పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/121

ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

124

కాశీమజిలీకథలు - మూడవభాగము

అంతలో గందర్పునకు జక్కగా దెలివివచ్చినది. లేచి తన మోసమును తెలిసికొని శోకముడిగి ధైర్యము దెచ్చుకొని సీ వీండ్రను భంగపెట్టవచ్చి భంగపడుట తప్పు. మనోరమమాట తరువాత విచారించెదగాక అని యూహించి యంగములు సవరింపుచు నాప్రాంతమందు చినిగిపడియున్న జింకనెత్తి దీనినెవ్వరిట్లు చేసిరని యహంకారముఖముతో నడిగెను.

అప్పుడు రత్నావతి ఓరీ! మిత్రద్రోహుడా! నేనురా నేనురా నీవు దీనిమూలమున మాకొంప ముంచి యింక సిగ్గులేక మాటలాడెదవేల నీవు విష్ణుండువని నమ్మి నాకూతు గోతిలోకి దింపినది. నీ విష్ణుత్వ మేది చూపుము మరజింక నొకదాని నెక్కి పంగనామములు పెట్టుకొని శ్రీహరినని మమ్ము మోసముచేయుదువా? నిన్నిప్పుడేమి చేయించెదనో చూడుమని బెదరింపగా నతం డిట్లనియె.

సీ! రండ! కాఱు లరవకుము. రాజుతోఁ జెప్పి నీసిక గోయించెదను. అయ్యా వినుండు దీనిగూతురు విద్యావతికిని నాకును బెక్కుదినములనుండి సాంగత్యము గలిగియున్నది. అది యొకనాడు మాతల్లి వైకుంఠమున కెట్లుపోవునని నన్నడుగగా నది మహాపాపాత్మురాలు, దానికి వైకుంఠము దొరకదు. నరకమునకే పోవునని నేను చెప్పితిని అదియు మఱియు నన్ను బ్రాతిమాలుచుఁ బాపములకు నిష్కృతి యుండకమానదు. అట్టి ప్రాయశ్చిత్తము చెప్పి దీనికి ముక్తి కలుగునట్లు చేయుడని గోరగా బురాణములో నున్నరీతి దనకున్న ధనమంతయు బ్రాహ్మణాధీనము గావించెనేని వైకుంఠము దొరకునంటి ఇదియే నేను జేసినతప్పు. అట్లు చేసినది కాబోలు! చేసినవెంటనే వైకుంఠము దొరకునా? మరణావసానమునం గదా యెక్క,డికి బోవునది తెలియును లంజ పితరులకు బెట్టి యాకసమువంక జూచినదట. దీని మాటలట్లున్నవి. చూడుడు. మిక్కిలి వెలగలనాతోలుజింకను జించివేసినది. మీరు సాక్ష్యముగా నుండవలయు నానక నే నెఱుగనని పలుకగలదు నే నిప్పుడు రాజుగారియొద్దఁ జెప్పి శిక్షింపజేసెదనని అందున్న పురోహితబ్రాహ్మణునితో జెప్పెను.

అతనిమాటలు విని విద్యావతి విస్మయశోకాదులు మనంబున నావేశింప దల్లితో అమ్మా! యీయన మాటలను వింటివా? అతఁడు రాజుగారితో సైత మట్లే చెప్పును. దీనికి నిదర్శన మేది? మనమాటలు విశ్వసించువా రెవ్వరు? ఇది మనగ్రహస్థితి యనుకొని యెచ్చటకేని పోయి యెక్కడేని యుండుట యుచితము. రాననిన వెండియు ........................................ మనలనే రాజు ఆక్షేపించును. కానిమ్ము. ....................................ధైవానుగ్రహము. ......................ఎంతయో చెప్పినది.


అప్పుడు రత్నావతి కూతుఁ గోపించుచు ఓసి రండా! వీనియందు నీకింకను బక్షపాతము వదలలేదే. నీ వెఱింగియే యిట్లు చేసితివి కాబోలు. మీయిరువురు బదియారుసంవత్సరములనుండి నాయింటనున్న ధనమంతయు వ్యయపెట్టుచు యథేష్ట