ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

382

కవి జీవితములు


దీనిచేత మనము భట్టుమూర్తి రామరాజు కాఁ డని రూఢంబుగఁ దెల్పితిమి.

వసుచరిత్రములో రామరాజభూషణుఁడు స్మార్తులు గ్రంథారంభము చేసినట్లే కృతిపద్యంబులలో నీశ్వరత్రయమును శక్తిత్రయమును గజానను నుతియించె. ఇతఁ డాంజనేయోపాసనకుం డగుటంజేసి యాంజనేయస్తోత్రమును జేసి సంస్కృతమహాకవుల నుతియించి తనకుఁ బూర్వులగునాంధ్రకవుల నీక్రిందివిధంబున నుతియించెను.

మ. మహి మున్ వాగనుశాసనుండు సృజయింపం గుండలీంద్రుండు త
     న్మహనీయస్థితిమూల మై నిలువ శ్రీనాథుండు ప్రోవ న్మహా
     మహు లై సోముఁడు భాస్కరుండు వెలయింపన్ సొంపువాటించు నీ
     బహుళాంథ్రోక్తిమయప్రపంచమునఁదత్ప్రాగల్భ్యమూహించెదన్. ఆశ్వా. ప. 1. ప. 10.

దీనింబట్టి రామభూషణునకుఁ బూర్వులు 1 నన్నయభట్టు 2. తిక్కనసోమయాజి 3 శ్రీనాథుడు 4. సీముఁడు (నాచనసోముఁడు) 5. భాస్కరుఁడు (హుళిక్కిభాసకరుఁడు) మొదలగువారై యున్నారు. ఇతఁడు తనకృతిపతి యగుతిరుమలరాయని వర్ణించి యొకపద్యమున నతనిబిరుదంబులం దెల్పుచు నొకవచనంబునుచెప్పెను. బిరుదంబు లున్న వచనము దేశచారిత్రములోఁ జేర్చినానుగావున నిపుడు పద్యముమాత్రము కృతిపతి గౌరవాదికము సంగ్రహముగాఁ దెలియుట కిట వివరించెదను.

"సీ. వసుమతీభారధూర్వహత నెవ్వనియుర్వ, రావరాహాంక మర్ధము వహించు
      కరగతచక్రవిక్రమశక్తి నెవ్వాని, రామానుజత్వంబు రమణ కెక్కు
      జీర్ణకర్ణాటలక్ష్మీపునస్పృష్టి నె, వ్వానిలోకేశ్వరత్వము పొసంగుఁ
      జటులశార్వరమగ్న సర్వవర్ణోద్ధార, పటిమ నెవ్వనిరాజభావ మెసఁగు