124
వల్లభాయిపటేల్
వింధ్యప్రదేశ్ సమ్మేళన మేర్పడెను. దీనికి దివామహారాజు రాజప్రముఖుఁడు.
విశాలరాజస్థాన్ పేరుతో 14 రాజపుత్రస్థాన సంస్థానములు కూటమిగా నేర్పడెను. ఉదయపూర్ మహారాజు రాజప్రముఖుఁడు.
'మధ్యబారత్' అను 22 మాలవసంస్థానములతో నొక సమ్మేళన మేర్పడెను. దీనికి రాజప్రముఖ్ గ్వాలియర్ మహారాజు.
పాటియాలాతోపాటు తొమ్మిది సంస్థానములు కలిసి 'వూల్కియా' సమ్మేళన మేర్పడెను. పాటియాలా మహారాజు దీనికి రాజప్రముఖుఁడు.
ఆఖరుగా 1949 జూన్ 1 వ తేదీని కేరళ యూనియనేర్పడినది. ఇందులోఁ దిరువాన్కూర్, కొచ్చిన్ సంస్థానములు కలవు. దీనికి రాజప్రముఖ్ తిరువాన్కూర్ మహారాజు.
కేంద్రప్రభుత్వము దత్తము చేసికొన్నవి.
కచ్చి సంస్థానము బొంబాయి రాష్ట్రమున కుత్తరముగా పాకిస్థాన్, సరిహద్దులలో నుండుటచేత చీఫ్ కమీషనర్ రాష్ట్రముగా నేర్పడినది.
తూర్పు పంజాబులోని 21 సంస్థానములు హిమాచల ప్రదేశ్ అను పేరుతోఁ గేంద్రప్రభుత్వములోఁ జేరినవి.
భోపాల్, నేపాల్ సంస్థానములుకూడఁ గేంద్రప్రభుత్వములోఁ జేరినవి.