అమ్మనుడి/సంపుటి 5/ఫిబ్రవరి 2020/ప్రైవేటు రంగంలో కూడా మాతృభాషా మాధ్యమాన్ని అమలుచేయాలి!

ఉద్యమం

రమేష్‌ పట్నాయక్‌

9440980396

ప్రైవేటు రంగంలో కూడా మాతృభాషా మాధ్యమాన్ని అమలుచేయాలి!

గత మూడు నెలల కాలంలో పాఠశాలలలో బోధనా మాధ్యమంపై చాలా పరిణామాలు జరిగాయి. రాష్ట్రప్రభుత్వం మండల మరియు జిల్లా పరిషత్‌ యాజమాన్యాలలో మరియు నేరుగా రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న పాఠశాలలలో వచ్చే విద్యాసంవత్సరం నుండి మాతృభాషా మాధ్యమాన్ని వూర్తిగా తొలగిస్తూ ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ గత సంవత్సరం నవంబర్‌ 5వ తేదీన ప్రభుత్వ ఆదేశం 81ని అలాగే అనంతరం చిన్న సవరణతో దాని స్థానంలో జి.ఒ 85ని తీసుకురావడంతో రాష్ట్రంలో పెద్ద చర్చ ప్రారంభం అయింది. ఇప్పుడు జి.ఒ 85 కు వ్యతిరేకంగా ఉద్యమాలు కూడా నడుస్తున్నాయి. ఆంగ్ల మాధ్యమం విషయంలో జి.ఒ ఇవ్వడమే కాక ఒక చట్టాన్ని కూడా తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నించింది. అధికార పార్టీకి ఉన్న సంఖ్యాబలం వలన శాసన సభలో సంబంధిత బిల్లు ఆమోదం పొందినా వామపక్ష యం. ఎల్‌. సిలు మరియు ప్రతిపక్ష యం.యల్‌.సిలు అధికంగా ఉన్న శాసన మండలి బిల్లును వెనక్కి తిప్పి పంపింది. అయితే. శాసన మండలి సవరణలను తిరస్కరిస్తూ శాసన సభ మరల బిల్లును ఆమోదించింది. ఏదేమైనా బిల్లు ఇంకా చట్టం కాలేదు.

ప్రభుత్వ జిత్తులు

మరొకవైపు జిఒ 85కి వ్యతిరేకంగా రాష్ట్ర హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం నడుస్తున్నది. ఆంగ్ల మాధ్యమాన్ని బలవంతంగా రుద్దుతున్న జి.ఒ 85ని కోర్టు రద్దుచేయవచ్చనే ఆందోళన ప్రభుత్వానికి ఏర్పడింది. అందుకే ఆదరాబాదరాగా మాధ్యమాన్ని ఎంచుకునే అవకాశాన్ని తల్లిదండ్రులకు ఇస్తూ వారిని మాధ్యమాన్ని ఎంచుకోమని కోరుతూ జనవరి 21న తమ ఎంపికను ఒక దరఖాస్తు ద్వారా తెలియజేయాలని ప్రభుత్వం ఒక మెమో విడుదల చేసింది. అయిత్తే ప్రభుత్వం రూపొందించిన నమూనా దరఖాస్తు ఆంగ్ల మాధ్యమం వైపు ఒరిగి ఉంది. దరఖాస్తు నమూనా రూపొందించడంలో ప్రభుత్వం చూపిన జిత్తులమారి తనాన్ని ప్రక్కన పెడితే అసలు ఆవిధంగా బాలల తరపున మాధ్యమాన్ని నిర్ణయించే అధికారం ఇటు ప్రభుత్వానికి గాని అటు తల్లిదండ్రులకు గాని లేదు అనేది ప్రధాన విషయం. బాలల తరవున రాజ్యాంగమే ఈ విషయంలో నిర్ణయం తీసుకుంది. ఎలిమెంటరీ విద్యను మాతృభాషలో పొందడం బాలల హక్కు అని, అందించడం ప్రభుత్వ బాధ్యత అని రాజ్యాంగం 351 ఎ అధికరణం చెప్తున్నది. తల్లి మరియు తండ్రి వేరువేరు భాషలకు చెందిన వారైనప్పుడు వారిలో ఎవరి భాషను వారి బాలలకు మాతృభాషగా పరిగణించాలో నిర్ణయించే పరిమిత అవకాశం మాత్రమే రాజ్యాంగం బాలల తల్లిదండ్రులకు కల్పించింది. మాతృభాషను ప్రక్కన పెట్టి బాలలకు ఆంగ్ల మాధ్యమాన్ని ఎంపికచేసే అవకాశం రాజ్యాంగం తల్లిదండ్రులకు కల్పించలేదు. 2009లో వచ్చిన విద్యా హక్కు చట్టం కూడా రివ తరగతి వరకు బాలలకు మాతృభాషలోనే విద్య అందించాలని నిద్దేశిస్తున్నది. విద్యాహక్కు చట్టం కూడా బాలల తరపున మాధ్యమాన్ని ఎంవికచేసే అధికారం ప్రభుత్వానికి గాని లేదా అటువంటి అవకాశం తల్లిదండ్రులకుగాని ఇవ్వలేదు. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఇటు రాజ్యాంగాన్ని గాని అటు విద్యాహక్కు చట్టాన్నిగాని వట్టీంచుకోకుండా అంగ్ల మాధ్యమ విధానాన్ని బలవంతంగా అమలుచేయడానికి ప్రయత్నిస్తున్నది.

ఇక కోర్టు ముందున్న వ్యాజ్యం చాలా గందరగోళమైనది. ఈ వ్యాజ్యం మాతృభాషలో విద్యను పొందడం బాలల హక్కు అని దానిని ప్రభుత్వం అమలు చేయాలని కోరడం లేదు. బాలల తరపున మాధ్యమాన్ని నిర్దేశించే అవకాశం బాలల తల్లిదండ్రులకు ఉండాలని మాత్రమే జి.ఒ 85కి వ్యతిరేకంగా వ్యాజ్యం వేసినవారు కోర్టును కోరుతున్నారు. కోర్టు కేసును కొట్టివేస్తే జిఒ 85 అమలు అవుతుంది. కోర్టు జిఒ 85ను కొట్టివేసినా బాలల తరవున మాధ్యమాన్ని నిర్ణయించే అవకాశం తల్లిదండ్రులకు బదలాయించడానికి (ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రెండు సందర్భాలలో కూడా అది రాజ్యాంగానిక్కి విద్యాహక్కు చట్టానికి వ్యతిరేకంగానే ఉంటుంది. కోర్టు సహజంగా వ్యాజ్యం పరిమితులలోనే తీర్పు ఇస్తుంది. ఈ తీర్పులో కోర్టు మహా అయితే జి.ఒ 85ను రద్దుచేస్తుంది కాని విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయమని నిర్దేశించదు. ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న బాలల తల్లిదండ్రులు అత్యధిక సంఖ్యలో ఆంగ్ల మాధ్యమాన్నే కోరుకుంటారనడంలో సందేహం లేదు. హైకోర్టు సదరు జి.ఒ ని కొట్టివేసినా తల్లిదండ్రుల ఎంపికపై ఆధారపడి మాధ్యమ విషయాన్ని పాఠశాలల వారిగా ప్రభుత్వం అమలు చేయగలదు. ప్రభుత్వం తీసుకు వచ్చిన బిల్లు చట్టం అయినా కాకపోయినా, ప్రభుత్వం ఇచ్చిన జి.ఒ కొట్టి వేయబడినా ప్రభుత్వ విధానం అమలు జరిగే దురదృష్ట పరిస్థితి ఉంది. ప్రభుత్వ మరియు (ప్రైవేటు పాఠశాలలలో విద్యాహక్కు చట్టం ప్రకారం మాతృభాషా మాధ్యమాన్ని అమలుచేయమని ఇంతవరకు కోర్టులో ఏ వ్యాజ్యం దాఖలు కాలేదు.

అత్యధిక ప్రజలు ఆంగ్ల మాధ్యమాన్ని కోరుకోవడమే అసలు సమన్య, ప్రజలను ఆ విధంగా తయారు చేయడంలో ప్రైవేటు యాజమాన్యాలు మరియు అధికార పార్టీలు విజయవంతమైనాయి. కార్పోరేటు సంస్థలు ఆంగ్ల మాధ్యమాన్ని ఒక అదనపు ఆకర్షణగా మధ్యతరగతి ముందు పెడితే అధికార పార్టీలు ఆంగ్ల మాధ్యమాన్ని బడుగు బలహీన వర్గాల ఓటర్లకు ఎరవేయడానికి ఉపయోగిస్తున్నాయి. గుర్తించవలసిన విషయం ఏమంటే, ప్రైవేటు పాఠశాలలలో ఆంగ్ల మాధ్యమం ఉన్నన్నాళ్ళు ప్రభుత్వ పాఠశాలలపై ఆంగ్ల మాధ్యమ కత్తి వేలాడుతూనే ఉంటుంది. మధ్య తరగతి ఏది నాగరికత అంటుందో దానినే బడుగు మరియు బలహీన వర్గాలవారు నాగరికతగా భావిస్తారు. మాధ్యమం విషయంలో మధ్యతరగతి అవగాహన మారనిదే బడుగు, బలహీన వర్గాల అవగాహన మారదు. అవగాహనా రాహిత్యం వలన ప్రజలు, దురుద్దేశాలతో పాలక శక్తులు ఒకే వైపు నిలబడిన దురదృష్టకర సందర్భం ఇదని ముందుగానే చెప్పుకున్నాం.

ఆంగ్ల మాధ్యమానికి అనుకూలంగా చేయబడుతున్న వాదనలన్నింటినీ నేను ఇక్కడ పేర్కొనడం లేదు. ఒక్క విషయం మాత్రం ప్రస్తావిస్తాను. ఉన్నత విద్యలకు, ఉద్యోగాలకు ఆంగ్లం అవసరమేకదా అనే వాదన ఉంది. ఇది కొంతవరకు సహేతుకమైనదే. అయితే ఆంగ్ల మాధ్యమానికి మరియు ఆంగ్లం నేర్చుకోవడానికి ఎటువంటి సంబంధం లేదు. ప్రైవేటు రంగంలో లేదా ప్రభుత్వం రంగంలో బాలలకు ఆంగ్లాన్ని నేర్పడానికి ఆంగ్లాన్ని ఒక పాఠ్య విషయంగా బోధిస్తే చాలు. ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే, ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలన్నింటిలో ఒకటవ తరగతి నుంచి ఆంగ్లం ఒక పాఠ్య విషయంగా ఉంది. కాని ప్రత్యేక అర్హతలు మరియు శిక్షణ కలిగిన ఉపాధ్యాయులు ఎక్కడా లేరు. అందుకే రాష్ట్రంలో బాలలకు వారు ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాలలో ఏ పాఠశాలలో చదివినా ఆంగ్లభాష రావడం లేదు. ప్రభుత్వ పాఠశాలలలో విద్యాహక్కు చట్టానికి అదనంగా ఆంగ్లభాషా బోధనకు ఒక ఉపాధ్యాయ పోస్టు ఇవ్వాలన్న విద్యారంగ ఉద్యమాల సూచనను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నిజానికి బాలలకు ఆంగ్లం నేర్చాలనే పట్టుదల ప్రభుత్వానికి ఉందని విశ్వసించడం కష్టం.

2019లో కస్తూరి రంగన్‌ కమిటీ ఇచ్చిన విద్యా నివేదికలో (జాతీయ విద్యావిధానం 2019 ముసాయిదా) ఎనిమిదవ తరగతి వరకు అన్ని యాజమాన్యాల పాఠశాలలలో మాతృభాషా మాధ్యమాన్ని అమలు చేయమని సిఫారసు చేసింది. అంతేకాదు 12వ తరగతి వరకు కూడా మాతృభాషా మాధ్యమాన్నే అమలు చేయాలని, అయితే విజ్ఞాన శాస్త్రాలలో సాంకేతిక పదాలను సమాంతరంగా ఆంగ్లంలో కూడా 9వ తరగతి నుంచి పరిచయం చేయాలని, ఉన్నత విద్యలకు వెళ్ళినప్పుడు ఆంగ్ల మాధ్యమంలోనికి వెళ్ళవలసి వస్తే విద్యార్థికి ఎటువంటి ఇబ్బంది ఉండదని వివరించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నివేదిక ఆధారంగా ఫైవేటు పాఠశాలలో కూడా మాతృభాషా మాధ్యమాన్ని అమలు చేయవచ్చు. ఇక ఉద్యోగావకాశాలకు వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వగలిగే లక్షలాది ఉద్యోగాలకు, కల్పించగలిగే పదుల లక్షల ఉపాధులకు ఆంగ్లంతో నంబంధం లేదు. ఎ.పి.యస్‌.ఇ.బి మరియు ఎ.పి.యస్.ఆర్‌.టి.సి వంటి సంస్థలలో ఉద్యోగాలకు, అత్యధిక ప్రభుత్వ పాఠశాలలలో ఉద్యోగాలకు, పోలీసు శాఖలో ఉద్యోగాలకు ఆంగ్లంతో పనిలేదు. బ్యాంకు ఉద్యోగాలకు కూడా మాతృభాషా మాధ్యమంలో చదువు సరిపోవడమే కాదు అవసరం కూడా. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా తెలుగులో పోటీ పరీక్షలు వ్రాయవచ్చు. ఇక మిగిలినవి ఐ.ఐ.టిలు మరియు అమెరికా ఉద్యోగాలు. ఐ.ఐ.టిలలో సంవత్సరానికి 10 వేల సీట్లు ఉంటాయి. ప్రస్తుతానికి రాష్ట్రాలవారిగా కోటా లేదు కాబట్టి ఉభయ తెలుగు రాష్ట్రాలకు కలిపి సుమారు రెండువేల సీట్లు వస్తున్నాయి. కోటాలు విధిస్తే తెలుగు రాష్ట్రాలకు వచ్చేవి గరిష్టంగా వెయ్యి సీట్లు మాత్రమే. అమెరికా ఉద్యోగాలకు కావలసింది ఆరు మాసాల ఆంగ్ల వాక్చాతుర్య శిక్షణ మాత్రమే. అమెరికా లేదా పాశ్చాత్య దేశాలకు వెళ్ళవలసిన వారు అప్పటికే యల్‌ కెజి నుండి ఇంజనీరింగు వరకు సుమారు ఇరవై సంవత్సరాలు ఆంగ్ల మాధ్యమంలో చదివినా జి.ఆర్‌.ఇ కి ఆరు మాసాలు శిక్షణ తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఉన్నత విద్యలకు మరియు రాష్ట్రం బయట లేదా దేశం బయట ఉద్యోగాలకు పాఠశాలలో ఆంగ్ల మాధ్యమానికి ఎటువంటి సంబంధం ఉన్నట్లు కనిపించదు. ఆంగ్లాన్ని ఒక పాఠ్యాంశంగా నేర్చుకోవడం మాత్రం ఎంతైనా అవసరం. వ్యవహారిక భాషకే కాక ఆంగ్ల సాహిత్యంతో పరిచయం పెంచుకుంటే ఇంకా గొప్ప విషయం.

మన సమస్య తెలుగు భాషను రక్షించే విషయం మాత్రమే కాదు. అంతకన్నా ప్రధానంగా ఇది బాలలకు మాతృభాషలో చదువుకునే హక్కును, కష్టపడి కాకుండా ఇష్టపడి, సంతోషంగా, ఉత్సాహంగా, సృజనాత్మకంగా విద్యా విజ్ఞానాలను పొందే హక్కుకు సంబంధించిన విషయం. ఆంగ్ల మాధ్యమం విద్యార్థిని కుటుంబం నుండి సమాజం నుండి మాత్రమే కాదు తననుండి తనను కూడా పరాయీకరణ చేన్తుంది. ప్రైవేటు పాఠశాలలలో విద్యార్థుల ఆత్మహత్యలు ఈ పరాయీకరణకు పరాకాష్ట కాక మరేమిటి? మాతృభాషా మాధ్యమం గురించి ఇప్పుడు ఏ వాదనా క్రొత్తగా పెట్టవలనిన అవసరం లేదు. కొఠారీ కమీషన్‌ మాతృభాషా మాధ్యమాన్నే సిఫారసు చేసింది. 1968 జాతీయ విద్యావిధానం, 1986 జాతీయ విద్యావిధానం, ప్రస్తుత ముసాయిదా విద్యావిధానం మాతృభాషా మాధ్యమాన్నే సిఫారసు చేసాయి. భారత రాజ్యాంగం అధికరణం 351(ఎ)లో మాతృభాషలో బోధన ప్రభుత్వాల విధి అని విద్యార్థుల హక్కు అని పేర్కొనబడింది. యునెస్కో మాతృభాషా మాధ్యమాన్నే గట్టిగా సిఫారసు చేసింది. మాతృభాషా మాధ్యమాన్ని అమలు చేసిన దేశాలే - విద్యారంగంలో అలాగే ఆర్థిక రంగంలో అభివృద్ధి చెందుతున్నాయని నివేదికలు చెప్తున్నాయి.

ప్రైవేటులో ఆంగ్ల మాధ్యమం ప్రభుత్వ రంగంలో మాతృభాషా మాధ్యమం ఒక వైరుధ్యం, ఇది దీర్ధకాలం కొనసాగడం సాధ్యం కాదు. ప్రభుత్వరంగంలో కూడా ఆంగ్ల మాధ్యమం అమలు కౌరకు రాష్ట్ర ప్రభుత్వం దాడిపూరితంగా వ్యవహరిస్తున్నది. ప్రజాతంత్ర ఉద్యమం రెండు రంగాలలో మాతృభాషా మాధ్యమం కౌరకు పోరాడాలి. మధ్యేయ మార్గం లేని స్థితికి పరిస్థితి చేరుకుంది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలు అనుసరించిన విధానాలను పరిశీలిద్దాం. పది సంవత్సరాల క్రితం ప్రైవేటు పాఠశాలలో మొత్తం ఆంగ్ల మాధ్యమం ఉండింది మరియు ప్రభుత్వ పాఠశాలలో మొత్తం మాతృభాషా మాధ్యమం ఉండింది. ఆనాడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం

ముందు రెండు మార్గాలు ఉండినాయి. ప్రైవేటు పాఠశాలలో కూడా మాతృభాషా మాధ్యమాన్ని అమలు చేసి ఒక శాస్త్రీయ విధానానికి


ఆం(ధ్రప్రదేళ్‌ హైకోర్టు వ్యాఖ్య

“ఇంగ్లీష్‌ మీడియం” లో నిర్చంధించలేం

అమరావతి, జనవరి 7(ఆంధ్రజ్యోతి): ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకూ నిర్భంధంగా ఇంగ్లీష్‌ మీడియాన్ని అమలు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అమలుపై హైకోర్టు తీవ వ్యాఖ్యలు చేసింది. ఇంగ్లీష్‌ మీడియంలోనే చదువుకోవాలని విద్యార్థులను నిర్చంధించలేమని, అలా చేయడమంటే సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్దంగా వ్యవహరించడమేనని స్పష్టం చేసింది. ఇంగ్లీష్‌ మీడియం అమలుకోసం పాఠ్యపుస్తకాల ముద్రణ, శిక్షణా తరగతుల నిర్వహణకు పాల్పడే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ వ్యవహారంలో అధికారులు ముందడుగు వేస్తే...ఆ ఖర్చును వారి నుంచే రాబడతామని పునరుద్దాటించింది. అవసరమైతే ఏసీబీ, సిబీఐ విచారణకు ఆదేశించి డబ్బును వెనక్కి రప్పిస్తామని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని పాఠశాల విద్యాశాఖ, సర్వశిక్షా అభియాన్‌లను. ఆదేశించింది. కౌంటర్‌ దాఖలు చేయనీ పక్షంలో పాఠశాల విద్వాశాఖ ముఖ్యకార్యదర్శి స్వయంగా హాజరు కావాలని పేర్కొంది. అంతేగాక ఇచ్చిన గడువులోగా కౌంటర్‌ దాఖలు చేయలేకపోతే ఇంగ్లిష్‌ మీడియం అమలుపై సే ఉత్తర్వులు ఇచ్చేందుకూ వెనుకాడబోమని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 4కు వాయిదా వేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ ఎస్‌. జయసూర్యల ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే విద్వా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 6 వ తరగతి వరకు ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవాల్‌ చేస్తూ తూర్పుగోదావరి జిల్లాకు వెందిన రాంభొట్ల శ్రీనివాస్‌ సుధీష్ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గుంటుపల్లి శ్రీనివాస్‌ వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై సోమవారం మరోమారు ధర్మాసనం ముందు విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌. శ్రీరాం వాదనలు వినిపిస్తూ, విద్యార్థులు మాతృభాషలో చదువుకునేందుకు తాము అద్దు చెప్పడం లేదని, ఈ వ్యవహారంపై వివరణ ఇచ్చేందుకు పది రోజుల సమయం కావాలని అభ్యర్థించారు. కేంద్ర ప్రభుత్వం తరపున సహాయ సొలిసిటర్‌ జనరల్‌ కృష్ణమోహన్‌ వాదనలు వినీపిస్తూ... విద్యాహక్కు చట్ట ప్రకారం కనీసం 8వ తరగతి వరకు మాతృభాషలోనే విద్వాబోధన ఉండాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దీంతో ధర్మాసనం స్పందిస్తూ... ఇంగ్లీషు మీడియుంలోనే విద్యాఖ్యానం ఉండాలని విద్యార్థులను బలవంతపెట్టలేమని పేర్కొంది. పిటిషనర్‌ శ్రీనివాస్‌ తరపు న్యాయవాది జోక్యం చేసుకుంటూ...ఇంగ్లీష్‌ మీడియం అమలు దిశగా ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తూనే ఉందని, అధికారులు వివిధ రకాల సమావేశాలు నిర్వహిస్తున్నారని వివరించారు. దీంతో ధర్మాసనం అధికారులపై తీవ్రంగా స్పందించింది.


బాటలు వేయడం ఒక మార్గం కాగా ప్రభుత్వ రంగంలో కూడా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టి సర్వ వినాశనానికి దారులు వేయడం రెండవ మార్గం. రాజశేఖర్‌ రెడ్డి ప్రభుత్వం రెండవ మార్గాన్నే అనుసరించింది. 2008లో ప్రైవేటు తోక పుచ్చుకుని ప్రభుత్వరంగ ఉన్నత పాఠశాలలలో ఆంగ్ల మాధ్యమాన్ని సమాంతరంగా ప్రవేశ పెట్టింది. ఇదే ఒరవడిని కొనసాగించిన చంద్రబాబునాయుడు ప్రభుత్వం (2014-2019) సుమారు ఇరవై అయిదు శాతం ప్రభుత్వ రంగ ప్రాథమిక పాఠశాలలలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టింది. ఒక్కమాటలో చెప్పాలంటే రాజశేఖర్‌ రెడ్డి మరియు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాలు రెండూ ప్రభుత్వ పాఠశాలలలో అంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టాయి. అయితే, తెలుగు మాధ్యమాన్ని కనీసం సమాంతరంగా కొనసాగించాయి. ఇప్పటి జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుచ్వం ప్రభుత్వరంగ పాఠశాలలలో మాతృభాషా మాధ్య మాన్ని మొత్తం నిషేధించింది. అందుకే చర్చ ఇంత తీవ్రంగా జరుగుతున్నది. మాతృభాషా మాధ్యమమే విద్యావ్యాసంగానికి మంచిదని, ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాలలో కూడా మాతృభాషా మాధ్యమాన్ని అమలుచేయాలనే సలహా ప్రభుత్వానికి రుచించక పోవచ్చు. కార్బోరేటు ఒంటికి అసలు పడదు. అయితే ప్రైవేటు పాఠశాలలను ప్రక్మన పెట్టి మాతృభాషా మాధ్యమం గురించి మాట్లా డడం ఎంతవరకు సమంజసం? ప్రైవేటులో అంగ్ల మాధ్యమం ఉండగా ప్రభుత్వరంగంలో మాతృభాషా మాధ్యమం నిలదొక్కుకోవడం కష్టం. ప్రభుత్వమే తన బాధ్యతను గ్రహించి ప్రైవేటు పాఠశాలలతో సహా అన్ని పాఠశాలలలో తప్పనినరిగా మాతృభాషా మాధ్యమాన్ని అమలుచేయడం న్యాయమైనది, రాజ్యాంగబద్ధమైనది మరియు శాస్త్రీయమైన పద్ధతి అవుతుంది. అందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదు కాబట్టి, ఓటు రాజకీయాలనే కొనసాగిస్తోంది కాబట్టి ప్రజా ఉద్యమమే పరిష్కారం అవుతుంది.

రచయిత - ఆంధ్రప్రదేశ్‌ విద్యాపరిరక్షణ కమిటీ కన్వీనర్‌,

అఖీలభారత విద్యాహక్కు వేదిక అధ్యక్ష వర్ణ సభ్యులు


అమ్మనుడుల పండుగ ఫిబ్రవరి 21

ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు 9866128846

స్థానిక భాషలే అభివృద్ధికి, శాంతిభద్రతలకూ సయోధ్యకూ మూలం

2020 సంవత్సరంలో, ఐరాస, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ సందర్భంగా "స్థానిక భాషలే అభివృద్ధికీ, శాంతిభద్రతలకూ సయోధ్యకూ మూలం” అనే ఏకవాక్యాన్ని ప్రధానాంశంగా స్వీకరించింది.

1952 ఫిబ్రవరి 21 న అప్పటి అవిభక్త పాకిస్థాన్‌ తూర్పు పాకిస్తాన్లో అమలు చేస్తున్న ఉర్లూ ఆధిపత్యానికి నిరసనగా బెంగాలీలు చేపట్టిన మాతృభాషోద్యమ పోరాటంలో పాకిస్తాన్‌ జరిపిన హత్యా కాండలో ప్రాణాలు కోల్పోయినవారి స్మృతికి గుర్తింపుగా ప్రతియేటా ఫిబ్రవరి 21న ప్రపంచ దేశాలు అన్నీ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకోవాలని 1999లో ఐరాస సూచించింది. 2000 సంవత్సరంలో మొదలై ఇప్పటివరకూ 20 మాతృభాషా దినోత్సవాలను జరుపుకున్నాం. వీటన్నిటికీ మూలం మాతృభాషలో ప్రాథమిక విద్య, తెలిసిన భాషలో చదువు, భాషావైవిధ్యం - మానవ మనుగడకు అనివార్యం అనే విషయాలే.

ఐరాస భాషా వైవిధ్యం పట్ల తన నిబద్ధతను పునరుద్దాటిస్తూ, స్థిరమైన అభివృద్ధికి భాషా వైవిధ్యమూ పలుభాషల వాడకమూ అవసరమని గుర్తుచేసే విధంగా ప్రతి యేటా ఫిబ్రవరి 21 న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని వీలైనన్ని భాషలలో జరుపుకోవాలని సభ్య దేశాలను కోరుతోంది.

“యునెస్కో " డైరెక్టర్‌ జనరల్‌ ఆడ్రీ అజౌలే అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ సందేశంలో ఇలా అన్నారు:

భాష ప్రసార సాధనం మాత్రమే కాదు, ఇది మనలో మిగిలిన మానవతా విలువలకూ, నమ్మకాలకూ ఇంకా మన ఉనికికి గుర్తింవు నిచ్చే వ్యవస్థ. భాష ద్వారానే మనం మన అనుభవాలను పంచు కుంటాం, అనూచానంగా వస్తున్న నంప్రదాయాలను కింది తరాలకు అందిస్తాం, వేల యేండ్రగా సంపాదించిన జ్ఞానాన్ని యువతరానికి ప్రసారం చేస్తాం. భాషావైవిధ్యం విశ్చవ్వాస్తంగా ఉన్న మానవ జీవన శైలిలో ఉన్న అమిత వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తోంది.

విద్యలో మాతృభాషకు ప్రాముఖ్యత:

ప్రస్తుతం, ప్రపంచీకరణ పేరుతో రోజురోజుకూ కనుమరుగవుకున్న భాషలు ఎక్కువ అవుతున్నందున భాషా వైవిధ్యానికి ఎక్కువగా ముప్పు ఫొంచి ఉంది. ప్రపంచవ్యాప్తంగా జనాభాలో 43 శాతం మందికి వారి మాతృభాష లేదా వారు అర్థం చేసుకునే స్థానిక భాషలో విద్యను పొందలేకపోతున్నారు. కారణం, భాషలపట్ల అవగాహన కొరవడినవారి చేత అమలుచేస్తున్న భాషా ప్రణాళికలే. ఏదేమైనా, మాతృభాష ఆధారిత బహుభాషా విద్యలో దాని 'ప్రాముఖ్యతపై పెరుగుతున్న అవగాహనతో, ముఖ్యంగా ప్రారంభ పాఠశాల విద్యలో, ప్రజా జీవితంలో మాతృభాష అభివృద్దికి మరింత నిబద్దతతో పురోగతి సాధించాలి.

2020 సంవత్సరంలో, ఐరాస అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ ప్రధానాంశంగా “స్థానిక భాషలే అభివృద్ధికీ, శాంతిభద్రతలకూ సయోధ్యకూ మూలం” అని ప్రకటించి ప్రచారం మొదలెట్టింది. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ ముఖ్యోద్దేశం, ప్రతి దేశం, ఆ దేశంలోని “మాతృభాషలను పరిరక్షించడం, అన్ని అల్పసంఖ్యాక వర్ణాలవారి భాషలకూ రక్షణ కల్పించడం.

ఇందులో భాగంగానే “మాతృభాషలలో విద్య మానవ జీవితాలను మార్చివేస్తుంది” అనే విషయమే ఐరాసవారి ప్రధాన ఆశయ సాధనంగా ఉంది. ఐరాసవారి వ్యూహంలో, ఇది పేదరికాన్ని పారద్రొలి బతుకుబాటను అభివృద్ధి దిశగా నడిపించే సాధనంగా ఉంటుందనేది నిర్వివాదాంశం. ఇదే విషయాన్ని విద్య ౭030 విధానచర్య.

మాతృభాష ద్వారా విద్య సృజనాత్మకతను 'పెంపొందిస్తుంది సమాజంలో అసమాన ఆర్ధిక అస్థిరతతో దెబ్బతిని అనూహ్య మార్పులకు లోనైన జాతులకు, భాషా వారసత్వ గుర్తింపు సమైక్యతకు ఆధారంగా ఉంటుంది. దీనిద్వారా వచ్చిన సృజనాత్మకతే సంఘటిత, సమగ్ర బహుళ సమాజాలను నిర్మించడానికి దోహదం చేస్తుంది. వారసత్వం మరియు సృజనాత్మకత రెండూ శక్తిమంతమైన, వినూత్న సంపన్న జ్ఞాన సమాజాలకు పునాదులు వేస్తాయి.

బలమైన సాంస్కృతిక భాగస్వామ్యం లేకుండా ఎటువంటి అభివృద్ధీ స్థిరంగా ఉండదని ఐరాస నమ్ముతోంది. వివిధ జాతుల సంస్కృతుల మథ్య పరస్పర గౌరవం ఇచ్చిపుచ్చుకొనే ధోరణితో సాగే చర్చల ఆధారంగా జరిగే అభివృద్ధికి మానవీయ కోణంతో సాగే విధానం మాత్రమే శాశ్వత, సమగ్ర సమాన ఫలితాలకు దారి తీస్తుంది. ఐతే, ఇప్పటి వరకూ, అఖివృద్ధి ప్రణాళికలలో సంస్కృతికి తగినంత ప్రాధాన్యం లభించలేదు. కారణం, మాతృభాషల ప్రాధాన్యం గత కొద్ది కాలంగా తగ్గుతూ రావడమే. మాతృభాషలే సంస్కృతికి 'సేతువులు.

మీరు అర్థంకాని భాషలో ఎలా నేర్చుకొంటారు?

ఇంట్లో మాట్లాడే భాషలోనే నాణ్యమైన విద్యను అందించాలి. అయితే, ప్రస్తుత ప్రపంచంలో కోట్లాదిమంది ఈ కనీస అవకాశాన్ని పొందలేకపోతున్నారు. ఐతే ఇలా పరభాష ద్వారా సాగే చదువు