ఈ పుట అచ్చుదిద్దబడ్డది
214
స్వీయ చరిత్రము.
పయి యుత్తరములో పేర్కొనఁబడిన చిన్నది పెద్దాపురపుచిన్నది. మా ప్రయత్నములచేత దొరతనమువారు కొట్టుపడిపోయిన లక్ష్మీనరసింహముగారి యభియోగముపైని ఉన్నత న్యాయసభలో ఉపర్యభియోగమును పెట్టించిరి. ఆయుపర్యభియోగములో న్యాయమూర్తి ముత్తుసామయ్యగారు శిష్యులకు బహిష్కారపత్రికలను పంపుటకు శంకరాచార్య స్వాములవారి కధికారమున్నదనియు, ఆయన తన శిష్యులకుమాత్రమేకాక యితరులకుకూడ తెలియునట్లుగా బహిష్కార పత్రికలను పోస్టుకార్డులమీఁదవ్రాసి పంపుట తప్పిదమనియు, నిర్ధారణముచేసి యాయపరాధమునకయి జగద్గురువులయిన యాచా