తెరంగును బేరణంబు" ఉత్తర నేర్చెనని తిక్కన మూలమందులేని వివరములు తెలిపినాడు. మరులు, మందులు నాటికిని నేటికిని కొందరుస్త్రీ లందందు పెట్టినట్లు వినుచుందుము. వీటివలన లాభము లేకపోగా నష్టము, ప్రాణహాని కలుగునని ద్రౌపది సత్యభామతో చెప్పెను (ఆర.5-296 మొ॥), నన్నెచోడుని కాలములో తప్పుచేసిన వారిని చిత్రవిచిత్రముగా హింసించుచుండిరేమో.

"వీడె ఖలుండు............వీడు సర్వవ
ధ్యుం డెడ సేయకుండు శివదూషకు నాలుకగోసి యుప్పు నింపుండు
ద్రపుద్రవంబొడల బూయుడు లోహముగాచి నోర బోయుండు
దురాత్ము చర్మపట మొల్వుడు గన్నుల మీటు డుక్కరన్"

(కుమా.2-84) 'ఉరుముపై జీడినిర్రి యచ్చొత్తివిడిచె' (కుమా.4-16)

బాలికలు చిల్క బొమ్మలును, దంతపుబొమ్మలు, మేలిగాజు బన్నరులును, మ్రానిచొప్పికలు...బొమ్మరిండ్ల జేయనగు కూళ్ళును వండుచు బొమ్మ పెండ్లి" చేసిరి (కుమా.3-36). తోలుబొమ్మలాట భారతమందు కూడ సూచితము (విరాట.3-36).

ఆనాటి జనుల వినోదాలలో పెక్కు నేటికిని ఆచారమందున్నవి. "అంకమల్ల వినోదము" కోళ్ళపందెము లావకపిట్టల కొట్లాట, మేష మహిష (తందానవంటివి), ప్రహేళిక, చతురంగము, పాములాటలు, గౌడీ, మాధ్వీ, పైష్టీసురలసేవ ఇట్టి వినోదములు ననేకములు అభిలషితార్థ చింతామణిలో వర్ణించినారు.

శిల్పములు విశేషముగా దక్షిణదేశమందే వృద్ధియయ్యె ననవచ్చును. మాయాదులు, ఆర్యేతరులు మయుని పేరుతో ప్రసిద్ధమైన వాస్తుశాస్త్రములు కలవు. రాజప్రాసాదములను గురించి అభిలషితార్థ చింతామణిలో కొంత వివరణ కలదు. ఇండ్లకు స్తంభములుండుట దక్షిణదేశ గృహనిర్మాణ విశిష్టత