ప్రభుత్వము జారు చీనా తో చేసుకొన్న ఒడంబడికలను,చీనాకిచ్చిన ఋణములను రద్దుచేయుట వలన వీరి ఉత్సాహము మినుమ డించినది. చీనా కర్మిక విప్లవమును సంపూర్ణ స్వాతంత్ర్యమును పోషించగలనని రష్యా ప్రకటించుటచేత వీరి ధైర్యము మరీ యెక్కువైనది.

ఇంతకుముందుచీనాజాతీయోద్యమమునందు పాల్గొనెడివారు మధ్యతరగతులవారు,విధ్యార్థులు,విద్యాధికులు మొదలుగాగల మితమగు అస్తిపరులైయుండిరి.కమ్యూనిస్టు పార్టీ లేచి సమ్మెలు,ప్రదర్శనములు చేయగానే వీరి అధికారములు కూడ వెనుక పడ్డది.దీని నఱిగట్టుటకై చీనాలోని సేనానాయకులు భాగ్యవంతుల తరపునవచ్చి తమలోతామును వీరితోకూడను పోరాడవలసివచ్చెను.ఇందువల్ల చీనా మరింత దరిద్రమయ్యెను.ఈ సమయము న సామ్రాజ్య ప్రతికూలపక్షమును జాతీయ విజ్ఞానపక్షమును చేతులు కలుపుకొని క్యూమిన్‌టాంగును ముట్టడించి బలపరచి శాంతి నెలకొల్ప బూనినవి.

క్యూమింటాంగులోనే రెండు శాఖలేర్పడినవి.ఒకటి జాతీయ శాంతివాద పక్షము,రెండవది సంపూర్ణ కార్మిక విప్లవ పక్షము.ఈ రెండునూకాక కమ్యూనుష్టుపార్టీ మూడవది

9
10
చీనా-జపాను

యేలాగనూఉన్నది.క్యూమింటాంగులో దక్షిణభాగము వారు జాతీయశాంతివాదులు;వామభాగమువారు విప్లవ వాదులు.దక్షిణ పక్షసహాయముతో వామపక్షమువారిని,కమ్యూనిష్టులను కూడా చాంగుకెయ్‌షేకు అణగ ద్రోక్కి సంపూర్ణ జాతీయపక్ష ప్రభుత్వమును నెలకొల్పబూనెను.1926 మే మాసములో అతడు కొంతవరకు విజయ ము నందెను.క్వాన్టంగు,షాంఘే జిల్లాలలో కార్మికుల బలము నాశనము చేయబడెను.నాన్‌కింగులోజాతీయ ప్రభుత్వము నెలకొల్పఁబడెను.

దక్షిణపక్షము యొక్క విజయమునకు కమ్యూనిష్టు పార్టీవారి కొన్ని చర్యలే కారణములు.ఆచర్యలను వార ప్పుడు అవలంబించవచ్చునా కూడదా అన్నది కొంతవరకు సందేహాస్పదమే.విప్లవమును నాలుగు గుఱ్ఱాలూ పూన్చి పరిగెత్తించుట ఆ సమయమున నీతివంతమగు కార్యంకాదు.అది ట్రాట్‌స్కీ సిద్ధాంతముల చొప్పున సవ్య మైనట్లు కనిపించినను స్టేలిను సిద్ధాంతముల ప్రకారము అపసవ్యమైనదే.ఈపరిస్థితులలో చీనా కార్మికులు చీనా జాతీయోద్యమమును పూర్తిగా విసర్జించుటకు వీలులేకుండెను. క్యూమింటాంగును వారు పూర్తిగా విసర్జించిరేని కర్షకబృందము వారి ప్రక్కన నిలువదని వారికి అధైర్యము కలిగెను.కర్షకులలో కూడ విప్లవ భావములు పూర్తి గా చెలరేగనిదే జాతీయేద్యమమును తూలనాడుట మంచిమార్గము కాదని కమ్యూనిష్టు ఇంటర్నేషనలు యొక్కయు, స్టేలిను యొక్కయు అభిప్రాయమైయుండెను.ఈ కారణముల వల్ల చీనా విప్లవ నాయకులు లేక క్యూమింగు టాంగు వామపక్ష నాయకులగు వాంగుచిన్‌వెయి మొదలగువారు దక్షిణపక్షముతో గట్టిగా పోరాడలేదు సరేగదా దానికి ప్రతికూలముగ కొందరు భూస్వాములలోను పూంజీదారులలోను దూరిపోయిరి.ఇట్టి చర్యలు మాత్రము అవకతవకవే యైనను ఈసమయమున మోటాయించి కర్షకశ్రేణిని విసర్జించుట సరియైన మార్గము కాదని అందరును ఒప్పుకొనుచున్నారు.

వూహానులో కమ్యూనిష్టు ప్రభుత్వము

చియాంగ్‌ కాయ్‌షేకు నాంకింగులో బూర్జువా ప్రభుత్వమును స్థాపించినను అది బలవత్తరముగా లేకుండెను. క్వాంగుటాంగు,షాంఘే జిల్లాలలోని కర్షక కర్మిక సంఘముల నణగత్రొక్కుటయే అతడు తన మొట్టమొదటి పనిగాబూనెను.

కర్షక కార్మిక సంఘముల యెడల నాతడవలంబించిన ఇట్టి ఘోరచర్యలు వారిద్వేషమును మఱింత బలపర చెను. వీరును విద్యార్థిసంఘములును కలసి వూహాన్‌ నగరమునందు 1927లో మరియొక ప్రభుత్వమును నెలకొల్పిరి.ఈప్రభుత్వము స్థాపించబడినప్పటి నుండియు కర్షకసంఘములు మరింత బలపడినవి. హూనాన్‌, హూపే జిల్లా కర్షకసంఘములో నున్న 800,000 సభ్యులసంఖ్య మే మాసము నాటికి,

11
12
చీనా-జపాను

2,000,000,లకు పెరిగినది.ఈ రెండుమాసములలోనే హూనాను జిల్లా కర్షక సంఘసభ్యుల సంఖ్య 5,000,000 లకు పెరిగినది.

ఈసంఘముల సభ్యులసంఖ్య పెరుగుటయే కాక వీరి చర్యలుకూడ విప్ల వమార్గములు పట్టినవి. అనేక గ్రామములలోను నగరములలోను క్యూమిటాంగు ప్రభుత్వపుటాజ్ఞలు ధిక్కరించబడినవి.భూస్వాముల భూము లను సాహుకార్లసంపదను వీరు స్వాధీనము చేసుకొని తమకుటుంబములలో పంచుకొనిరి.పెద్ద కుటుంబముల వారికి పెద్దవంతు,చిన్నకుటుంబము వారికి చిన్నవంతు, ఈ రీతిగా కుటుంబసభ్యులసంఖ్యనుబట్టి పంచుకొనిరి. అనేకమంది భూస్వాములు సాహుకార్లు ఈ అపాయములను గుర్తించి తమ ఆస్తులను తామే వీరికి ఒప్ప చెప్పిరి.అట్లా ఒప్పచెప్పని వారిని వీరు అరెస్టుచేసి శిక్షింప మొదలు పెట్టిరి.పట్టణములలో కార్మికసంఘము లు, ట్రేడుయూనియనులు కూడా ఇట్టి సాహసములే యొనరించినవి.

కాని దిగువ మధ్యతరగతులవారికి,విజ్ఞానసంతతులవారికి,భూస్వాముల పుత్రులకుగూడ ఇట్టిచర్యలు విపరీత ములుగా దోచినవి.వీరుఇంతకుముందు విప్లవోద్యమపోషకులేయైనను ఈకార్యములను చూచి భయపడి జాతీయ పక్షముతో చేతులు కలుపజొచ్చిరి.ఈ సమయముననే విదేశప్రభుత్వములవారు షాంఘేనగరమును ముట్టడించి అక్కడకు ఆహారాది పదార్థములు పోకుండా ఆటంకపెట్టిరి.వూహాను ప్రభుత్వప్రదేశములలోనే ఇట్టిచర్యలవలన ఆర్థికపరిస్థితులు,అకటావి
చీనా

కటకమైనవి.వస్తువుల వెలలు పడిపోయినవి.క్రొత్తగా దేశాభివృద్ధికై విధించిన పన్నులను ప్రజలిచ్చుకొనలేక పోయిరి; కనుక ఈ పన్నులను ప్రభుత్వము తీసివేయవలసి వచ్చినది.డబ్బు లేకుంటే దక్షిణపక్ష సేనా నాయకులతో యుద్ధము సాగదాయెను.అమెరికాకు ఇట్టిచర్య లిష్టము లేకుండుటచేత అది ఆహారపదార్థములను చీనాకు పంపుట మానివేసెను.ప్రజలు మలమల మాడిపోవుచుండిరి.వెదేశ వ్యాపారము ఈ కారణములవల్లనే క్షీణించినది.డబ్బు కోసం వూహాను ప్రభుత్వము నోటులెక్కువగా వేయించి ఆ పదార్థములకు కృత్తిమపు హెచ్చువెలలు కలిగించెను.ఇందువల్ల పరిస్థితులు మరీ విషమించినవి.అనేకులు ప్రభుత్వపక్షమును వీడి క్యూమిన్‌టాంగు దక్షిణపక్షములో చేరిపోయిరి.ఇందువల్ల ఆపక్షము బలపడి ఒకసేనా నాయకునిక్రింద తిరుగబడి కర్షకసంఘములను ట్రేడుయూనియనులను రద్దుచేసి వందలకొలది వీరి నాయకులను కాల్చివేసెను. ఇది యంతయు మే 21 తేదినాటికే జరిగెను.తక్కిన వామపక్ష నాయకులు కూడ భూస్వాములలోను పూంజీదారు లలోను దూరిపోయిరి.జూలై నాటికి ఈ సంఘములన్నియు అక్రమసంఘములుగా ప్రకటింపబడినవి.

దీనివల్ల చీనాప్రజలకు ఒక్కసంగతి బాగా విశదమైనది.కర్షకకార్మికులు తక్క ఇతలెవ్వరును నిజమైన దేశ స్వాతంత్ర్యమునకై పోరాడరనియు,ఇతరులందరును భాగ్యవంతులతోనో తద్వారా జపానులేక యితర విదేశసామ్రాజ్య ప్రభుత్వముల

13
14
చీనా-జపాను

తోనో చేతులు కలుపుకొని వారిని అణచివేయుటకు సంకోచింపరని తేటయైనది.ఇందుకు తగినట్లు వారు కట్టు బాట్లు చేసుకొనప్రారంభించిరి.

కాంటనులో కమ్యూనిష్టు ప్రభుత్వము

1927 ఆగస్టు 1 వ తేదినాటికి ఈ ప్రయత్నములు పూర్తియైనవి.అనేకమంది జాతీయవిప్లవసేనా నాయకులు కూడా వీరిలోనికి వచ్చిరి.కమ్యూనిష్టు సేనానులు యేటిన్‌,హొలంగు అని వారలక్రింద ఈ సేనలు తిరగబడి క్యూమింగుటాంగు పక్షమును కియాంగ్స రాష్ట్రరాజధాని యగు నాంచాంగు నగరమున ఓడించెను. ఆరువారములలోనే క్వాంగుటంగు రాష్ట్రములో స్వాటోనగరము వరకును పోయి ఆనగరమునాక్రమించుకొనిరి. ఈసమయమున క్వాంగుటంగు కియాంగ్సీ రాష్ట్రముల సేనానులు తమలో తాము పోరాడుకొనుచుండిరి.దీని నాధారముగా గొని ప్రజలఉత్సాహము నూత చేసుకొని క్వాంగుటంగు రాష్ట్ర రాజధానియగు కాంతనులో వీరు కమ్యూనిష్టుప్రభుత్వము స్థాపించిరి.

డిసెంబరు 11 వ తేదిని వీరిమీద తిరుగుబాటు లేచెను.కాని కమ్యూనిష్టు పార్టీవారు మధ్యతరగతులవారినుండి ఆయుధములను పెరుకుకొనిరి.పోష్టు,టెలిపోను,టెలిగ్రాపు,పోలీసు బేరక్సు మొదలైన శాఖలన్నింటినీ తమ ఆధీనములోనికి తీసుకొనిరి.క్యూమింటాంగు ఆఫీసులన్నింటినీ కాంటనులోనికి
చీనా

మార్చివేసిరి. 12 వ తేదిని సుచావోచిన్‌ అధ్యక్షత క్రింద కాంటను సోవియటు ప్రభుత్వమును ప్రకటించిరి. సుచావోచిన్‌ దూరముగ నుండుటచేత చాంగుటెయిలే అను సేనాని ఆక్టింగు అధ్యక్షునిగా నియమించిరి;కాని ఇతనిని కూడ యెవరో హత్య గావించిరి.

తరువాత కాంటను కమ్యూను ప్రకటింపబడెను.దీనివల్ల వివిధసంఘములకు వివిధసౌకర్యములు ఈయబడినవి.

కార్మికులకు:దినమున కెనిమిదిగంటలపని, యెక్కువ కూలులు, పనివారల పనులను పనివారే తనిఖీ చేసు కొనుట, నిరుద్యోగులకు తాము ఉద్యోగములోనుండిననాడు తెచ్చుకొనుచుండిన సంపాదనలనుబట్టి నిర్ణయించ బడిన సహాయములు.విప్లవ ప్రతికూల ట్రేడు యూనియనులను రద్దుచేయుట.

కర్షకులకు:భూస్వాములకు భూమిలేకుండచేసి కర్షకుల కందరకును పంచిపెట్టుట, వడ్డీవ్యాపారస్థులకు వీరియ్య వలసిన ఋణములను రద్దుచేయుట, దుర్భరములగు పన్నులనుతీసివేయుట, గ్రామాలలోను జిల్లాలలోను సోవియటు సంస్థలను స్థాపించుట.

సిపాయీలకు:విప్లవపక్ష సైనికికందరికు భూములనిచ్చుట, వారి బసలు దుస్తులు ఆయుధములు మొదలగునవి మేలుతరములుగా చేయుట, వారి జీతములు నెలకు 12 నుండి 20 డాలర్లకు హెచ్చించుట కర్షకకార్మికుల రక్తవర్ణసేన(రెడ్‌ఆర్మీ)ల నేర్పరచుట.

15
చీనా

బూర్జువా, కమ్యూనిష్టు కలహములు

1928 మొదలు 1936 వరకు

1928 మొదలు 1936 వరకు చీనాలో కమ్యూనిష్టు, బూర్జువా పక్షములకు నిరంతర యుద్ధములు జరుగు చునే యుండెను.క్యూమింటాంగు లేక నాన్‌కింగు ప్రభుత్వమునకు చియాంగు కెయిషేకు అధ్యక్షుడు. తక్కిన పక్షములు కమ్యూనిష్టు నాయకుల అధికారము క్రింద ఉండెను.ఈపక్షములు దినదిన ప్రవర్థమాన శక్తియుక్త ములగుచుండెను.వీని నణచుటకు చియాంగుకెయిషేకు 9యుద్ధములకు తక్కువ కాకుండా ఒనరించెను. ఒకయుద్ధమునందును అతనికి జయము కలుగలేదు సరేగదా కమ్యూనిష్టు ప్రభుత్వము క్రిందికి అనేక జిల్లాలుజారిపోవుచుండెను.

మొదటి యుద్ధము

మొదటియుద్ధము 1930 అక్టోబరునుండి 1931 వరకును సాగెను.ఈయుద్ధములో చియాంగుకెయుషేకు స్వయముగా సేనలను నడిపించి మూడుమాసములలో విప్లవకారులను కలికములోనికి కానరాకుండా చేయుదునని ప్రగల్భములు కొట్టెను.కాని టంగుకూ యుద్ధములో అతను పూర్తిగా ఓడిపోయెను.1928 లో 10,000 సైనికులుగల కమ్యూనిష్టుసేన యుద్ధము తరువాత 62,000 వరకు ప్రబలెను.వీరిలో సగముకంటె యెక్కువమందియొద్ద ప్రశస్తమైన ఆయుధములు తుపాకులు ఉండెను.

2 18
చీనా-జపాను

రెండవ యుద్ధము

అయినను చియాంగు కెయిషేకు నిరాశ చెందలేదు.విదేశ ప్రభుత్వములు అతని అడియాశలను పెంచు చుండెను.వారి యండ చూచుకొని అతను వెంటనే రెండవ యుద్ధమును ప్రారంభించెను.ఈయుద్ధములో కూడ చీనా యెఱ్ఱ సేనలకే జయము సిద్ధించెను.13,28,54 నెంబర్లుగల సుప్రసిద్ధ క్యూమింగుటాంగు దళములు పరాజితములైనవి.ఎఱ్ఱసేనలు కియాంగ్సీ నగరమును స్వాధీనము చేసుకొనెను.తరువాత రాజధాని నగరమగు నాంచాంగు లోనికి ప్రవేశించెను.హూపే,హోనాను జిల్లాలలో సోవియట్టు ప్రభుత్వములను వీరు స్థాపించి నందు వల్ల చియాంగు కెయుషేకు తన సేనలను కియాంగ్సీ రాష్ట్రమునుండి పూర్తిగా తీసుకొని పోవలసివచ్చెను.

మూడవ యుద్ధము

1931 వేసంగి కాలములోనే మూడవయుద్ధము ప్రారంభమాయెను.చియాంగుకెయుషేకు తన ముప్పది దళములను ఒక్కచో ప్రోగుచేసి మూడు మాసములలోగా విప్లవమును రూపుమాపకున్నచో ఆత్మహత్య చేసుకొందునని ప్రతిజ్ఞ చేసెను.మూడవసారి కూడ అతనికి సంపూర్ణ పరాజయమే సిద్ధించెను.విప్లవదళములు కియాంగ్సీ రాష్ట్రము నందలి కెంబో నగరమును స్వాధీనము చేసుకొని పారిశ్రామిక నగరమగు హాంకోను
చీనా

ముట్టడింపబోయెను.దీనితో వారిసేనలు మరీవృద్ధికాజొచ్చెను.కాని చియాంగు కెయిషేకు తనమాట నిలబెట్టు కొనలేదు,ఆత్మహత్య గావించుకొనలేదు.

నాలుగవ యుద్ధము

1932 నుండి చియాంగుకెయి కష్టములినుమడించెను.చీనాలో విప్లవదళములు వృద్ధియగుచుండుటయు తనకు కష్టము లధికమగుచుండుటయే గాక జపానుకూడా చీనాకు ప్రక్కలో బల్లెమై క్రిందను మీదను కూడా పొడవ జొచ్చెను.షాంఘేనగరమును నావలతోను విమానములతోను యెదురుకొనుటయే గాక చీనానుండి మంచూరియా ను విడదీసి దానికి “మంచూకో ” అని ఒక క్రొత్త నామధేయమును పెట్టెను.1911 లో చీనా సామ్రాట్టు పదవి నుండి భ్రష్టుడుగా చేయబడి దిక్కులేక తిరుగుచుండిన హెన్రీపూయిని మంచూకో సామ్రాట్టుగా నొనరించెను. ఈసమయమునందే విదేశప్రభుత్వములు కూడ దక్షిణనగరములపై బాంబులు విసరి అల్లకల్లోల మొనరించు చుండెను.చియాంగుకెయుషేకు అవతల జపాను నెదురుకొనునా,ఇవతల విదేశప్రభుత్వములతో డీకొనునా? రెండును మాని సోవియటు విప్లవులపై తిరిగీ యుద్ధమును అతడుప్రారంభించెను.విదేశ,జపానుప్రభుత్వములతో డీకొనుట కష్టమనియు,చీనావిప్లవులనే చితుకగొట్టవచ్చుననియు అతడూహించి,నాల్గవయుద్ధమును మొదలుపెట్టెను.

19
20
చీనా-జపాను

కాని చీనా విప్లవపక్ష మంతసులభముగా ఓడిపోవునా?ఇప్పటికే కియాంగ్సీరాష్ట్రమంతయు వారిస్వాధీనమైనది. 1931 నవంబరు 7 వ తేదినాడే అక్కడ జూయికిన్‌ రిపబ్లిక్కు స్థాపింపబడి కాంటనుకమ్యూను పడిపోయిన కొరతను పూర్తిచేసినది.కనుక ఈ నాలుగవ యుద్ధముకూడ ఇంతకు ముందరి మూడు యుద్ధములవలె అతనికి పరాభవమునే కూర్చినది.అవతల ఉత్తరచీనాలోనా అతని ప్రతిష్ట పోయినది.దక్షిణమున తన సేనలకు దెబ్బలు తగులుచున్నవి.ఏమిచేయుటకును అతనికి పాలుబోలేదు.హూపే,హోనాన్,అన్హులెయి రాష్ట్రములు కూడా సోవియట్టు ఆధీనమైనవి.

అయిదవ యుద్ధము

అయినను చియాంగుకెయిషేకు సుప్రశస్త సేనాని.అతనికి చీనా పుంజీదారుల సహాయమేకాక జపాను, విదేశ ప్రభుత్వముల మద్దత్తుకూడా ఉన్నది.వెంటనే అతడు 8లక్షల సేనను జాగ్రత పెట్టెను.కాని సోవియటు సేనలు,వర్గములు ఇట్టి బెదరింపులకు లొంగునవి కావు.చియాంగుకెయిషేకు అయిదవయుద్ధము నింకను ప్రారంభిచకముందే యెఱ్ఱ సేనలు షెచ్వాను రాష్ట్రములో అకస్మాత్తుగా ప్రవేశించెను.నాన్‌కింగు ప్రభుత్వమునకు చెందిన రెండుదళములను,క్వాంగుటంగుకు చెందిన ఆరు దళములను కలిపి మొత్తముమీద క్యూమింగుటాంగునకు చెందిన 37 దళములనుయెఱ్ఱ సేనలు ఓడించి,4 లక్షల
చీనా

రైఫిలులను,190 ఫిరంగులను,5000 మిషీనుతుపాకులను 12 విమానములను, అనేకము వైరులెసు పరికరములను స్వాధీనము చేసుకొనెను.ఈయుద్ధానంతరమున సోవియటు సేనలు 2 లక్షల వరకు పెరిగినవి.300 తాలుకాలలో సోవియటులు వ్యాపించిరి. 8 కోట్లు ప్రజలు వీరియాజ్ఞప్రకారము వర్తింపజొచ్చిరి.

ఆరవ యుద్ధము

అప్పటినుంచి చియాంగుకెయిషేకు ఆరవయుద్ధమునకు సన్నాహములు చేయుచుండెను.చీనాపరిశ్రమలను, విమానములను బాగుచేయు మిషతో అమెరికావారు అతనికి 55 కోట్ల డాలర్లను ఋణముగాఇచ్చిరి.కాని ఈఋణముయొక్క ప్రధానుద్దేశ్యము చీనా అభివృద్ధికాదు.సోవియటు రిపబ్లికు యొక్క విధ్వంసము.ఇదికాక జర్మనీ,జపాను దేశములు మంచి సైనికసలహాదారులను, అమెరికా, కనడా,ఇటలీ దేశములు సుప్రసిద్ధ వైమానికదళ నిర్వాహకులను పంపించిరి.1938 సెప్టెంబరునాటికి చియాంగుకెయుషేకు సేన 10 లక్షలు.వీరిలో 4 లక్షల40వేల మందిని చీనా రిపబ్లికుయొక్క మధ్యభాగమునందే అతడు కేంద్రికరించెను.వీరికి 300 విమానములు, అసంఖ్యాకములగు తుపాకులు, గ్యాసు బాంబులు ఇయ్యబడెను.

సెప్టెంబరులో యుద్ధము ప్రారంభమాయెను.కాని 1934 మేయి జూనులనాటికి యెఱ్ఱ సేనలు క్యూమింగుటాంగు యొక్క 7 దళములను సర్వనాశనము చేసెను.50,000 మంది

21
22
చీనా-జపాను

మరణించిరి.లక్షమందికి గాయములు తగిలి కాళ్ళు చేతులు విరిగినవి;12 వేలమంది ఖైదీలయిరి.కాని యెఱ్ఱ సేన 2లక్షలనుండి 2,60,000 కు పెరిగినది.

ఈయుద్ధమింతటితో ఆగలేదు.విప్లవపక్షమునకు సేనలయొక్క ఆవశ్యకతయు ప్రాధాన్యమును బాగా తెలిసినది.చీనా సోవియటు సేనల హెచ్చించి మంచిశిక్షణము నిప్పించుటయందే తమ శ్రద్ధనంతటిని వారు కేంద్రికరించిరి.సేనల బాగుపరచిన తరువాత రివల్యూషనరీ మిలిటరీకౌన్సిలువారి సలహా ప్రకారము వారు మధ్యజిల్లాయగు కియాంగ్సీని విడచిపెట్టి పశ్చిమ ప్రాంతములలో జొరబడిరి.1934 అక్టోబరులో వీరు చియాంగుకెయిషేకు యొక్క 8 లక్షల సేనలమధ్యనుండి యుద్ధము చేయుచు దూరుకొనిపోయి 1935 జనవరి నాటికి క్వాంగ్సీరాష్ట్రమునందలి క్వెయిలిన్ నగరమును చేరిరి.అక్కడున్న క్యూమింగుటాంగు సేనల నోడించిరి.క్వెయిచొ రాష్ట్రమునందలి క్వెయిటింగు నగరమునుదాటి ఫిబ్రవరి మధ్యభాగమునాటికి స్వెషాను ప్రాంతమును ముట్టడించిరి.ఏప్రిల్‌ వరకు వారెన్నో యుద్ధములొనరించుచుండిరి.దీనితో చియాంగుకెయిషేకు యొక్క 8 వ దళముకూడా ఓడిపోయినది.వాంగుకాయిలే అను మరియొక సేనానియొక్క అసంఖ్యాక దళములు ఓడిపోయినవి.

పిమ్మట యెఱ్ఱసేనలు యున్నాను రాష్ట్రములో ప్రవేశించి అక్కద సోవియట్టు సభలనేర్పాటు చేసెను.తరువాత షెచ్వాను
చీనా

రాష్ట్రములో ప్రవేశించి అచ్చటనున్న సోవియట్టు సేనాని హ్సూహ్సిసియాంగుషేను సేనలను కలుసు కొనెను. క్వెయిచొ, షెచ్వాను, సికాంగు, యున్నాను, కాన్సూ,షాన్సీ జిల్లాలను చేర్చి ఒక పెద్ద సోవియటు రాష్ట్రము ను నిర్మించెను.ఈవిధముగా ఇప్పటికి 398 జిల్లాలలో సోవియటు ప్రభుత్వము నెలకొల్పబడినది.ఇప్పటికి యెఱ్ఱ సైనికుల సంఖ్య 5లక్షలు.వీరిక్రింద 19 రాష్ట్రములున్నవి.వీటి పేరులు కియాంగ్సీ, క్వాంటంగు, ఫ్యూకీన్‌, షెకియాంగు, అన్వుహెయి, హోనాను, హ్యూపె, హ్యూనాన్‌, షెచ్వాను, క్వెయిచొ, యున్నాను, సికాంగు, షెన్సీ, కాన్సూ, హ్యోపేయి, ఫెంగ్టీను, కిరీను, హైలంగుకియాంగు.

జపాను ప్రతికూల పక్షములు

18-9-1931 తేదిన్ చీనాలోఒకపెద్ద ఖండమును జపాను ఆక్రమించుకొని మంచూకో సామ్రాజ్యమును స్థాపించినది.మరి నాలుగేళ్ళవరకు ఈవిజృంభణము ఇట్లే సాగినది.చీనాలో సుమారు సగము భాగము జపాను సామ్రాజ్యము క్రిందనో సైనికదళములక్రిందనో నలిగి వారికి లొంగిపోయినది.మంచుకో తరువాత జహోలు స్వాధీనమైనది.పిమ్మట చీనా“పెద్దగోడ”(గ్రేట్‌వాల్‌)చుట్టునున్న ప్రాంతమగు షాంఘయిక్వాను స్వాధీనమైనది. తరువాత లియాంగుటంగు జిల్లాలుని సైన్యములు నిరాయుధములు చేయబడినవి. పిమ్మట సూయనును, చాహార్‌, హోపేయి రాష్ట్రములను జపాను

23
24
చీనా-జపాను

ఒకటిగాచేసి చీనా ప్రభుత్వమునుండి విడదీసి“ఉత్తర చీనా స్వతంత్ర పరిపాలనాసభ” క్రింద ఉంచినది. అటు తరువాత హోపే, షాంటంగు, షాన్సీ రాష్ట్రములనంటియున్న ప్రదేశములను ఆక్రమించినది. వీనినన్నింటిని వలసరాజ్యముగా చేసికొనుటయే జపాను సంకల్పమని టానాకా మిమోరాండము వల్ల విశదమగుచున్నది.ఇవే వలసరాజ్యములైనచో తక్కిన ప్రాంతములు కూడ సులభముగ జపాను స్వాధీనమగుననుట నిస్సందేహము.

చీనానంతటిని ఈవిధముగా జపాను మ్రింగి వేయుచుండగా క్యూమింగుటాంగు ప్రభుత్వమేమిచేయుచున్నది?చియాంగుకెయిషేకు, వాంగుచిన్‌వెయ్‌, చాంగుహ్సియూలియాంగు మొదలగు క్యూమింగ్టాంగు సేనానులు జపాను నెదుర్కొనలేదు కదా,దానిని ప్రతిఘటింపనిశ్చయించుకొనిన కమ్యూనిష్టు దళములను రూపుమాప ప్రయత్నించు చున్నారు.దీనికంతటికిని వారు ఒకే కారణము చెప్పుచున్నారు.దేశములో శాంతి నెలకొననిదే విదేశప్రభుత్వ ములను తరుమ వీలులేదట.ఇందుకై చీనా జపానుల పరస్పర ఆర్థిక రాజకీయ సహాకారము అసరమట. కనుక జపాను ఆజ్ఞప్రకారము చీనాలో కమ్యూనిష్టు వాసనలు లేకుండాచేయుట ముఖ్యమట. ఇట్లు చేయుట వలన చీనా అంతటిని పూర్తిగా జపాను వలసరాజ్యముగా చేసి మహాద్రోహ మొనరించుచున్నామని వారు గుర్తించకున్నారు.

చీనా
అఖిల చీనా ప్రజా పరిపాలక పక్షము

జపాను శృంఖలములలో చీనా చిక్కుకోకుండా కాపాడవలెనని తాపత్రయము పడే పక్షము చీనాలో ఒక్కటే ఉన్నది.అదియే చీనా సోవియటు రిపబ్లికుపక్షము.చీనా ప్రజలనందరినీ తనతో యేకీభవించి జపాను నెదురించు మని అదియెంతో ప్రబ్రోధము చేయుచున్నది.క్యూమింగ్టాంగు సోవియటు జిల్లాలలో జోక్యము కలిగించుకోకుండగా ఉండే షరతు పైని చీనాప్రభుత్వముతో సోవియటులు యేకమై జపాను నెదిరించగలమని వారు వాగ్దానము చేయుచున్నారు.చీనాప్రజలందరికిని వాగ్స్వాతంత్ర్యము, ముద్రణాస్వాతంత్ర్యము, సంఘస్వాతంత్ర్యము, ప్రదర్శనా స్వాతంత్ర్యము ఇచ్చుటకు తాము తోడు పడెదమని కూడా వారు వాగ్దానము చేయుచున్నారు.

ఇప్పటికే సగము చీనా, జపాను కాలిక్రింద పడినది. మిగిలినది కూడా పడిపోయి చీనా జాతీయ స్వాతంత్ర్య మడుగంటకుంటా ఉండవలెనంటే చీనా సత్వరముగా ఏదో ఒక నిశ్చయమైన మార్గమునకు రావలెను.ఇందుకై కూడా సోవియటు పక్షములే ప్రయత్నము చేయుచున్నవి.చీనాప్రజలలో యెవరెవరి కెన్నిఅభిప్రాయభేదములు సిద్ధాంతభేదములున్నను వానినన్నింటిని లక్ష్యముచేయక అందరును యేకమై జపానును ప్రతిఘటించవలెనని వారు ప్రబోధమును చేయుచున్నారు.“అఖిల చీనాపరిపాలనము”ను స్థాపించి సోవియట్టులతోను, జపాను ప్రతికూల మంచూరియా నివాసులతోను

25
26
చీనా-జపాను

ఒక ప్రచండమైన పక్షము నెలకొల్పవలెనని వారు తెలుపుచున్నారు.వీరందరును కలసి జపాను ప్రతికూల అఖిల చీనాసేనను నిర్మించవలెననిన్ని, అద్ సోవియట్టుల యెఱ్ఱసేనలతోను, జపాను ప్రతికూల మంచూరియా సేనలతోను కలసి జపానును ప్రతిఘటించవలెనని వీరు ఉద్బోధించుచున్నారు.ఈ సంగతులు వీరు 1-8-1935 వ తేదిని చీనా ప్రజలకు గావించిన విన్నపమువలన విశదము కాగలవు.

ఇటువంటి సంయుక్త ప్రజాప్రభుత్వము ఈ దిగువ వివరింపబడిన కార్యములను నెరవేర్చవలెనని వీరు నిర్దేశించుచుచున్నారు.

1.జపాను విజృంభణమును సాయుధబలసమేతముగా నిరోధించవలెను.జపాను ఆక్రమించుకొనిన రాష్ట్రములనన్నింటిని తిరిగీ స్వాధీనము చేసుకొనవలెను.

2.చీనాలో కాటకములు రాకుండాచేయవలెను.నదులకు ఆనకట్టలను కట్టి నీటినిపొలములకు కాలువలద్వారా పారించి వ్యవసాయమునకు నీటియిబ్బంది లేకుండా చేయవలెను.ఎక్కడెక్కడ కాటకము ప్రాకుచున్నను వెంటనే తక్కిన ప్రాంతములవారు సహాయమునకై గడంగవలెను

3.జపాను సామ్రాజ్యమునకు చీనాలో ఎటువంటి ఆస్తులున్నను వానిని హరించి, జపాను ప్రతికూల సమరము లకు వలయు ఖర్చులక్రింద వినియోగించవలెను.