23-ప్రకరణము
నెల్లూరికాపురము - ఋణము
తాతగారికి అఱువదితొమ్మిది సంవత్సరములైనవి. వృద్ధాప్యమువచ్చినది. అచ్చాపీసు విక్రయించివేసిరి. ఇక మదరాసులో నేలయుండవలయును. చేయుచున్నపని విద్యావిషయికము; గ్రంథములు వ్రాయుటయు ముద్రింపించుటయు పోషకులు నెల్లూరనే యున్నారు; శిష్యులును అచటనేకలరు. జన్మభూమి. మరల నెల్లూరుచేరి తమశిష్యబృందము నడుమనుండి, తమనాటకములను వారిచే మునుపటికన్నను చక్కగా నాడించుచు, గ్రంథములు రచించి ప్రకటించుచు నెల్లూరనే కాలము గడుపుకోర్కెజనించినది.
అనంతరము జరిగినవిషయములను మాకుటుంబమునకు మహోపకారముంగావించిన శ్రీ ఏనాదిరెడ్డి గారి మాటలలోనే ముద్రించెద. *"నెల్లూరు వర్ధమాన సమాజమువారి కోరికమెయి, వారి యాజమాన్యమున శాస్త్రులవారు కొన్ని యుపన్యాసములు గావించిరి. ఆముక్తమాల్యదనుగూర్చి యుపన్యసించునపుడు బ్ర.శ్రీ.మైదవోలు చెంగయ్యపంతులు, తూములూరు శివరామయ్యపంతులుగార్లు మొదలగు పెద్దలు శాస్త్రులవారింగూర్చి 'మీరు మాయూరి పండితవర్యులయ్యును మీవలన విశేషవిషయములం దెలిసికొనుట కందుబాటులేని మదరాసులో నివసించితిరి. నెల్లూర నివాస మేర్పఱుచుకొని మాకు
- శ్రీ గునుపాటి ఏనాదిరెడ్డి గారినివేదిక - వే.వేం. శాస్త్రి సహాయనిధి.