ఈ పుట అచ్చుదిద్దబడ్డది

[12]

వల్లభాయిపటేల్

89

లాభములు పోసికొనుటకు సమయముకాదు

ఈ సమస్యలను బరిష్కరించుటలో బొంబాయినగర మెట్లు తోడ్పడఁగలదో, వివరించుచు సర్దార్ పటే లిటు లన్నాడు.

"ఇండియాలోఁ గీలకమైన ప్రదేశములో బొంబాయి నగర మున్నది. మన యార్థిక వ్యవస్థయంతయు నిప్పు డల్లకల్లోల పరిస్థితులలో నున్నది. ఈ పరిస్థితిని మనము చక్కజేయక పోయినట్టయిన మన సైనికవ్యవస్థకూడ శిథిలము కాక తప్పదు. మనకు డబ్బుకావలయును. మనకు సాధనసంపత్తి కావలయును. దేశముకోసము మనము సర్వస్వము త్యాగము చేయవలసియున్నది. లాభములు పోసికొనుట కిది తరుణము కాదు. ప్రతి కార్మికుఁడు, మిల్లుయజమాని, వ్యాపారి దానిని గుర్తించవలసియున్నది. నిర్విరామకృషికి, స్వార్థరహితసేవకు, నిది యదను."

మిల్లు యజమానులకు విజ్ఞప్తి.

"పెట్టుబడిదారీ వ్యవస్థను నిర్మూలించనున్నారను బూటకపుకబుర్లు విని యపోహపడవద్దని మిల్లుయజమానులకు విజ్ఞప్తి చేయుచున్నాను.

"మరొకచోట సంపద యెక్కువైన నిక్కడ దానిని మరొక విధముగా వినియోగము చేయవచ్చును. అట్లు గాక పోయిన దేశము సత్వరమే యధోగతిపాలై పోవును.

"అక్రమముగా లాభములు తీయుచున్నారను నిందకు మీరొడిఁగట్టక తప్పదు. మీరు స్వయంకృతమైన యిబ్బందు