అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/పదనిష్పాదనకళ-3

-వాచస్పతి

పదనిష్పాదనకళ - 3

(The joy of coining new words!)

(గత సంచిక తరువాయి...)

వ్యావహారికానికి వ్యాకరణం లేదా?

కొన్నికొన్ని అభిప్రాయాలు ఎందుకు, ఏ విధంగా ప్రచారంలోకొస్తాయో అర్ధం కాదు. అలాంటివాటిల్లో ఒకటి - వ్యావహారికమంటే వ్యాకరణంతో వనిలేని భాష అనీ లేదా వ్యావహారికంలో వ్యాకరణ నియమాల్ని పాటించనక్కరలేదనీ, వ్యావవోరికమంటే ఎవథిష్టవెొచ్చినట్లుగా వారు చెలరేగిపోతూ భాషాపరమైన అరాచకాన్ని ఆస్వాదించడమేనని భావించడం. మానవ నాగరికతలోనూ, మానవ కార్యకలాపాల పరిధిలోనూ నియమాలు లేని రంగం ఒకటి కూడా దర్శనీయం కాదు. మనుషుల్ని బ్రతికించడానికీ, చంపడానిక్కూడా కొన్ని నియమాలున్నప్పుడు మేధాజీవి అయిన మనిషి సాలోచనగా మాట్లాడే భాషకి నియమాలు లేవనుకోవడం వివేకవంతం అనిపించుకోదు. కాబట్టీ వ్యావహారికాని క్కూడా తన నియమాలు తనకున్నాయి. మనకు తెలియకుండానే వాటిని అనుసరించి సంభాషిస్తాం. మన సస్పృహ సావధానంలోకి రానంత మాత్రాన అవి లేవనుకోకూడదు. ప్రపంచంలో మనకు సంబంధించిన ప్రతీదీ మనకు తెలిసి జరగదు. మన హృదయ స్పందన, జీర్ణ క్రియల్లాగానే! వ్యావహారిక నియమాలు గ్రాంథిక భాషానియమాల్ని అచ్చుమచ్చుగా అనుసరించేవి కాకపోవచ్చు. కానీ అవీ నియమాలే. ఎవడైనా వాటిని పాటించి తీరాలి. అది తమకోసం, తమ యొక్క ఇతరుల యొక్క సమీచీన అవబోధ కోసం! మనం బళ్ళలో నేర్చుకునే ఇంగ్లీషు నిజానికి ఆ దేశస్థుల అనునిత్య వ్యావహారికమే. మథి దానికో వ్యాకరణం ఉందని నేర్చుకుంటున్నాం గదా! వ్యావహారిక తెలుగైనా అంతే !

నియమాలన్నీ మార్పుకూ, ్రగతికీ అవరోధాలనీ, వాటిని సమర్థించేవారూ, బోధించేవారూ మార్పుకూ, ప్రగతికీ శత్రువులనీ ఖావించే దోరణి నరికాదు. మనం కోరుకునే మార్పులూ, పురోగతులూ అమల్లోకొచ్చిన తరువాత వాటిక్కూడా నియమాలేర్చడ తాయి. నియమాల్ని అనుసరించడం ద్వారా మనం ఏం చేస్తున్నాం? మానవచింతనలోని స్వభావసిద్ధమైన క్రమశిక్షణని గౌరవిస్తున్నాం. ఆ భాష మాట్లాడే ప్రజానీకాన్ని వారి పూర్వీకుల్నీ వారి మేధా వారసత్వాన్ని గౌరవిస్తున్నాం. ఆ భాషలో కాలపరీక్షకు తట్టుకుని నిలబడగల హేతుబద్ధ సంప్రదాయాల్ని బ్రతికిస్తున్నాం.

ప్రామాణికత వేఱు - సౌలభ్యం వేఱు

{c|(Standards and Convenience)}}

“వాడుకభాష అంటే సామాన్యప్రజలు వాదేదేననీ, అందులో వినపడే ప్రతి వాడుకా, పదమూ [ప్రామాణికమే” ననే వాదన. దీనితో ఏకీభవించడం కష్టం. ఎందుకంటే ప్రామాణికత అంటే అందటికీ అనుసరణీయమైనది. అది వ్యక్తిగతం కాదు. కానీ సామాన్యప్రజల వాడుక వ్యక్తిగతం.

ఈ పై వాదన కేవలం ప్రామాణికం. మనుషులు సాహిత్యం నుంచీ, ప్రామాణికులైన మేధావుల నుంచి నేర్చుకోవాల్సిన అవసరాన్నీ అలా బౌద్ధికంగా ఎదగాల్సిన అవసరాన్నీ ఇది రద్దు చేయబూనుకుంటోంది. ఇది ఎక్కడున్నవారు అక్కడే ఉండాలని ఆశిస్తోంది. ప్రామాణికాలంటూ ఏమీ లేవని, ఉండవని, ఉండకూడదనీ చెప్పడం దీని అంతరార్థంలా తోస్తోంది.

వాడుకలో ఉన్న ప్రతిదీ ప్రామాణికం కాదు. అదే నిజమైతే ఏ భాషాప్రజలకీ తమ భాషావ్యాకరణం అవసరం లేదు. అలాగే వారికి నిఘంటువులు కూడా అవసరం లేదు. ప్రామాణికం అనేదానికున్న అర్ధం బహులోతైనది. ఒక పదానికి లేదా వాడుకకి ప్రామాణికత ఎలా సిద్ధిస్తుందో అర్ధం చేసుకుంటే ఆ ప్రక్రియ ముందు వాడుక అనేది ఎంత చిన్న విషయమో మనకి అర్ధమవుతుంది. పై అభిప్రాయాన్ని ప్రామాణికంగా తీనుకుంటే ప్రతివారూ తన ఇష్టమొచ్చినట్లు (వ్రాస్తూ, పలుకుతూ అలాంటి తప్పుల తడిక భాషని తన అధికారబలాన్ని మందబలాన్నీ మందిబలాన్ని ఉపయోగించి తన అజ్ఞానాన్ని వాడుకభాష పేర ఇతరుల నెత్తిన రుద్ధుతూ చెలరేగిపోతారు. (ఇప్పుడు జణుగుతున్నది అదేననుకోండి) ఆ తరువాత కొద్ది వందల సంవత్సరాల అనంతరం ఆ భాషా ప్రజలు వెనక్కితిరిగి తమ భాష వైపు చూసుకున్నప్పుడు వారసత్వం స్థానంలో ఒక అస్తవ్యస్తపు సాంస్కృతిక అరాచకం గోచరిస్తుంది.

పదస్వరూపాలకి ప్రామాణికత సరైన వ్యుత్పత్తుల (అ్వయిం10- ఖల) ద్వారాను, శబ్బార్ధాల యొక్క సమ్యక్‌ సమన్వయం ద్వారాను సిద్ధిస్తుంది. ఒకే పదానికి అనేక వ్యత్పన్నాలు(661ఇ6ఆ) ఉన్నప్పుడు వాటిల్లో ఒకదాన్ని మటుకు బొత్తిగా మిగతా వాటితో సంబంధం లేని అర్ధంలో వాడుతూంటే, అలా ఎంతమంది వాడినా సరే, అది (ప్రామాణికం కాదు. అది సరిచెయ్యదగ్గ పొఅపాటు మాత్రమే. అలాగే పదం యొక్క అసలు వ్యుత్పత్తినే నిర్మూలించే విధంగా కొంతమంది. పలుకుతున్నారనే కారణం చేత ఆ దోషభూయిష్ట ఉచ్చారణ (ప్రామాణికం కాదు. అది సరి చెయ్యదగ్గ పాలపాటు మాత్రమే. అలా అసాధురూపాలు (005601 0%) ప్రామాణికం అవాలంటే ఆ భాషకున్న వేలాది సంవత్సరాల చారిత్రిక నేపథ్యం చాలావణకు (మళ్ళీ లభ్యం కావడానికి వీల్లేని విధంగా) నశించాల్సి ఉంటుంది.

పదస్వరూపాలకి ప్రామాణికత ప్రామాణిక వ్యక్తుల వాడుక ద్వారా వారు రచించిన ప్రామాణిక (గ్రంథాల ద్వారా వ్యాపిస్తుంది. ఒక్కొక్క జీవనరంగంలోను ఒక్కొక్క విధమైన [ప్రామాణికులు ఉంటారు. రాజకీయాల్లో ప్రామాణికుదైన వాడు కళల్లో ప్రామాణికుడు కాడు. కళల్లో ప్రామాణికుదైనవాడు వ్యాపార రంగంలో కాడు. అలాగే భాషాసాహిత్యాలలో ప్రామాణికులైన వ్యక్తులే పదస్వరూపాలకి ప్రామాణికులు. వారు తమ సొంతగొంతుగా, సొంత అభిప్రాయంగా, సొంత కల్పనగా వినిపించినవాటిల్లో ఏయే వాడుకలు చేశారో అవే ప్రామాణికం. అంతేగానీ దారిన పోయే ప్రతి దానయ్యా చేసే వాడుకలు ప్రామాణికం కావు, వారు ఎంతమందున్నా సరే ! భాషాసాహిత్య విషయాల్లో వారు (ప్రామాణికుల్ని అనుసరించాల్సినవారే తప్ప, అనుసరణీయ-వ్యక్తులు ఎంతమాత్రమూ కారు.

వాడుక ఒక సౌలభ్యం. అంతేతప్ప దానికి ప్రామాణికత లేదు. రెండింటినీ కలిపికొట్టడం, రెండింటికీ అభేదం పాటించడం మాన్‌ రాజకీయమో, వర్గ రాజకీయమో అవుతుంది తప్ప విద్యాపర చర్చ (2026అ10 630య30) అనిపించుకోదు. ఒకలు సోషలైదేషన్‌ అని పలకలేక సోసలైజేసన్‌ అంటారు. అది అతని సౌలభ్యం. నాకు తెలిసిన ఒకాయన తొంభై కి టొంటై అనేవాడు. అది ఆయన సౌలభ్యం. అంతేతప్ప అది ప్రామాణికం కాదు.

ఇది ప్రజాస్వామ్యమైనంత మాత్రాన జనం సర్వజ్ఞులు కారు. జనానికి “ఇది తప్పు, ఇది ఒప్పు” అని చెప్పే హక్కూ బాధ్యతా విషయవరిజ్ఞానులైన మేధావులకి, (ప్రామాణికులకీ తప్పనిసరిగా ఉన్నాయి. అంతేతప్ప వారు తమకంటే తక్కువ తెలినినవారిని అనునరించనక్కణలేదు. ఎందుకంటే విద్యావంత మేధావులు సాంస్కృతిక నాయకులు. సామాన్య ప్రజల తప్పుల్ని సరిదిద్దకపోతే వారు విద్యావ్యవస్థ నుంచి పొందాల్సిన ప్రయోజనాన్ని పొందలేక పోతారు. నమూనా పాత్రలూ (0016 10601), ప్రామాణికాలూ, మార్గదర్శకాలూ లోపించడం చేత వారిలో సృజనాత్మకత కూదా ఎదగాల్సినట్లుగా ఎదగదు.

అర్థం కానిది ఎవఱికి?

శాస్త్రసాంకేతిక సాహిత్యాన్ని తెలుగువారికి తెలుగులో అందించాలని చెప్పినప్పుడు, “తెలుగులో అందుకు తగ్గ సాంకేతిక పదజాలమేది ?” అని ప్రశ్నిస్తారు. “ఇదిగో, ఈ పదాలు మేము సిద్ధం చేశాం అని చూపించినప్పుడు “ఇవి మా కర్ధం కావట్లేదు. ఇవి నద్యఃస్పోరకంగా లేవు. ఇప్పటిదాకా ఇంగ్లీషులో మేము అలవాటుపడ్డ పదజాలం వేలు. వీటిని వింటూంటే మాకు ఆ శాస్త్రం స్ఫురించడం లేదు. (అంటే మాకు స్ఫురించదు కాబట్టి బహుశా దేశంలో ఎవటికీ స్ఫురించకపోవచ్చు” అంటూ ఒక బిక్కమొహాన్ని అభినయిస్తారు. “వీటిని ఈ ఈ అర్భాలలో ఈ క్రమంలో ఈ ఈ సూత్రాల ప్రకారం రూపొందించాం” అని విడమర్చినప్పుడు “మీరు రూపొందించారు సరే! వీటిని వాదేదెవజు ?” అని మళ్లీ ప్రశ్నిస్తారు. “ఇదుగో, ఈ ఈ రచయితలు ఇప్పటికే వాడడం మొదలుపెట్టారు. వీటిని ఇంకా ఇంకా ప్రచురపజచదానికి త్వరలో అధికారుల సహాయం కూదా తీసుకుంటాం” అని చెబుతాం. అంతే! ఆ మాటతో తెలుగువిరోధుల కోపం నషాళానికి అంటు తుంది. చేసేదేమీ లేక అమాంతం అపహాస్యాలకి దిగుతారు.

ఇలాంటివారిని నమ్ముకుంటే పెళ్ళి కుదరదు. పిచ్చీ కుదరదు. “తెలుగుపదాల్ని వాడడానికి ఆటంకంగా ఉన్నవి మానవ కల్పితమైన, లేదా స్వయంకల్పితమైన మానసిక అవరోధాలే తప్ప నిజంగా తెలుగులో పదాల కొత లేదూ అని ఇందు మూలంగా మనకి అవగతమవుతుంది. శాస్త్రసాంకేతిక రంగాలలో తెలుగు వదాలు లేకపోవదానికీ, ఉన్నా వాడకపోవడానికీ కారణం - తెలుగంటే ఉన్న చిన్నచూపూ, ఆంగ్లనుంటే ఉన్న వెట్టివ్యామోహం - ఇవే యథార్థమైన కారణాలు. తమ వ్యక్తిగత ఇష్టానిష్టాలకు ఆచరణాత్మకత ముసుగు వేస్తున్నారనేది సుస్పష్టం.

ఆంగ్ల మాధ్యమాన్ని శతాబ్దాల పాటు జనం మీద రుద్దడం ద్వారా కోట్లాదిమందికి చదువు రాకుండా చేసిన దేశం మనది. ఇక్కడ ఎవజూ మాట్లాడని, ఎవటికీ మాతృభాష కాని ఇంగ్రీషుకి కృత్రిమంగా ఒక సామాజిక విలువని సృష్టించారు.

ఇక్కడ ఈరోజున ఆఖరికి “ఇంగ్లీషే అర్ధమవుతుంది, తెలుగుకా”దనే విడ్డూరవు వాదన ఊపందుకోవడం విచారకరం. మన ప్రజలు అక్షరాస్యులు కాని రోజుల్లో వారికి ఫలానా పదాలు అర్థం కావంటే అందుకొక మంచి కారణం ఉంది.

కానీ జనాలంతా అక్షరాస్యులయ్యే సమయానికల్లా తెలుగు మాధ్యమాన్ని బళ్ళలోంచి బహిష్కరించారు. అందుమూలాన, విదేశాల జనానికి మాతృభాష మీద ఉన్న పట్టు మన జనానికి లేకుందా పోయింది, ఎంత చదువుకున్నా! అదే, మన ప్రజ లందటినీ తెలుగులోనే విద్యావంతుల్ని చేసి ఉంటే, విద్యారంగంలో తెలుగు మీడియం ప్రాముఖ్యం కౌనసాగి ఉంటే అప్పుడు మాతృభాషలో మనవారి పదజాల పరిజ్ఞానం ఇంగ్లీషువారిని మించిపోయి ఉందేది. తమ మాతృభాషాపదాలే తమకర్థం కాకుండాపోయి, వాటికి ఆంగ్లానువాదాన్ని ఇవ్వమని కోరుతున్న విచిత్రజనాభా పుట్టుకొచ్చేది కాదు. రంగులూ, అంకెలూ, జంతువులూ, పిలుపులతో సహా అన్ని పదాల్నీ ఇంగ్లీష్‌ నుంచి అరువుదెచ్చుకుంటూ ఒక నాసిరకం తెలుగు మాట్లాడే పదదారిద్ర్యపు తరం ఉద్భవించేది కాదు. ఈ రకంగ్యా ఒకపక్కన దేశమంతా వేలాది విద్యాలయాలతో దేదీష్యమానమై వెలిగిపోతూండగా, మజోవక్కన విరోధాలంకారంలా మన మాతృభాషానిరక్షరాస్యత మాత్రం యథా పూర్వంగా కొనసాగుతోంది.

మనం ఇవ్పుడు వ్రాస్తున్న తెలుగు చాలావనణకు మన ప్రాచీనులకి (ఈ అర్ధాల్లో) తెలీదు. నిజానికి ఇదొక కొత్త తెలుగు. ఆంగ్లంతో పోటీవదే (వ్రక్రియలో భాగంగా, గత వందా- ఇణవయ్యేళ్ళుగా మనం ఈ తెలుగుకి కొత్తపదాలు కల్పించుకుంటూ వాటిని వ్యావహారికంలోకి జతచేర్చుకుంటూ ఈ స్థాయికి అభివృద్ధి చేశాం. ఆ కృషినే ఇవ్చుడు కూడా కొనసాగించడానికి అభ్యంతరమేముంటుంది? ఇంగ్లీషు పదాలు చాలుననీ, వాటికి తెలుగు సమానార్థకాల్ని సృష్టించే పనిలేదనీ మన ముందుతరాల తెలుగువాళ్ళు అనుకుని ఉంటే ఈపాటికి తెలుగుభాష యావత్తూ మరణించి ఉండేది. ఎందుకంటే ఆంగ్ల పదాల్ని అనువదించకుందా అలాగే వాడితే భాషలో ఏ వాక్యంలోనూ తెలుగు ఉండదు. అలాంటి తెలుగు మాట్లాడ్డం కన్నా ఇంగ్లీషు మాట్లాడ్డమే సులభంగా ఉంటుంది. అందుచేత జనం తెలుగుని పూర్తిగా వదిలేస్తారు. స్వకీయత (0[81- ౨210) లేని భాష ఎవికీ అవసరం లేదు. కొత్త పదాల్ని సృష్టించలేని స్తబ్బావస్థకి చేలుకున్న భాషలు వాడుకలోని పదజాలాన్ని సైతం కోల్పోతాయి. ఎదుగుదలే జీవితం (0౪3 14. ఆ ఎదుగుదల ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడే అంతిమక్షణాలు ఆసన్నమవుతాయి.

చనిపోయిన మనిషినైనా (బతికించగలమవేమో గానీ, వ్యవహారదూరమైన భాషల్నీ వాటిల్లోని పదాల్నీ ఎట్టిపరిస్థితుల్లోనూ వునరుజ్జీవింపజేయలేమనీ, అవి శాశ్వతంగా పోయినట్లేననే కఠోర వాస్తవాన్ని తెలుగువారు గుర్తించే రోజు శీవ్రువే. రావాలి. సమకాలీనంగా సాంకేతిక విద్యలో తెలుగుకు స్థానం లేదు. మన ఎంజినీరింగ్‌ కళాశాలల్లో పాఠాలన్నీ ఇంగ్రీషు లోనే జజుగుతాయి. కనుక ఆ సాంకేతిక పదాలకు తెలుగు సమార్గకాల్ని సృజించాల్సిన

తరువాయి 42వ పుటలో....

వీస్తే కార్తీకమాసంలో తగినవిధంగా వర్షాలొస్తాయంటాడు.

వాయు (వ్రసారం బట్టి వానలను అంచనా వేసే మరో ప్రయోగాన్ని వివరించాడు. ముతకనూలుతో ఎనిమిది మూరల పొడవు, రెండు మూరల వెడల్పు వస్త్రం నేయించాలి. నలఖై ఎనిమిది మూరల పొడవున్న కర్రకు ఆ గుడ్డను పతాకంగా కట్టి ఆషాఢ శుద్ధ పూర్ణిమనాడు తెల్లవారుతున్నప్పుడు నిలబెట్టాలి. ఆ వస్త్రం గాలికి తూర్పుకు దిశకు ఊగితే వానలు బాగా పడతాయి. ఆగ్నేయ దిశకు పోతే వానలు పడవు. దక్షిణ, నైరుతి వైపు పోతే మేఘాల పుడతాయే కానీ వానలు ఉండదు. పడమటి దిక్కుకు పోతే అతివృష్టితో పాటు, గాలి ఉంటుంది. వాయువ్యం వైపు పోతే అతివృష్టి, సుడిగాలి ఉంటుంది. ఉత్తరం వైపు పోతే పంటలకు తగినంత వాన ఉంటుంది. ఈశాన్య వైపు పోతే మధ్యరకంగా ఉంటుంది. అన్ని వైపులకు తిరుగుతూ మెలికలు పడుతుంటే పంటలు పండే సమయంలో వానలు దట్టంగా పడి చెడిపోతాయి. లేదా శత్రువులైనా చెడగొడతారని వివరించాడు.

మేఘం పరివేషం లక్షణాలు, ఆకారాలను బట్టి కూదా వర్షాల రాకను వివరించాడు. భారతదేశంలో ఏయే ప్రాంతాలకు ఏయే (గ్రహాలు ఆధిపత్యం వహిస్తాయో వివరించాడు.

“చందన్సు విషయంలో కొన్ని క్రొత్త సంగతులు చెప్పినట్లే దోనయామాత్యుడు మన భాషలో ఆనాడు వాడుకొనే కొన్ని మాటలను గురించి కూడా మనకు చెప్పాడు. ఇవి మనకు తరచుగా కనబడని ప్రయోగాలు, మన తిథులలో ద్వాదశి మనకెంతో పుణ్యమైనది. దానికి పారశి అనే పర్యాయవదమున్నట్లు దోనయామాత్యుడు యతి 'పస్థానంలో వాడినందువల్ల తెలుస్తున్నది” అని ఆరుద్ర పేర్కొన్నారు. ఈ పదంపై జ్యోతివాసు వివరణ తర్వాత చూపుతాను. మేఘాల వర్ణనలో “కాటుక క్రోవులు” ఇంకా రైతులు వాడే “ఓదెలు, ఓరంత ప్రొద్దు, నులిపున్నమ, నారకొలదులు వంటి పదప్రయోగాలను ఆరుద్ర చూపాడు.

నిఘంటువులకెక్కని పదాలు సస్యానందంలో ఉన్నాయని ఉన్నం జ్యోతివాసు వివరించారు. “తొలుతటి వానలోదోయంబు లొగరైన, వట్టన యగునేన కొర్రచేలూ..లో వగరుగా, వజ్ఞగా పదాలలో వజ నివుంటువులలో లేదని (బౌణ్యం“కారము”గా న్వీకరించిందని చూపుతాడు. “తలివమ్ము ముతకనూలున"లో “తలివమ్ము” పదానికి పరుపు, శయ్య అర్భాలున్నాయి. కానీ ఇక్కడ కంబళి, దుప్పటి అర్థం వస్తుంది. “వెంగలియై సన్యకోటి పెంపడగించున్‌”లో వెంగలికి అవివేకి, జధుడు, మూఢుడు అని అర్భాలున్నాయి. కానీ ఇక్కడ కవి “వెనుకా అనే అర్ధంలో వాడారు. ఇదే పద్యంలో రెండవ పాదంలో ముంగలి పదం ఉంది. దానికి వ్యతిరేకంగా వెంగలి అని వాడారు. “ప్రతివద” పదాన్ని పాద్యమి అర్ధంలో ఇందులో వాడటం ఉంది. “ద్వాదశి"కి వికృతి రోదసి, బారసి పదాలున్నాయి. బారసి పదం ఇందులో ప్రయోగించాడు. అచ్చు ప్రతిలో పారశి అని ఉండటంతో ఆరుద్ర గారు కొత్తపదంగా అనుకొన్నారని అది “బారసి” అని ఉన్నం జ్యోతివాసు వివరించాడు.

వన్తువరంగాను, భాషావరంగాను దోనయామాత్యుడి సస్యానందం ఎంతో విలువైంది. సమకాలీన సందర్భంలోను ఇది నిలబడుతుంది. ఈ [గ్రంథంలో వర్షాల విషయంగా ప్రతిపాదించిన జ్యోతిషశాస్త్ర విషయాలు, అదే విధంగా వర్షాలపై లోకవ్యవహారంలో ఆ రోజులలో చేసిన ప్రయోగాలను నేటి ప్రస్తుత శాస్త్ర సాంకేతిక విజ్ఞానంతో మరింత అధ్యయనం చేసి అందులో (ప్రామాణిక అంశాలను నిరూపించి వెలుగులోకి తీసుకొనిరావాలి. అ

పదనిష్పాదనకళ

25 వ పుట తరువాయి.....

ఆవశ్యకత వారికి లేదు.

కానీ భవిష్యత్తులో అవే సబ్జెళ్టల్ని తెలుగులో చెప్పాల్సివస్తే మాత్రం తెలుగు పదాలు కావాలి. అర్ధం కావడం అనేది ఒక కాలాను గతమైన ప్రక్రియ. పుడుతూనే మనకు ఏదీ అర్ధం కాదు. అందటికీ అర్భం అవుతాయని చెబుతున్న ఇంగ్లీషు వదాలు కూడా శిక్షణాప్రక్రియలో నేర్చుకున్నవే. పుడుతూనే నేర్చుకున్నవి కావు. మన పదజాల పరిజ్ఞానం వయసుతో పాటు పెణుగుతూ పోతుంది. ఆ 'పెతీగే పదజాలంలో తెలుగు ఎందుకు ఉండకూడదు ? ఇంగ్లీషు పదాల వరిజ్ఞానాన్ని మాత్రమే ఎందుకు పెంచుకోవాలి ? మన వర్ధమాన పదజాలంలో తెలుక్కి ఎందుకు స్థానం ఉండకూడదు ?

కాబట్టి కొత్త తెలుగు పదాలు జనానికి అర్ధం కావనే వాదాన్ని మనం అంగీకరిస్తే దాని సారాంశం ఏమౌతుందంటే - 1 తెలుగులో ఏ శాస్త్రానికి సంబంధించీ, ఏ విధమైన సాంకేతిక పదజాలమూ ఉండకూడదు. డు, ము,వు.ల్లాంటివి మాత్రమే ఉందాలి. ఇంగ్లీషుని తెలుగులిపిలో వ్రాస్తే అదే తెలుగు.

2. ఉన్నా అది అందటికీ అర్థం కాకూడదు. (ఎందుకంటే వాళ్ళకు ఏది అర్ధం కావాలో ఏది కాకూడదో మనం ముందే నిర్ణయించేశాం. అంతకు మించి వాళ్ళకు ఇంకేమీ అర్థం కాకూడదు)

3. తెలుగులో సాంకేతిక పదజాలాన్ని ప్రచారం చేయకూడదు (ఎందుకంటే మేము ఇదివణకే ఒక విధమైన ఇంగ్లీషు పదజాలాన్ని ప్రచారం చేసేశాం. దానికి మీరు అడ్డం రావద్దు)

4. కాబట్టి తెలుగులో సాంకేతిక శాస్త్రాలేవీ వద్దు. అవన్నీ ఇంగ్లీషులోనే ఉండాలి.

5.ఆ విధంగా తెలుగులో సాంకేతికపదాలూ, సాంకేతిక పదాలూ లేకుండా చేస్తాం కనుక తెలుగు పొట్టపోసుకోవదానికి పనికి రాదు. పోనివ్వండి. మాకు ఇంగ్లీషుంది.

6. తెలుగు మనకు పొట్టపోసుకోవడానికి పనికిరాదు కనుక

మనం అసలు అది మాట్లాడొద్దు. నష్టమేముంది ?

తరువాయి- వచ్చే సంచికలో

మాతృభాషకాని భాషలో విద్యాభ్యాసం విద్యార్ది చదువుకు అడ్డంకిగా మారుతుంది - 'యునెస్కో