ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

శ్రీనాథుఁడు.

263

కాశీఖండములో శ్రీనాథకవి తనప్రభుఁ డగువేమారెడ్డివంశము నీక్రిందివిధంబుగఁ దెల్పె.


ఈపైవంశవృక్షముంబట్టి శ్రీనాథునిసమకాలీనుఁ డగువేమారెడ్డి అల్లాడరెడ్డికుమారుఁ డగునళ్లయవేమన యని చెప్పఁదగును. పైదండకవిలెలోఁ గోమటివేమన్న కాలములో శ్రీనాథునకు గ్రామము లీయంబడినట్లుగాను, ఆగ్రామము లల్లాడరెడ్డికాలములో నతనికూఁతున కియ్యంబడినట్లును జెప్పంబడి యున్నది. శ్రీనాథుఁ డీయల్లాడరెడ్డికుమారుఁ డగువేమారెడ్డియధికారమునాఁటికి ముదుసలి యై యుండును. పైకోమటివేమనకాలము కొండవీటిదండకములో శా. స. 1278 మొదలు 1305 వఱకు నున్నట్లు వ్రాయఁబడినది. కాని కోమటి వేమనయనంతర మతనికొడు కగురాచ వేమన యధికారమునకు వచ్చిన ట్లాగ్రంథములో నున్నది. కాని రాచవేమన కోమటివేమనకొడుకు గాక, అల్లాడరెడ్డి కుమారుఁడే యైనట్లు పై వంశవృక్షమువలనం గాన్పించును. కారణాంతరమునఁ గోమటివేమనయనంతరము, అల్లాడరెడ్డి (అనగా, అనవేమారెడ్డికొడుకున కల్లుఁడు) కొంతకాలము ప్రభుత్వము చేసెను. ఇతనిశాసనములు 1338 వ శా. స. మున నుండుటచేత నతఁ డంతవఱకుఁగాని యింకను బిమ్మటఁగాని రాజ్యముచేసినట్లు కాన్పించును. (Lists of