అమ్మనుడి/సంపుటి 5/జూన్ 2019/తెలుగు జానపదభాష ప్రభావాలు, పరిణామాలు

భాష- పరిణామం

ఆచార్య పులికొండ సుబ్బాచారి 9440493604

తెలుగు జానపదభాష

ప్రభావాలు, పరిణామాలు

“సాహిత్యంలో పరిణామాలు త్వరగా వస్తాయి కాని భాషలో పరిణామాలు చాలా ఆలస్యంగా వస్తాయి. అంటే భాషలో మార్పులు రావడానికి చాలా కాలం పడుకుంది సాహిత్యంలో వచ్చినంత త్వరగా రావు అని ఒకప్పుడు భాషావేత్తలు చెప్పేవారు. కాని నేటి పరిస్థితులు అలా లేవు. భాషలో పరిణామాలు కూడా చాలా వేగంగా వస్తున్నాయి అని చెప్పవలసిన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జానపద భాషలో నేటి కాలంలో వస్తున్న పరిణామాలు ఎలా ఉన్నాయి. వాటికి కారణాలు ఏమిటి అని ఇక్కడ పరిశీలించే ప్రయత్నం చేస్తున్నాను.

జానపద భాష ఏది అనేది చాలా పెద్ద ప్రశ్న దీన్ని తేల్చడం అంత తేలిక కాదు. ఎందుకంటే జానపదులు ఎవరు అని తేలిస్తే కాని జానపద భాష ఏది తేల్చి చెప్పడం కుదరదు. జానపదులు ఎవరు అనే దానిపైన చాలా పెద్ద సిద్దాంత చర్చ జరిగింది. అటువైపు వెళితే సమయం అంతా అక్కడే సరిపోతుంది, అక్కడికి వెళ్ళడం లేదు. కానీ చాలా క్లుష్తంగా ఇక్కడ నాలుగు మాటలు చెబితే కాని ముందుకు నడవడం కుదరదు. తెలుగులో ఈ పని తొలిసారిగా ఆచార్య రామరాజుగారు చేసారు. మౌఖికంగా లఖించే సాహిత్యాన్ని ఏమనాలి అనే సందర్భంగా చాలా విస్తృతమైన చర్చే చేసి అప్పటికి వేరు వేరు పండితులు వాడే చేరు వేరు పదాలన్నింటిని పరిశీలించి జానపద సాహిత్యం అనాలి అదే అన్నింటికన్నా సరైన పారిభాషిక పదం అని తేల్చారు. దాన్ని నేనూ అంగీకరిస్తాను. ఇక ఎవరు జానపదులు అని చెప్పడానికి కేవలం పల్లెల్లో ఉండే వారే జానపదులు అని అనడం కుదరదు నగరంలో ఉండే వారిలో కూడా జానపదులు ఉందవచ్చు అని చెప్పారు. అలాగే పల్లెలో కూడా పండితుడు ఉండవచ్చు నన్నారు. మరి జానపదులు అని ఎవరిని చెప్పాలంటే జానపద మనస్తత్త్వం ఉన్న వారినే జానపదులు అనాలి అని చెప్పారు. దీనిపైన కూడా ఇంకా పెద్ద చర్చ జరగడానికి వీలుంది. జానపద మనస్తత్త్వం అంటే ఏది అని చెప్పాలంటే తిరిగి పెద్ద చర్చే జరగాలి.

మన వద్ద సంగతి ఇలా ఉండగా పాశ్చాత్యులలో కూడా Who are folk అనే విషయంలో పెద్ద చర్చే జరిగింది. చివరికి అలన్‌ డండెస్‌ చేసిన నిర్వచనాన్ని అన్నీ దేశాలలో అంగీకరిస్తున్నారు. చాలా క్లుప్తంగా దాన్ని ఇక్కడ చెబితే “కొన్ని సామాన్య లక్షణాలుండి తమదైన సంస్కృతి సంప్రదాయాలు తాము కలిగి ఉండి దీర్హ కాలంగా ఉన్న ఏ సామాజిక సమూహాన్నైనా జానపదులు అనినీ అనవచ్చు” అని చెప్పారు. దీని ప్రకారం సంప్రదాయ సామాజిక సమూహాలు జానపదులు అవుతాయి. తాత్మాలిక అవసరాలకోసం ఒక చోట చేరిన ఏర్పడిన సామాజిక సమూహాలు జానపదులు అనే నిర్వచనం కిందికి రారు. ఈ నిర్వచనం ప్రకారం ఎవరు జానపదులు కారు? అనే పెద్ద ప్రశ్న ఉదయించింది. తర్వాత తర్వాత దీనికి కొన్ని పరి మితులు ఏర్పరచారు తర్వాతి శాస్త్రజ్ఞులు. కాగా ఇప్పుడు జానపదులు ఎవరు అనే చర్చ ఎక్కడా జరగడం లేదు. అది గతార్ధం అయింది. పై నిర్వచనాన్నే అత్యధికులు అన్ని దేశాలలో పాటిస్తున్నారు.

ఇక జానపద భాష అనగానే ఇప్పటిదాకా తెలుగులో మనకు అవగాహన ఉన్నదాని ప్రకారం గ్రామీణ జీవితం గడిపే వారు, వివిథ వృత్తులలో ఉన్నవారు, విద్యావంతులు లేదా అధిక విద్యావంతులు కాని వారు అనే భావన ఉన్నది. తెలుగులో జునపద సాహిత్య పరిశోధన చేసినవారు ఇలాంటి సామాజిక సమూహాలనుండే సాహిత్యాన్ని సేకరించారు. దీనికి ఒక ప్రమాణంగా గ్రహించిందే మంటే, మౌఖిక సాహిత్యాన్ని సృజించే వారు జానపదులు అనే ఒక ప్రమాణరేఖ ఉంది. సేకరించి పరిశోధించిన సాహిత్యమంతా ఇలాంటి మౌఖిక సాహిత్యమే. దీన్నే జానపద సాహిత్యంగా నేటికీ అంగీకరించి పరి శోధనలు సాగుతున్నాయి.

లిఖిత సాహిత్య పరిచయం లేనివారు అలాంటి చదువులు చదువుకోని వారు జానపదులు అనే ఒక ప్రమాణ రేఖ కూడా ఉంది. ఇక్కడ విద్య అనేదానికి నేను విస్తృతమైన అర్థంలో గ్రహిస్తాను. జానపద శాస్త్రంలో నిరక్షరాస్యులు ॥18/218 అనే పదాన్ని అంగీకరించరు. వారు ౧0౦౧-1648 అనే అభివ్యక్తిని వినియోగిస్తారు. దాని అర్థం ఏమంటే ఒక భాష మాట్లాడేవారు ఎవరూ నిరక్షరాస్యులు కారు. అక్షరాలు రాయడం తెలియని వారు ఉండవచ్చు కాని అక్షరాలు తెలియనివారు ఉండరు అని దీని అర్ధం. అంటే జానపద శాస్త్రం ప్రకారం ఒక భాష మాట్లాడే వారు అందరూ అక్షరాస్యులే అని అర్థం. అక్షరాలు రాయడం అంటే లిపి తెలియనివారు అనే అర్థంలోనే వారినీ చూచి నాన్‌ లిటరేట్స్‌ అనే పదాన్ని వారికి వినియోగిస్తారు. ఇక విద్య అంటే ఇక్కడ ఉన్న అవగాహన కూడా వేరే. కేవలం తరగతులు డిగ్రీలు పొందేదే విద్య అనే భావన ఉంది. కానీ ప్రతి పని ఒక విద్య అని ప్రతి జీవన విధానం ఒక విద్య అని జానపద శాస్త్రం భావిస్తుంది. ప్రతి చేతి వృత్తి దాన్ని నేర్చుకోవడం దాన్ని చేయడం ఒక విద్యే. వ్యవసాయం ఒక విద్య వడ్రంగం ఒక విద్య. వంట గృహనిర్వహణ ఇలా అన్ని రకాల పనులు జీవన విధానాలు కూడా విద్యలే. దీన్ని సాంతిళ శ్యాస్తాలు దాదావు అన్నీ అంగీకరిస్తాయి. కాగా మామూలు అవగాహనలో ఉన్న విద్యని దృష్టిలో ఉంచుకాని జానపదులను విద్యలేని వారు అని చెప్పడం కుదరదు. బెపచారికమైన తరగతులు చదవనీవారు అని చెప్పవచ్చు.

గుండె లోతుల్లోంచి వచ్చెదీ, మనసు విప్పి చెప్పగలిగేదీ 'అమ్మనుడిలోనే

ఇక నేటి దాకా జరిగిన పరిశోధనలను పరిశీలిస్తే జానపద భాషని గురించి చాలామంది జానపద విద్వాంసులు తమ పరిశోధన గ్రంథాలలో చెప్పారు. రామరాజు గారు జానపద భాషలోని విశేషాంశాలను చెప్పారు. నాయని కృష్ణకుమారిగారు తర్వాత రఘుమారెడ్డిగారు కూడా జానపద భాషని వర్ణించి విశేషాంశాలను చెప్పారు. ఆ తర్వాత కూడా మరికొందరు జానపద భాషని గురించి రాశారు కాని ఇక్కడ వారు చేసిన భాషాపరిశీలన అంతా కూడా వారు సేకరించిన జానపద సాహిత్యాన్ని గేయాలను ఆధారంగా చేసుకొని చేసిన పరిశీలనమే. మామూలుగా మాట్లాడిన భాషను వివిధ సందర్భాలలో సేకరించి చేసిన పరిశీలన కాదు ఇది. అంటే వారు సేకరించిన మౌఖిక సాహిత్యంలోని భాషకు జానపదులు నిత్య జీవనంలో మాట్లాడే భాషకు తేడా ఉంటుందా అని పరిశీలిస్తే వారు మాట్లాడే భాషలోనే సాహిత్యాన్ని సృష్టించి ఉండవచ్చు. కాని అది మాత్రమే జానపద భాష కాదు అది ఒక భాగం మాత్రమే అవుతుంది. కాని దైనందిన జీవితంలో ప్రతిరోజూ మాట్లాడే విస్తృత పదసంచయం, భాష మౌఖిక సాహిత్యం కన్నా విస్తృతంగా ఉంటుంది. దీన్ని కూడా సేకరించి ఆ భాషని విశ్లేషించే ప్రయత్నం తర్వాత జరిగింది.

భద్రిరాజు కృష్ణమూర్తిగారు ఈ పనిచేశారు. వీరు మాండలిక భాషని విశ్లేషించి తెలుగు మాండలిక భాషలు ఎన్ని ఉన్నాయి వాటి లక్షణాలు ఏమిటి వ్యాకరణం ఏమిటి అనే చర్చ చేశారు. వారు సంపాదకత్వం వహించి తయారు చేసిన గ్రంథం తెలుగు భాషాచరిత్ర లో వారే ఒక వ్యాసం మాండలిక భాషలపైన రాశారు. అదే వ్యాసంలో ఆయన జానపద భాషని గురించి చర్చించారు. అయితే ఇక్కడి భాషా చర్చ జానపద సాహిత్యం ఆధారంగా జరగలేదు. ఇది వారు మాండలిక వృత్తిపదకోశాల కోసం సేకరించిన భాష ఆధారంగా చేసిన భాషాపరిశీలన. వివిధ వృత్తులు చేసుకునే వారు వారి వృత్తికి సంబంధించి దైనందిన జీవితంలో, వృత్తి వినియోగంలో వాడిన మాట్లాడిన భాషను పరిశీలించారు. కృష్ణమూర్తిగారు తెలుగు మాండలిక భాషలని నాలుగు మండలాలుగా విభజించారు. 1. పూర్వమండలం, 2 దక్షిణ మండలం, 3. ఉత్తర మండలం, 4 మధ్యమండలం అని నాలుగు మండలాలుగా మన మాండలిక భాషలని విభజించి మాండలిక భాషకున్న లక్షణాలు వర్ణించారు. ఇక వీటి వివరాలు ఇక్కడ అవసరం లేదు కాని ఆయన చేసిన మరొక పరిశీలనను ఇక్కడ ప్రస్తావించాలి. ఇదే సందర్భంలో భాష వ్యక్తీకరణలను రెండుగా విభజించి చెప్పారు 1. శిష్టభాష 2. జానపద భాష. ఇక్కడ మొదటిది చదువుకున్న వారి భాష రెండోది చదువుకోని వారి భాష లేదా పామర భాష ఇక్కడ పామరులు అంటే కించపరిచే అర్థం లేదు.

జానపద భాషకి శిష్టభాషకి ఉన్న భేదాలను చెబుతూ ఎనిమిది ప్రధానమైన లక్షణాలను ఆయన సూచించారు. జానపద భాషని పరిశీలించడానికి ఆ విభజన చాలా బాగా ఉపకరిస్తుంది. నేటి జానపద భాషలో పడిన ప్రభావాలను పరిశీలించి వస్తున్న పరిణామాలను గ్రహించడానికి ఆయన చేసిన విభజన ఇక్కడ తప్పక పరిశీలించవలసి ఉంటుంది. ఆయన చెప్పిన ఎనిమిది లక్షణాలను ఇక్కడ చెబుతాను.

1. శిష్టోచ్చారణలో ఒత్తులు నిలుస్తాయి (భాగవతం, ధర్మం), జానపదోచ్చారణలో ఒత్తులు పోతాయి (బాగవతం దర్మం).

2. శి.ఉ లో అద్విరుక్త చకారం అంతటా నిలుస్తుంది. (చవుడు, చుక్క పలచన) జా.ఉ లో చకారం సకారం అవుతుంది (సవుడు, సుక్క పలసన)

3. శి.ఉ లో పదాది వకారం నిలుస్తుంది (ఇ,ఈ,ఎ,ఏ లముందు విల్లు, వీధి, వెండి, వేడి) జా-ఉ లో వకారం పోతుంది యిల్లు, యూది, యెండి, యేడి.

4. శి. ఉ లో సంయుక్త హల్లులు నిలుస్తాయి (భక్తి చేస్తాడు, కలెక్టర్‌) జా.ఉ లో హల్లులు సమీకరణం పొందుతాయి (బత్తి, సేత్తాడు, స్వరభక్తి కూడా రావచ్చు. కలకటేరు)

5. శి. ఉ లో శ, శ్హ, స ల భేదం ఉంటుంది. (శాస్త్రి, భాష, కాసు) జా. ఉ లొ శ, ష, స లు లు సకారంగా మారతాయి సేత్రి, బాస, కాసు)

6. శి.ఉ లో మూర్ధన్య దంతమూలీయ ఖేదం నిలుస్తుంది (పల్లం, పళ్ళెం, వాణ్ణి) జా. ఉ లో మూర్థన్యాలు దంతమూలీయా లౌతాయి (పల్లం, పల్లెం, దాన్ని, వాన్ని.

7. శి. ఉ లో f, ఫ వేరు వేరుగా ఉంటాయి (ఆఫీసు, కాఫీ, తోపు) జు.ఉ లో f, ప గా మారుతుంది (ఆఫీసు కాపీ తోపు)

8. శి. ఉ లో పదాది గకారం దేశ్య శబ్దాలలో నిలుస్తుంది (గట్టు, గడ్డ, గండి) జా. ఉ లో గ , గె మారుతుంది. (గెట్టు, గెడ్డ, గెండి).

జానపద భాషలో ఉన్న ఎనిమిది ప్రధాన లక్షణాలు పైన చేసిన పరిశీలనలో చూడవచ్చు. రోజూ మాట్లాడే భాషని పరిశీలిస్తే ఇంకా కొన్ని విధానాలు కూడా మనకు జానపద భాషలో కనీపిస్తాయి. అయితే పైన చెప్పిన ఎనిమిది భాషావిశేషాలు నేటికీ మనకు జానపద భాషలో కనిపిస్తాయి. అంతే కాదు పైన చెప్పిన జానపద భాష లక్షణాలు ఆయా మండలాలలో నివసించే విద్యావంతుల భాషలో కూడా మనకు కనిపించే తీరు ఇక్కడ మనం గమనించవచ్చు. తెలంగాణ మాండలికంలోని భాషారూపాలు ఇక్కడి విద్యావంతులు యాచ్చచ్చికంగా మాట్లాడే భాషలో కూడా చూడవచ్చు.

ఉదాహరణకి తెలంగాణ మాండలికంలో పైన చెప్పిన పదాది వకారం లోపించి వచ్చిండు బదులు అచ్చిండు, అచ్చింది అని పలకడం, మళ్లీ బదులు మల్లీ అనడం, వాళ్ళు బదులు వాల్లు అనడం, విద్యావంతులలో కూడ ఉంది. అంతే కాదు ఇక్కడి మాండలికానికి వేరే వ్యాకరణం రాసే ప్రయత్నమే ఉంది కాబట్టి ఇక్కడ దీనిపైన విస్తృత చర్చ అవసరం లేదు. ఇంతే కాదు కృష్ణ మూర్తిగారు చూపిన ఇంకా ఇతర మూడు మండలాలలోని భాషలలో ఉన్న విద్యావంతుల భాషలో కూడా ఇలాంటి మాండలిక పద వినియోగం మనం చూడవచ్చు.

ఇక నేటి జానపద భాషపైన ఏఏ ప్రభావాలు విస్తృతంగా పడ్డాయో మనం నేటి సందర్భంలో పరిశీలించి నేడున్న జానపద భాష వ్యక్తీకరణాలు ఎలా ఉన్నాయో చెప్పవచ్చు.

రామరాజుగారు జానపద భాషకి ఒక నిర్వచనం లాంటి

వాక్యాన్ని రాశారు. “దేశీయమగు సరళ మార్గమున వ్యాకరణాలంకార నియమములకు కట్టువడక అలతియలతి పదములతో అప్రయత్న ముగా సహజముగా వెలువడెడు వ్యావహారిక భాష” అని దీన్ని అన్నారు. అలాగని రామరాజు గారు జానపదభాషని వ్యాకరణ విరుద్ద భాష అని అన్నారని అర్థం చేసుకోకూడదు. శిష్టభాషకు వర్తించే వ్యాకరణానికి విరుద్దమైన భాష అని మాత్రమే వారి భావం. కారణం వారే, ఇదే అధ్యాయంలో జానపద భాషకు వేరే వ్యాకరణమే రాయాలని నిక్కచ్చిగా చెప్పి దాన్ని ప్రత్యేకంగా వర్ణించి వ్యాకరణం రాయాలి అని అన్నారు. అయితే రామరాజు గారు జానపద భాషని గురించి రాసింది 1956 ప్రాంతంలో ఇక భద్రిరాజు కృష్ణమూర్తి గారు జానపద భాష లక్షణాలను గురించి రాసింది 1973 ప్రాంతంలో. కాగా నేటికి ఈ పరిశీలన చేసి దాదాపు ఐదు దశాబ్దాలు గడిచింది. నేడున్న సామాజిక పరిస్థితిలో వచ్చిన పరిణామాలను పరిశీలిస్తే నేటి జానపద భాషలో వచ్చిన పరిణామాలను పరిశీలించవచ్చు. అందుకే నేటి సందర్భంలో భాషపైన పడిన ప్రభావాలను పరిశీలన చేద్దాం.

సామాజిక పరిమాణాల కారణంగానే అక్కడున్న కళారంగం ప్రభావితం కావడం మనం గమనిస్తూ వస్తూనే ఉన్నాము. స్వాతంత్య్రొద్యమ కాలంలో ఉద్యమానికి బాసటగా జానపద సాహిత్యం జాన పద ప్రదర్శన కళలని ఉద్యమకారులు పార్టీలు విరివిగా వాడుకొని వారి ఆలోచనలను, వాదాలను సిద్ధాంతాలను బాగా ప్రచారం చేసారు. తెలంగాణ రజాకార్ల వ్యతిరేక ఉద్యమంలో కూడా జానపద కళలను విరివిగా వినియోగించుకోవడం చరిత్ర ప్రసిద్ధం కూడా. ఇక్కడ గమనించాల్సిన విషయం సామాజికంగా జరిగే పరిణామాలు జానపద సాహిత్యం కళలపైన ఎలాంటి ప్రభావం వేసింది అని. ఇలా కాక మరో కోణంలో నమాజంలో జరిగే సాంకేతిక పరిణామాలు, సాంఘిక పరిణామాలు ఆ సమాజంలోని సాహిత్యం అంటే మౌఖిక సాహిత్యం కళపైన ఎలాంటి ప్రభావం వేస్తుంది అని పరిశీలించవలసి ఉంది. జన జీవితంలో వచ్చే తీవపరిణామాలు భాషపైన కూడా గట్టి ప్రభావం వేస్తాయని మనకు ఇటీవల అంటే గడచిన రెండు మూడు దశాబ్టాలలో తెలియవచ్చింది.

నాటక రంగం అదృశ్యం కావడానికి లేదా మరుగున పడిపోవడానికి సినిమా ఎంత బలమైన కారణమో ఇప్పటికే చాలా చర్చలు జరిగాయి. అయినా జానపద కళలు కొన్ని బతికి బట్టకట్టాయి. కారణం సినిమా థియేటర్లు గ్రామాలకు దూరంగా ఉండడం కనీసం తాలూకా కేంద్రానీకి పోయి అదీ ఏ నెలకో రెండు నెలలకో పోయి చూసే పరిస్థితి ఉండేది. వారికి ఉన్న ఖాళీ సమయంలో ఈ జానపద ప్రదర్శన కళలు పాటలు ఇతర అభివ్యక్తి ప్రక్రియలు వినోదాన్ని అందించేవి. ఇంకా రకరకాల జానపద క్రీడలు ఆచారాలు వినియోగంలో ఉండేవి. అంటే సినిమా ప్రభావం ఒక స్థాయి మేరకే ఉండేది.

1980 దశకం తర్వాత సమాజంలో వచ్చే పరిణామాలు చాలా వేగవంతం అయ్యాయి. సామాజిక పరిణామాలను చాలా తీవ స్థాయిలో తేవడానీకి వచ్చిన సాంకేతిక మాధ్యమ విప్లవాలు అని చెప్పదగినవి ఒకటి సాటిలైట్‌ కేబుల్‌ టివి, రెండు మొబైల్‌ ఫోన్‌. ఈ రెండు జన జీవితాన్ని అతి తీవ్రస్థాయిలో ప్రభావితం చేశాయి. దీని తర్వాత ఇలాంటి ప్రభావం ఉన్న మరొక ప్రధాన అంశం విద్యావ్యాప్తి.

మన దేశంలో అక్షరాస్యత పెరిగిన విధానాన్ని పరిశీలించినా అక్షరాస్యత లేని వారి భాష అంటే లిఖిత సాహిత్య ప్రభావం కాని ఉన్నత స్థాయి భాష ప్రభావం కాని లేని వారిధి, అక్షరాస్యులు కాని వారి కేవల మౌఖిక భాష అంటే జానపద భాష వ్యాప్తి ఎలా ఉందో కూడా తెలుసుకోవచ్చు

మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటికి అంటే 1947 నాటికి మన దేశంలో అక్షరాస్యత 12% గా ఉండేది. కాని అదే 1940 దశకంలో ఐరోపా దేశాలలో అక్షరాస్యత 90% గా ఉండేది. దీన్నే బట్టే పరాయి పాలనలో మగ్గిన దేశంలో చదువు పరిస్థితి ఎలా ఉండేదో తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మనకు వచ్చిన ఉద్యమాలు కూడా ఆ కాలంలో వచ్చినవే. దీన్ని బట్టే అంటే అక్షరాస్యత 12 శాతంగా ఉన్న ప్రజలకు నమాచారం అందించవలనిన మాధ్యమం జానపద భాష జునపద కళలు మాత్రమే అని నాటి ఉద్యమకారులు కాని ఇతరులు కాని గుర్తించారు.

ఆంధ్రదేశంలో కేబుల్‌ ద్వారా వ్యాపించే సాటిలైట్‌ టివి 1996 నుండే ఆరంభం అయింది. ఇది ప్రతి పల్లెకు వ్యాపించడానికి ఐదు నుండి పది సంవత్సరాల కాలం పట్టింది. అంటే 2010 నాటికే ప్రతి పల్లెకు సాటిలైట్‌ టివి డిష్‌ టివి ప్రసార మాధ్యమం వ్యాపించింది. ఇంటింటికీ టివి ఉండడం టివి లేనీ గుడిసె కూడా లేకపోయిన స్టితి ఈ కాలానికే వచ్చింది. ఇక దీనితో పాటు దీనికి సమాంతరంగా విద్యా వ్యాప్తి ఎలా ఉందో తెలుసుకోవడం ముఖ్యం. 2011 జనగణన ప్రకారం భారత దేశం మొత్తంలో అక్షరాస్యత వ్యాప్తి 74.04% గా ఉంది. కాగా 2018 సంవత్సరంలో అంటే ఇటీవలే గణించిన లెక్కల ప్రకారం దేశంలో అక్షరాస్యత 94. 65 శాతంగా ఉంది.

ఇక్కడ నేటిస్టితిలో అక్షరాస్యత అంటే కేవలం అక్షరాలు మాత్రమే రాయగలిగిన వారు కారు అని కనీసం పదవ తరగతివరకు చదువుకున్నవారు అని గ్రహించాలి. దీనికి కారణం ప్రతిపల్లెకు విద్యావ్వాపారం పాకి పోయింది. అంటే ఇంగ్లీషు మీడియం ప్రైవేటు పాఠశాలలు ప్రతి పల్లెకూ వ్యాపించి పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతూ ఉంది. కనీసం పదవతతరగతి వరకు చదివించని కుటుంబాలు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. ఈ వ్వాస కర్త ప్రతీ సంవత్సరం ఒక వంద గ్రామాలకు తగ్గకుండా సందర్శిస్తూ క్షేత పరిశోధన చేస్తూ ఉన్నాడు. ఈ గ్రామాలలో గమనించిన విషయాలు భాషలో వచ్చిన మార్పులు ఆశ్చర్యం కలిగించేలా ఉంటున్నాయి.

ప్రతీ ఇంటిలోను టివి పనిచేస్తూ ఉంది అని చెప్పుకున్నాము. నేటి లెక్కల ప్రకారం ఒక తెలుగులోనే 56 ఛానళ్ళు పనిచేస్తున్నాయి.

ప్రజల భాషలో పరిపాలించేదే ప్రజాసామ్య ప్రభుతం

ఇవి నిరంతరాయంగా కార్యక్రమాలను అందిస్తున్నాయి. రోజులో పగలు, రాత్రి సమయాలలో ఎక్కువ సమయం వచ్చేవి సీరియళ్ళు, తర్వాత సినిమాలు, తర్వాత వార్తలు. ఇక ప్రత్యేకంగా రోజంతా వార్తలు వినిపించే ఛానళ్ళు వచ్చాయి. ఈ మాధ్యమాలలో వినియోగించే భాష ప్రభావం ప్రజల మీద చాలా ఎక్కువగా ఉంది. పత్రికల భాషకన్నా ఈ ఛానళ్ళలో ప్రజలకు వినిపించే భాష ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇక సినిమా అనేది ఒకప్పటి తెరమాధ్యమం కాదు. తెరమాధ్యమంగా సినిమా ఉన్నప్పుడు గ్రామీణ ప్రజలు తమకు కనీసం పది కి.మీ దూరంలో ఉన్న కొద్దిపాటి బస్తీకి పోయి సినిమా చూడవలసి వచ్చేది. కాని నేడు సినిమా అనేది తెర మాధ్యమం కాదు గృహప్రక్రియ అంటే domestic genre అని కొత్త నిర్వచనం ఇవ్వాలి. ఒక్కో ఛానల్‌ రోజుకు కనీసం మూడు సినిమాలు అందిస్తూ ఉంది. అంతే కాదు అచ్చం రోజంతా సినిమాలే ప్రదర్శించే ఛానళ్ళు వచ్చాయి. దీని కారణంగానే గ్రామీణ జీవితంలో కానీ నగరంలో కాని సినిమా అనేది గృహప్రక్రియ అయింది ఇంటితెర అయింది అని చెప్పవచ్చు. దీనివల్ల ఇంటి సినిమా ప్రభావం గ్రామీణ జీవితంలో వేష భాషలలో సమూలమైన మార్పు తీసుకు వచ్చింది. టివిలో వాడే భాషని మాట్లాడడం నాగరికత అని పాతకాలంలో మాట్లాడిన భాష మాట్లాడడం మోటు అనే భావన ప్రజలలో వచ్చింది. ఏది జానపవ భాష అని లెక్కిస్తే ఇది జానపద భాష ఇది నగరభాష అని విడమరచి చెప్పలేని పరిస్థితి ఏర్పడింది.

'సెటిలైట్‌ ఛానళ్ళు ఇంటింటికీ వ్యాపించినందువల్ల ఏర్పడిన పరిస్థితి జానపద కళలపైన మరణ శాసనం రాసింది. గ్రామీణుల కున్న తీరిక సమయం మొత్తాన్ని ఈ డిష్‌ టివి లాగేసుకుంది. దీని కారణంగానే జానపద క్రీడలు జునపద ప్రదర్శన కళలు తెరమరుగు అయ్యాయి. అంటే వాటిని అంటిపెట్టుకొని ప్రవర్తించిన జానపద భాష కూడా మరుగై పోయింది అనే అర్ధం. నేటి క్షేత్ర పరిశోధనలో ఎక్కడ ఏ పల్లెలో పలకరించినా ప్రజలు మాట్లాడే భాష టివి భాషకు చాలా దగ్గరగా ఉంటూ ఉంది. ఏ ఛానల్‌ కి సంబంధించిన యాంకర్‌ కాని పల్లెకు ఫోయి ఏ వ్యక్తికైనా మైక్‌ ఇచ్చి అక్కడి సమస్యలను గురించి విచారిస్తే అక్కడి వారు అతనితో మాట్లాడే భాష టివి ప్రసారంచేసే భాష మాదిరిగానే ఉంటుంది. రైతుల సమస్యల గురించి కాని జీవనోపాధి పథకాల గురించి కాని లేదా గ్రామాలలో అమలయ్యే ప్రభుత్వ కార్యక్రమాల గురించి కాని టివి విలేకర్లు అడిగిన ప్రశ్నలకు అక్కడి వారు చెప్పే సమాధానాలు టీివిలలో వింటే అది టివి మాధ్యమాలలో ప్రసారం అయ్యే భాషలాగే ఉంటుంది. కాని అంతకుముందు గ్రామాలలో కనిపించిన భాష కనిపించడం లేదు. క్షేత్ర పరిశోధనలలో అక్కడి వారిని కదిలిస్తే వినిపించే భాష కూడా ఇలాగే ఉంటూ ఉంది.

ఇక గ్రామీణ జీవితాన్నీ సమూలంగా మార్చి మానవ సంబంధాలను అతి దగ్గరచేర్చి వారి భాషలో అత్యధికంగా ఇంగ్లీషు మాటల్ని చేర్చిన మరొక సమాచారవ్యవస్థ మొబైల్‌ ఫోన్‌. నగరంలో ప్రతి ఇంట్లోనే కాదు ప్రతివ్యక్తి దగ్గర సెల్‌ఫోన్‌ ఉంటూ ఉందన్న సంగతి చెప్పనవసరం లేదు. సెల్‌ఫోన్‌ వ్యాప్తి మండలస్థాయిలో ప్రతి గ్రామ స్థాయిలో ప్రతి తండా స్థాయికి కూడా విస్తరించి ఉంది. మొబైలో ఫోన్‌ ప్రతి ఇంట్లో ఉంది. ఈ ఇంట్లో లేదు అని చెప్పే పరిస్టితి కనిపించడం లేదు. వివిధ వృత్తులు చేసుకునే వారి దగ్గర, ఫొలంలో నాగలి దున్నే వ్యక్తి నడుముకుకట్టి కూడా మొబైల్‌ కనిపిస్తూ ఉంది. చివరికి ప్రతి యాచకుని వద్ద కూడా మొబైల్‌ ఫోన్‌ కనిపిస్తూ ఉంది. తెలుగు వ్యవహార భాషలోనికి చాలా ఎక్కువ ఇంగ్లీషు పదాలు తెచ్చిన ఘనత ఈ ఫోన్‌ వ్యవస్థకి ఉందని తెలుస్తూ ఉంది. ఇంతకు ముందు అంటే కనీసం పది సంవత్సరాల క్రితం గ్రామాలలో క్షేతపరిశోధనలలో ఎవరినైనా ఇంగ్లీషు రాని వారితో మాట్లాడి ఇంగ్లీషు పదాలు లేని తెలుగును విందాము అని అనుకుంటే అది సాధ్యం అయ్యేది. ఇంగ్లీషు చదువుకోని వారి తెలుగు ఎలా ఉంటుందో తెలుసుకోవదానికి అంటే ఇంగ్లీషు పదాలు (బస్సు రైలు వంటివి కాక) లేని తెలుగును వినడం సాధ్యం అయ్యేది. కాని జానపద భాషలో ఇలా ఇంగ్లీషు పదాలు లేని తెలుగు వినడం నేడు సాధ్యం కాదు. పెద్దవారు అంటే 70 లేక 80 ఏండ్లు వయస్సున్న ఆడ మగ వారిని కదిలించినా వారి భాషలో ఆంగ్లపదాలు బాగా వినిపిస్తున్నాయి. సెల్‌ ఫోన్‌ వ్యవస్థ చుట్టూ తిరిగే ఎన్నో మాటలు తెలుగులో లేనివి ఇంగ్లీషు పదాలే అందరి నోళ్ళలో నానుతున్నాయి. సెల్స్‌ సిమ్‌, సిమ్‌ కార్డు, బాటరీ, చార్జింగ్‌, రీచార్జింగ్‌, టవర్‌, కాల్స్‌ కాల్‌ కలవలేదు, కాల్‌ చేసాడు. చార్జింగ్‌ ఎక్కింది. చార్జింగ్‌ దిగిపోయింది. సెల్లులో డబ్బులెయ్యి. ఇలా ఎన్నో వ్యక్తీకరణలు ప్రతి వారి భాషలోనికి వచ్చాయి. ఇక మొబైల్‌ సేవలు అందించే కంపెనీల పేర్లన్నీ కూడా గ్రామాలలో వినిపిస్తాయి. వాటి అధినేతల పేర్లు కూడా వినిపిస్తాయి. బాగా చదువుకున్న వారు విశ్వవిద్యాలయం పండితులు మొబైల్‌ ఫోన్‌ ను చరవాణి, అని కరవాణి అని, ల్యాండ్‌ ఫోన్‌ ని స్థిరవాణి అని అనువాదాలు చేసి సరదాగా వినియోగించు కుంటున్నారు. కాని జానపదుల భాషలో సెల్‌ ఫోన్‌ సెల్‌ ఫోన్‌ గానే వ్యవహారంలో స్థిరపడింది. సెల్‌ ఫోన్‌ వ్యవస్థకి సంబంధించిన ఏ పదాన్ని కానీ వారు తెలుగులో అనువాదం చేసే ప్రయత్నం చేయడం లేదు పూర్తిగా ఇంగ్లీషు పదాలే అక్కడ ప్రచారంలోనికి వచ్చాయి. విస్తరించిన సినిమా, విస్తరించిన డిష్‌ టివి కేబుల్‌ టివి, విస్తరించిన మొబైల్‌ ఫోను, విస్తరించిన ఇంగ్లీషు విద్య జానపద భాషలో ఎక్కువగా మార్పులు తెచ్చాయి.

జానపద భాషలో టివి మాధ్యమం భాష, అదీ సీరియళ్ళలో పాత్రలు మాట్లాడే భాష బాగా ప్రచారంలోనికి వచ్చింది. సీరియల్‌ పాత్రల భాషలో మాట్లాడడం ఫేషన్‌ అనే స్థితికి వెళ్ళింది. టివి వార్తల్లోని భాషకూడా బాగా వ్యాప్తిలోనికి వచ్చింది. దీని ప్రభావం వల్ల ఇంగ్లీషు విద్య వాప్తి వల్ల కూడా జానపద భాషలో ఇంగ్లీషు పదాల వాడుక చాలా విస్తృతంగా పెరిగింది. యువతరంలోనే కాక పెద్దవయస్సు వారిలో కూడా ఇంగ్లీషు పదాల వినిమయం బాగా పెరిగింది. మాండలిక వ్యక్తీకరణాలలో కూదా చాలా మార్పులు వచ్చాయి.

నగరీకరణం అనేది పల్లెల్లో బాగా వ్యాపించింది. ఈ నగరీకరణం అంటే urbanization అని చెప్పాలి. దీన్నే మరో

పరభాషా దేషం, పరభాషా దాస్యం - రెండూ తప్పే

విధంగా ఆధునీకరణం అni కూడా అనవచ్చు. కొన్ని ఉదాహరణలు చూడవచ్చు. ఇంతకుముందు కాలంలో గ్రామంలో పెండ్లి అయితే తాటాకు పందిళ్ళు వేసేవారు. అది ఆ సంవత్సరం అంతా ఉండేది. ఇక పెద్దపెద్ద పాత్రలు ఉన్న వారి ఇండ్ల నుండి అరువుకు తెచ్చుకునేవారు శుభకార్యం అంటే వారు కూడా కాదనకుండా ఇచ్చేవారు. అంటే దాదాపుగా గ్రామంలో ఉండే వస్తువులే పెండ్లి కార్యక్రమాలు అన్నింటిలో ఉండేవి ఉపయోగపడేవి. మేళతాళాలు వాద్యగాళ్ళు మాత్రం అన్ని గ్రామాలలో ఉండేవారు కారు పక్క ఊరు నుండి రావలసి వచ్చేది. కాని నేటి కాలంలో టెంట్‌ హౌస్‌ లు చాలా పెద్దగ్రామాలలో వచ్చాయి. ఒక గ్రామంలో లేకపోయినా పక్క గ్రామాలనుండి తెప్పించుకుంటున్నారు. సామాను టెంటులు టేబుళ్ళు కుర్చీలు, క్రాకరీ మ్యూజికి బ్యాండ్‌ విత్‌ వెహికిల్‌ యూనిఫామ్‌ లు అన్నీ పల్లెకి వచ్చాయి. ప్లెక్సీ బానర్లు, వాటర్‌ బాటిళ్ళు, వీడియోలు డిజిటల్‌ ఫోటోలు, మానీటర్లో చూడడాలు, సిడి ఆల్బమ్‌ లు ఇన్ని వచ్చాయి. పాత ఆచారాలకు చెందిన పదాలు అన్నీ పోయి ఇక్కడ చెప్పుకునే కొత్త పదాలు అన్నీ వచ్చాయి. ఎన్నో ఇంగ్లీషు పదాలు జానపదుల వ్యవహారంలోనికి వచ్చాయి.

కరెంటు లేని ఇల్లు కనిపించదు. ఈ కరెంటుతో పాటు చాలా ఇంగ్లీషు పదాలు వ్యవహారంలోనికి వచ్చాయి. బల్బు, ఫాను, ఎసి, స్విచ్చులు, లైట్లు, బోర్జులు, మిక్సీలు, గ్రైండర్లు వాషింగ్‌ మెషిన్లు, ఇలా చాలా గృహోపకరణాలు సంప్రదాయమైనవి పోయి కొత్తవి వచ్చాయి. వాటితో పాటు తెలుగు మాటలు పోయి ఇంగ్లీషు పదాలు వ్యవహారంలోనికి వచ్చాయి.

కొత్త కొత్త ఆహారాలు, వాటి పేర్లు నిత్యవ్యవహారంలోనికి వచ్చాయి. వైట్‌ రైస్‌, సాంబార్‌ రైస్‌, ఫ్రైద్‌ రైస్‌, ఘీ, కోకోనట్‌ రైస్‌, కర్ట్‌ రైస్‌, బటర్‌ మిల్మ్‌ పాల పాకెట్లు, క్రైట్లు కాన్సు ఛాట్, పానీ పూరీ, పావ్‌ బాజీ, బిర్యానీ, యగ్‌ బిర్యానీ వెజ్‌ బిర్యాని, మటన్‌, చికెన్‌ బిర్యానీలు, ఇలా చాలా పదాలు నిత్య వ్యవహారంలోనికి వచ్చాయి. టీవీ ఛానళ్ళలో వంటల కార్యక్రమంలో చూపించి మాట్లాడే మాటలన్నీ ఇంగ్లీషులో లేదా హిందీలో ఉంటాయి. దాదాపు ఆ పదాలు అన్నీ జానపద భాషలో నిత్యవ్యవహారంలోనికి వచ్చాయి. చదువుకోని వారుకూడా తాలింపు వేశావా బదులు ఫ్రైచేశావా అని డీప్‌ ఫ్రై చేయి అని చెప్పుకుంటున్నారు. చివరికి గోరింటాకు కూడా పోయి మెహాందీ వచ్చింది. మెహందీ పాకెట్లు ఊరి కిరాణా దుకాణంలో అమ్ముతున్నారు. పల్లెల్లోకి బ్రైడ్‌ మేకప్‌ వచ్చింది. బ్రైడల్‌ సారీలు, బ్రైడల్‌ ఫినిషింగ్‌లు వచ్చాయి. దగ్గరిలోని పట్టణంనుండి నాగరికత అంతా అతి సునాయాసంగా ఊర్లోనికి అడుగు పెడుతూ ఉంది. దీనితో వచ్చే పదసంపద అంతే దేశ్య పదజాలాన్ని అంటే జానపద వ్యవహారాన్ని తోసి రాజని నిలబడుతూ ఉంది.

ఆహారపు అలవాట్లు దుస్తులలో కూడా చాలా మార్పులు వచ్చాయి. పంచె కట్టు తగ్గింది. పాంట్లు షర్టులు వేసే వారు చాలా ఎక్కువగా ఉన్నారు. పొలం పనులు చేసేటప్పుడు కూడా పాంట్లు వేసే వారు కనిపిస్తున్నారు. నరేగా పనులు చేసే వారిలో కూడా ఆడవారు షర్టులు ధరించడం మగవారు పాంటులు థరించడం కనిపిస్తూ ఉంది. యుక్తవయస్సులో అమ్మాయిలు లంగా ఓణీ వేసుకోవడం పూర్తిగా మరిచారు. పంజాబీ సల్వార్‌ కమీజు అమ్మాయి అందరికీ సర్వసామాన్యమైన డ్రస్‌ అయింది. వీటి ప్రభావం అంటే ఆహార విహారాలలో ప్రభావం భాషమీద ఉంది. ప్రేమలు ప్రేమ వివాహాలు, కులాంతర ప్రేమలు వాటి దుష్పరిణామాలు యువతీ యువకుల మధ్య భిన్న భిన్న సంబంధాలు ఏర్పడడానికి టివీ దాని ద్వారా వ్యాపించిన సినిమా చాలా వరకు కారణం ప్రేరణం అవుతూ ఉంది. ఈ సామాజిక పరిణామం కూడా భాష మీద ప్రభావం వేస్తూ ఉంది.

వృత్తులలో విస్తృతమైన మార్పులు వచ్చాయి. మాండలిక వృత్తి పదకోశాలలో నాలుగు ఐదు దశాబ్దాల క్రితం సేకరించిన పదాలు నేడు చాలా వరకు కనిపించవు. కారణం వ్యవసాయం చాలా వరకు యాంత్రీకరణ అయింది. దానికి సంబంధించి చేసే వడ్రంగం పని చెక్కపనిముట్లు పోయినాయి. మరనాగళ్ళు ఇనప నాగళ్ళు వచ్చాయి. దీని కారణంగా వ్యవసాయ వృత్తి పదాలు పోయాయి. వడ్రంగం పనిలో పూర్తిగా యాంత్రికీకరణ వచ్చింది. సాంప్రదాయికంగా ఉన్న వృత్తి పనిముట్లు పోయాయి వాటి పదాలు కూడా పోయాయి. కోయడం దగ్గరనుండి దూగోడు పట్టడం దగ్గరనుండి పిడిశానలు, ఉలులు అన్నీ పోయి బెజ్జాలు కొట్టడం, కూసాలు చేయడం ఈ పనులన్నీ యంత్రాలు చేస్తున్నాయి. వృత్తి జానపదంలో ఈపదాలు అన్నీ అంతరించాయి. ఇలా ప్రతి వృత్తిలోను సంప్రదాయిక పనిముట్లు పనితీరు పోయింది లేదా చాలా మారింది. దానికి అనుగుణంగా భాషకూడా మారింది. స్వర్ణకార వృత్తిలో పదాలు చేనేతలో చాలా పదాలు కొత్తవి ఇంగ్లీషువి వచ్చి చేరాయి.

రెండు మూడు దశాబ్దాల క్రితం దాకా ధాన్యం కొలతలు, ద్రవం కొలతలు దూరం కొలతలు తెలుగులో ఉండేవి. ధాన్యం కొలతలు గిద్దె, సోల, తవ్వ, మానిక వంటి పదాలు పోయి కిలోలు వచ్చాయి. ద్రవం కొలతులు కూడా లీటర్లు వచ్చాయి. బరువు కూడా శేరు అర్థశేరు, వీశె, కట్టు, మణుగు వంటి సంప్రదాయక పదాలు వ్యవహార లుప్తం అయ్యాయి. అన్నీ కిలోలు, గ్రాములే జానపద వ్యవహారంలోనికి వచ్చాయి.

పైన చెప్పిన అన్ని ప్రభావాల కారణంగా జానపద భాషలో వచ్చిన పరిణామాన్ని ఒక సారి గమనించవచ్చు. పైన భద్రిరాజు కృష్ణమూర్తిగారు చెప్పిన ఎనిమిది విధాల వైవిధ్యాలు ఇప్పుడు జానపద భాషలో కనిపించడం లేదు. వారు శిష్ట భాషకి జానపద భాషకి మధ్యనున్న వైవిధ్యాలను చెప్పడానికి ఎనిమిది విధాల భిన్నత్వాలను సూచించారు. వారు చెప్పిన ఎనిమిది విధాల జానపద భాషాలక్షణాలు గమనిస్తే నేటికి ఉన్న పరిణామాన్ని చూడవచ్చు.

1. జానపద భాషలో ఒత్తులు నిలవవు అని ఉన్న సూత్రీకరణలో ఆ పరిస్థితి పూర్తిగా లేదు. ఒత్తులు నిలిపి మాట్లాడే వారి సంఖ్య బాగా పెరిగింది.

సాంత భాషను అణగద్రాక్కి సంస్కృతిని కాపాడలేరు


2. హకారం పోకుండా చాలా సందర్భాలలో నిలబడుతూ ఉంది.

3. పదాది వకారం నిలబడి స్పష్టంగా పలికే సందర్భాలు ఎక్కువగా ఉంటున్నాయి.

4. సంయుక్త హల్లుల స్థానంలో ద్విత్వాక్షరాలు పలకడం కొంత తగ్గింది సంయుక్తాక్షరాలను పలకడం పెరిగింది.

5. శ ష స ల ఖేదం విషయంలో పెద్ద మార్పు రాలేదు. చివరికి నగరంలోని వ్యవహారంలో కాని టీవీ యాంకరమ్మల భాషలో కాని ఎక్కడ శ పలకాలి, ఎక్కడ ష పలకాలి, ఎక్కడ స పలకాలి అనే విచక్షణ ఇంకా పెరగలేదు.

టీవీ యాంకరమ్మల కృతక భాష చాలా సందర్భాలలో జానపద భాషలో అనుకరణకి లోనవుతూ ఉంది.

6. మూర్ణన్వాక్షరాలు స్పష్టంగా పలికే విధానం పెరిగింది కాని ఇంకా వాల్లు, వీల్లు, పల్లెం, వాన్ని అని పలికే తీరు ఇంకా ఉంది.

ఆచార్య కృష్ణమూర్తిగారు జానపద భాషకు సూచించిన ప్రమాణాలు పూర్తిగా నశించి శిష్టవ్యవహార రూపాలు జానపద భాషలోనికి రావడం ఇంకా పూర్తిగా జరగలేదు. కాని ఆయన సూచించిన నాటి రూపాలు కూడా పూర్తిగా నిలవలేదు. చాలా మార్చులువచ్చాయి.

జానపద భాషలో వచ్చిన ప్రధానమైన పరిణామం పదాల ఉచ్చారణలో శిష్టరూపం రావడం అన్నది అంత ఎక్కువగా జరగలేదు. విద్యావ్యాప్తి ఎక్కువగా ఉన్నా ఉచ్చారణ పాత ఉచ్చాచరణలు ఇంకా గణనీయంగా నిలిచే ఉన్నాయి. కాని వచ్చిన పెద్దమార్పు ఏమంటే సంప్రదాయ దేశీయ పద సంపద బాగా తగ్గి వాటి స్థానంలో ఇంగ్లీషు పదాలు చాలా విరివిగా వచ్చి చేరాయి. జీవన విధానంలో చాలా కోణాలలో ఈ ఇంగ్లీషు పదాల వినియోగం బాగా పెరిగింది. అంతే కాదు టీవీ అనేది దేశ వ్యాప్తంగా ఒకే విధమైన పదసంపద పెరిగేలా చేస్తూ ఉంది. ఉత్తర భారతంలో వాడే చాలా హిందీ పదాలు ఆహారం భాషలో వచ్చిన మార్పుల కారణంగా ఇక్కడ దక్షిణాది భాషలలో కూడా వచ్చి చేరింది.

తెలుగు జానపద భాషలో వచ్చిన పరిణామాన్ని సరిగ్గా విస్తృతంగా అంచనా వేయడానికి అధ్యయనం చేయడానికి పెద్ద ప్రయత్నమే జరగాలి. ర్యాష్టవ్యాప్తంగా ఒక ప్రాజెక్టు పెట్టాలి. కోర్‌ ప్రాంతంలో పెరిఫెరీ ప్రాంతంలో ఎంపిక చేసే విధంగా కొన్ని గ్రామాల్ని శాస్రీయంగా ఎంపిక చేసుకొని అక్కడ కొన్ని రోజుల పాటు ఉండి వివిధ సందర్భాలలో వ్యక్తమయ్యే పద సంపదని సేకరిస్తే తెలుగుపదాలు ఎన్ని వందలు వ్యవహార లుప్తం అయ్యాయి.

ఎన్ని ఇంగ్లీషు వదాలు, హిందీ వదాలు జానవద వ్యవహారంలోనికి ఇటీవలి కాలంలో వచ్చి చేరాయి అనే విషయం క్షుణ్ణంగా తెలుస్తుంది. ఈ అధ్యయనం వీలైనంత త్వరగా జరిగితే చాలా మంచిది. ఈ పరిశోధన సమగ్ర నిఘంటు నిర్మాణానికి కూడా బాగా వినియోగపడుతుంది.