రెండవ ప్రకరణము

కృష్ణరాయలు రామరాయలు

శ్రీకృష్ణదేవరాయలవారు సకలసామ్రాజ్యభోగముల ననుభవించుచు ద్రావిడాంధ్ర కర్ణాటసామ్రాజ్యమును మహావైభవముతో నిరంకుశముగా నేలుచున్నకాలమున నాతనికి లోపడిన సామంతమండలేశ్వరులలో నొక్కడగు మహామండలేశ్వర రామరాజ పెదశ్రీరంగదేవమహారాజు కందనోలుమండలమునకు నధిపతిగా నుండి పరిపాలనము చేయుచుండె నని కంనోలుపురమునందలి యొకశాసనమునుబట్టి దెలిసికొనుచున్నారము.[1] ఇతఁడే అళియరామరాయల తండ్రి. అళియరామరాయల బాల్యచరిత్ర మెంతమాత్రమును దెలియ రాదు. మహమ్మదుకూలీకుతుబ్షా రాజ్యమునకు సరిహద్దున నున్న మండలము కందనోలుమండలమె. ఈ మండలమును అళియరామరాయల తండ్రి మాత్రమె గాదు; తాతయగు బుక్కయరామరాజు గూడఁ బాలించె నని పూర్వ ప్రకరణమునఁ దెలిపియున్నాను. బుక్కయరామరాజు విజాపురసుల్తా నగుఆదిల్షాహ డెబ్బదివేలయాశ్వికసైన్యముతో దండెత్తివచ్చి కందనోలు ముట్టడించినపుడు వానినోడించి తఱిమినట్లుగా పద్యబాలభాగవతమునందును నరపతివిజయమందును వర్ణింపఁబడినవిధమును గూర్చి పూర్వ

  1. 156 of 1905, E. R.