ఈ పుట అచ్చుదిద్దబడ్డది

92

వల్లభాయిపటేల్

మానుల కనుభవము, సంపద, రెండును గావలసినంతగా నున్నవి. వారు శక్తిసామర్థ్యములను, సంపదను, దేశముకోస మర్పించవలసియున్నది. అదియుఁ గాకపోయిన దేశము సర్వనాశనమైపోయినప్పుడు వారి సంపదయంతయు దమ్మిడీకిఁ గొఱగాదు.

"బొంబాయి సమస్యను బెర్లిన్ సమస్యగామాత్రము చేయకుఁడు, తరతరాలుగా శాంతిసద్భావములతో నివసించు చున్నప్పుడు గుజరాతీలు, మహారాష్ట్రులు నిప్పుడుమాత్ర మెందుకు శాంతి సద్భావములతో నివసించలేరు?

"మన యంతఃకలహములను మనమే పరస్పరసొహార్దముతోఁ బరిష్కరించుకొందము. ఈ సంకుచితరాష్ట్రీయ తత్త్వమునకు స్వస్తి చెప్పుఁడు. విద్వేషప్రచారమునకుఁ బూనుకొనకుఁడు. మన మిండియాను సుదృఢముగా నిర్మించవలసి యున్నది. ప్రపంచములోఁ గొలఁదిదేశములుమాత్రమే యిండియాయంతటి బలసంపత్తికలవి. ఇండియా శ్రేయస్సు కోసమే మన ముత్పత్తి నితోధికముగఁ జేయవలసియున్నది. మనము పరస్పరము సంప్రతించుకొని వ్యవహరించవలసియున్నది. అప్పుడే మనము దేశమునకు శక్తివంచనలేకుండ సేవచేసినట్లు కాఁగలదు. అప్పుడే మనము గాంధీజీ యనుయాయుల మనిపించుకొనుట కర్హులము కాఁగలము.

స్వాతంత్ర్య వార్షికోత్సవ సందేశము

"స్వాతంత్ర్యముపొందిన తొలి సంవత్సరములోనే మనము కష్టపరంపరలలోఁ దలమున్కలై పోయితిమి. కాని యకుంఠిత ధైర్యసాహసములను బ్రదర్శించుటవల్లనేమి, వజ్ర