20
తెనాలి రామకృష్ణకవి చరిత్రము
త్కరి గరిభిద్గిరిగిరభి
త్కరి బిద్గిరిభిత్తురంగ కమనీయంబే.”
కుంకుమబొట్లు 'ఓరీ! ఆపద్యమున కర్థము చెప్పగలవా? యని ప్రశ్నింప, రామకృష్ణుఁ డిట్లుఁ జెప్పెను. "
టీ. నరసింహ=సాళువ నరసింహారాయల, కృష్ణరాయ= అతని కుమారుడైన శ్రీకృష్ణ దేవరాయల, కీర్తి= ప్రసిద్ధి, కరభిత్ =గజాసురుని వధించిన శివునివలెను, గిరిభత్కరి=పర్వతముల పెకలించిన యింద్రుని యేనుగయగుయైరావతమువలెను, కరిభిద్గిరి=సాంబశివుడు నివాసముండు కైలాసశైలమువలెను. దిరిభిత్కరిభిత్తురంగ = యింద్రుని యొక్కయు, నీశ్వరునియొక్కయు వాహనములైన యుచ్చైశ్రవము గోవృషభములవలెను తెల్లనికాంతి గల్గియున్నది.
'రామకృష్ణుని పరిచారకుడే యిట్టి యసాధారణ పాండితీప్రకర్ష గలిగియుండగా, రామకృష్ణకవి యెట్టి ప్రజ్ఞాధురంధరుండో, యష్టదిగ్గజములం దగ్రగణ్యుం డై యొప్పు పెద్దనముందు నే నసలు నిలువబడ గలనా' యని తలంచి యధైర్యమునొంది, యారాత్రి యేరికిని దెలియకుండ నెటకో వెడలిపోయెను.
మఱునా డాస్థానమున రాయలుకూర్చుండి, కుంకుమబొట్లు నాహ్వానించుటకై భటులనంపగా వారు తిరిగివచ్చి 'మహారాజా ! ఆ పండితుడు గతరాత్రముననే నగరమువిడిచి వెడలిపోయెనట' యని చెప్పిరి. రామకృష్ణుడు తానొనరించినదంతయు నెరింగింపగా రాయలు మిక్కిలి సంతోషించి సన్మానించెను. తమ యాందోళనము బాపినందులకు పెద్దనాదులెల్లరును రామకృష్ణకవిని విశేషముగా నభినందించిరి,
11 ప్రెగడరాజు నరసరాజు
ప్రెగడరాజు నరసరాజనుకవి యొకప్పుడు కృష్ణదేవరాయల భూస్థానమున కేగి 'మహారాజా! తమ యాస్థానముననున్న పెద్దన్న '