ఈ పుట ఆమోదించబడ్డది
- "వబలకు ప్రాసముగలదని శ్రీ పంతులవా రిదివఱకు నేపద్యము నుదాహరించుచుండిరో యాపద్యంబున దమపడిన యభిప్రాయము బొరపాటని దానిని సంస్కరించిన బ్రహ్మశ్రీ వేదము వేంకటరాయశాస్త్రిగారి యుపన్యాసమును సన్నుతించి యొప్పుకొన్నారు." ఇంతమాత్రమేగాదు, +"వేంకటరాయశాస్త్రులవారి 'ప్రక్రియాఛందస్సు' అను నొక గ్రంథముపై, బంతులవారీవిధముగ వ్రాసినారు. ఎట్లన 'ఈ పుస్తకము రూపున గడుచిన్నదైనను గుణాతిశయములచే బెద్దదనియే యెన్నదగియున్నది." అని, తర్వాతతర్వాత శాస్త్రులవారి జాబులను పూండ్ల రామకృష్ణయ్యగారు విశేషముగా ప్రకటింప నారంభించిరి. ఆంధ్ర భాషాసంజీవని యందు ఆసూరి శ్రీనివాసాచార్యులు లోనగువారు ముద్రింపించుకొన్న యుత్తరములకు శాస్త్రులవారు అముద్రిత గ్రంథచింతామణియందు ప్రత్యుత్తరమొసంగిరి. #ఇందులకు ఆసూరి శ్రీనివాసాచార్యులచే వేంకటరత్నము పంతులవారు మరల జబాబిప్పించిరి. ఇందు దూషణవాక్యములు ప్రయోగింపబడినవి. కాని వేంకటరాయశాస్త్రులవారు బదులు దూషింపక ఇట్లువ్రాసిరి. "అముద్రిత గ్రంథచింతామణియందు గడచిన యేప్రెలు, మే-సంచికలలో నాప్రకటించిన కొన్ని సవరణలనుగూర్చి చర్చించుచు గ్రొత్తగా గొన్ని యుదాహరణములంజూపి వానింగూర్చి నన్ను బ్రశ్నలువేయునవై వైశాఖ
______________________________________________________________________
- అముద్రి-గ్రం-చిం. సం.7. సంచి.12
+అదే. సం.8. సంచి.1. పుట 19.
- అదే. సం.8. సం 4.