"అయిన నెనిమిదిముక్కలు కాగితమును, సిరాయు, నొక లేఖినియు గొనిరం" డని జనులచేఁ గ్రిక్కిరిసిన యా గదియంద యొకచోఁ గూర్చొని తనపేరు వ్రాసియిచ్చెను.
నవంబరునెల 6వ తేదీ లింకను జనసామాన్యులచేతను నిర్వాచకులచేతను సభాధ్యక్షతకు నియమింపఁబడెను. స్ప్రింగు ఫీల్డువిడిచి దేశాధ్యక్షత వహించుటకు వాషింగ్టనుకుఁ బోవుటకుముందు లింకను తల్లిని నితరచుట్టములను దర్శింప వెడలెను. తల్లికిని నతనికిని జరిగిన సంభాషణ వారి పరస్పరానురాగమును వెల్లడిపఱచుచున్నది. ఆమె స్వంత కుమారుల బోలె నతనిఁ గారాబమునఁ జూచుచుండును. అతఁడును దన తల్లినింబోలె నామెను గారవించుచుండును. లింక నామెదగ్గర సెలవుపుచ్చుకొనుతఱి వారి యనుభవము శోకము పుట్టించెడిని. తల్లి యతనిఁ గట్టిగఁ గౌగలించుకొని "నాయనా! పోయివచ్చెదవే. నిను మరలఁ జూడఁజాలనని నామనము గంపించుచున్నది. నీశత్రువులు నినుఁ బొరికొల్పెదరని భయమగుచున్న"దని యశ్రువులు నించెను. లింకను గద్గదస్వనమున "మాతా! అట్లెన్నటికిని భీతిల్లకుము. దైవానుగ్రహ ముండిన నంతయుఁ జక్కపడఁగలదు. మఱల మన మిరువురమును జూచుకొందుముగాక"ని యామె నోదార్చి యామె సెలవుఁబొంది 1861వ సంవత్సరము ఫిబ్రవరినెల 11వ తేది స్ప్రింగుఫీల్డు