అశోకుడు/రెండవ ప్రకరణము

రెండవ ప్రకరణము


బ్రాహ్మణ దంపతులు

ఆ దరిద్ర బ్రాహ్మణుని యిల్లు మిక్కిలి చిన్నదిగ నుండెను. గృహద్వారములును జిన్నవిగనే యుండెను. అందువలనఁ బై వారెవ్వరైన నీయింటికి వచ్చినప్పు డింటి వారికి మిగులఁ నననుకూలముగనుండును. దైవజ్ఞుఁడు శుభ ఫలములను జెప్పి యున్నాఁడు. అది యాదంపతుల కానందదాయకముగ నేయున్నది. ఆ కారణమున నే వారాతని దమ యింటికి భోజనమునకుఁబిలిచి యున్నారు. కాని తాము దరిద్రులగుటచే నను పపత్తివలన నాతిథ్యవిషయమునం దాతని కేమేమి లోపములు జరిగియుండెనోయనియు నందువలనఁ దమ కేమగునోయనియు మిగుల సంకోచించిరి. కాని యా సంకో చము వారి హృదయమున నెంతయో సే వుండ లేదు. అతిథిసత్కారముల నంది దైవజ్జుఁడు వెడలిపోయెను.

సుభద్రాంగి యింతవఱకు సిగ్గుచే నొకచోటఁ కూర్చుండి యుండెను. ఆతఁడు వెడలిపోయినతరువాత

నెప్పటివ లె నాయింట మసలుచుఁ దల్లి కింటిపనులలో నించుక తోడుపడుట కారంభించేను.

ఆసమయమునందు గృహస్థుఁడు గృహిణిం బిలిచి దైవజ్ఞుఁ డేమేమి చెప్పియుండెనో యన్ని సంగతులను సవిస్తరముగఁ దెలుప నారంభించెను. మొదటినుండియు నెల్ల సంగతులను వినవలయునని గృహిణి యాత్రముతోడ నేయుండెను. కాని పనులతొందర వలనను గుమార్తె తన యొద్ద నుండుట వలనను దన భర్తంగూర్చి యింతవఱకు నామె యా విషయమునఁ బ్రశ్నించియుండ లేదు. అప్పుడా దైవజ్ఞుని భవిష్య ద్వాణింగూర్చి యెంతవఱకుఁ దనభర్త తనకుఁ జెప్పి యుం డెనో యామాటలు మరలమరల వినవలయు ననియే యామె వేఁడుకపడఁజొచ్చెను.

గృహ:- ఇప్పుడు మన మేమి చేయవలయును?

గృహి:- నేనేమి చెప్పఁగలను?

గృహ:-ఎట్లో యొక విధముగ నాలోచించి యేదైన నుపాయమును జెప్పుము !

గృహి:- ఇంకను నుపాయమేమి? దేవుఁడు మన యెడల నెంతదయ కలిగియున్నాఁడు! మన సుభద్రాంగి నిజముగా మహారాజ్ఞి యగునా?

అని చెప్పుచుండఁగా నా మెకన్నులలో నానంద బాష్పములు మిలమిల మెఱయఁజొచ్చెను.

గృహ:-మనసుభద్ర పర మసుందరి-ఉమా సమానురాలు, అదృష్టవశమున నీమె నేమహా రాజునకై న నుపాయన

9

రెండవ ప్రకరణము

ముగ నొసంగినచో నాతఁడీ మెను దనపుత్రవధువుగ ననుగ్రహించు ననుట యసంభవము కాదు. కాని యిట్టి దరిద్ర బ్రాహ్మణునియింటి కేమహారాజువచ్చును? — వారికటాక్షావలోకన మెట్లు లభియించును?

గృహి:-ఇఁక నేమియుపాయము ?

గృహ:- నే నీ చిన్ని బాలికను వెంటఁ బెట్టుకొని మహారాజగు బిందుసారుని రాజధానికి బాటలీపుత్రమునకుఁ బోయెదను. ప్రయత్నించెదను—భగవదనుగ్రహ మున్నచో మహా రాజు శుభదృష్టి లభియించును.

గృహి:- ఈ యాఁడుబిడ్డను వెంటఁ బెట్టుకొని దూర దేశమునకుఁ బోవుట యేమంత మంచిది ? ఇందునుగూర్చి లోక మేమనుకొనును?

గృహ:— అనుకొననిమ్ము ! ధర్మమును దైవమును సాక్షిగ నుంచుకొని నేనీ కార్యమునఁ బ్రవేశించెదను. నా చిన్ని సుభద్ర మేలుకొఱకుఁ బస చేయుచున్న నాకు లోకము వలని నిందాస్తుతులతో నిమిత్తము లేదు. నేను తప్పక పాటలీపుత్రమునకుఁ బోయెదను. ఈ ప్రయాణము శుభదాయక మగునని దైవజ్ఞుఁడు చెప్పియున్నాడు.