ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

148శ్రీనాథకవి

<గీ. జగద గోపాలరాయ వేశ్యాభుజంగా
పల్లవాదిత్య మాచాన పరశురామ
కుమారగిరి రాజదేవేంద్రకూర్మిహితుడు
జాలుజగజెట్టి దేవయశామి సెట్టి

గీ. తమ్ము లిద్దరు దనయాగ్నదలధరించి
యున్ని దీవులదెచ్చు లాభార్థ కోటి
యగ్దలరు దెచ్చి కీర్తి బేహారమాడు
నవచిత్త పురాంతకుడువంశాబ్ది విభుడు.


మ. తను తనికవాయి గోవ నమతాస్థానంబుల జందనా
గడకర్పూర హిమాంబు మా బు సంకుమరజ కస్తూరి కౌద్రవ్యముల్"
కధల నప్ప జోగులు వినిగా సామాన్ల దెప్పించునే
.........లోర్థముండవని తిప్పం డల్పుఁదే యిమ్ముహిన్ .

గీ, పండువాకిల్లి రాధా పట్టణముల -
యదిపతులుమౌలి దాల్చు రత్నాంపరంబు
లవచి త్రిపురాంతకానీత యాన పాత్ర
సింహళ ద్వీపమండల క్షేత్రజములు

పెదకోమటి వేమభూపొలుని యనంతరము రాచవేమారెడ్డి కొండవీటి రాజ్యమున కలిభిషిక్తుంక్తుఁడయ్యెను. ఇతఁడు పెదకోమటి వేమభూపాలుని పుత్రుడనియు, తండ్రి బ్రదికీ యున్న కాలముననే 1426 లో జగవొబ్బ గండకాలువను ద్రవ్వించి శాసనము వ్రాయించెననియింతకుబూర్వము తెలిసికొంటిమి, ఇతఁ డే సంవత్సరమున సింహా సనమెక్కేనో, ఏ సంవత్సరమున మరణముఁ జెందెనో సరిగాఁ జెప్పఁ జూలము కాని యితఁడు నాలుగుసంవత్సరములు పరిపాలనము చేసెనని కొండవీటిదండకవులే తెలుపుచున్నది. ఇతనికి రాచ వేమనయని పేరెట్లువచ్చేనో తెలిసికొనవలసి యున్నది. ఇతనికి తల్లి సూరాంబిక యని అమీనాబాదు శాసనమునలనను, యీ సూరాంబిక "శ్రీ ధాన్య వాటీ పురాధిపతియు, కృష్ణ వేణ్ణా జల క్రీడా వినోదుండు' నగు గన్న భూపాలు ననుఁగుఁబుత్రి ” అని ఫిరంగపుర శాసనమువలనను, వేద్యమగుచున్నది.