ఈ పుట ఆమోదించబడ్డది
గునుపాటి ఏనాదిరెడ్డిగారును, మఱికొందఱు నెల్లూరి పెద్దలును చేరి ఆంధ్రభాషాభిమాని సమాజమును 1899 సం. ప్రాంతమున స్థాపించిరి. పూండ్ల రామకృష్ణయ్యగా రొక కార్డులో వేంకటరాయశాస్త్రులవారి కిట్లువ్రాసిరి.
- తే 1-5-99 నెల్లూరు.
ఆర్యా, నమస్కారములు.
సంఘము నిన్నటిదినమున నేర్పాటైనది. పదముగ్గురు వచ్చిరి. ఇంకను రాగల యాదిత్యవారమునకు మఱికొందఱు జేరగలరు. ఇపుడు పరగ్రామములకు బోయియున్నారు. "ఆంధ్రభాషాభిమాని సమాజము" అని పేరిడినారు.....
- విధేయుడు
- పూండ్ల రామకృష్ణయ్య
- 8-2-1900 నెల్లూరు.
ఆర్యా, నమస్కారములు
...ఉష నేమి చేసినారు. హనుమంతరావు రామానుజాచారి మొదలగువా రచ్చటికే వత్తురు శ్రీనివాసన్ మార్చినెలలో జేరును. అందఱును మీదృష్టిపథముననేయుందురు. బహుశ్రద్ధతోనున్నారు ......ఏనాదిరెడ్డికిని నొకజాబువ్రాసినాను.
- పూ. రా.
- నెల్లూరు. 22-5-1900
బ్రహ్మశ్రీ మహారాజశ్రీ వేదం వేంకటరాయశాస్త్రుల వారి సముఖమునకు పూండ్ల రామకృష్ణయ్య అనేకసాష్టాంగ