688
కవి జీవితములు.
రనుతెట్టుసంస్థానీకుల వంశచారిత్ర మీగ్రామములో నున్న పైవేజెళ్లవారి ద్వారమున సంపాదింపఁబడిన వంశావళీగ్రంథము పట్టాలనుబట్టి సంగ్రహింపఁబడినది. దానివలన పై వృత్తాంతము కొంత తేలుచున్నది. కావున నీసమయములో నవసర మగువృత్తాంతము నీక్రింద వివరించెదను.
వేజెళ్ల వారివంశావళి.
పోలంరాజు.
|
పాపరాజు (శా. స. 1371-1416)
|
కసవరాజు (శా. స. 1416-1444)
పైవారిలోఁ బ్రస్తుతములో మనకుఁ గావలసినవారిపేరులు కాలమును గైకొందము. వా రెవ్వరనఁగా నఱ్ఱాజు నతని యన్న యగునయ్యపరాజును. వీరి కాలము శా. స. 1416 మొదలు 1444 వఱకు నిరువది యెనిమిది సంవత్సరములై యున్నది. వంశావళీసంగ్రహములో వీరివృత్తాంత మీక్రిందివిధంబుగా నున్నది. ఎట్లన్నను :_
"అయ్యపరాజు హైద్రాబాదునకుఁ బోయి అక్కడి నుండి పూర్వము 'కొడగు చక్రవర్తి' అనురెడ్డికి జాగీరుగా నడుచుచున్న గుడ్లూరు సీమకు జాగీరు తెచ్చుకొని తన తమ్ముఁడు సర్వరాజును హైద్రాబాదులో నుంచి తాను సోమరాజుపల్లె యనుగ్రామములోఁ గోట కట్టుకొని జాగీ రనుభవించెను."