షష్టా ధ్యాయము
243
కనుకనే శ్రీనాధకవి సార్వభౌముఁడు, వీరభధ్రన్నపాలుడు, చిల్కస ముద్రము వఱకు రాజ్యము విస్తరింపఁ జేసి పరిపాలించు చున్న క్రింది పద్యమునఁ జెప్పీయున్నాడు,
ఉ. ప్రాకట విక్రము స్ఫురణ రాజము హేంద్రము రాజధానిగా
నేక సితాతపత్రమున నేలును వీరనృపాల ముత్తమరలోకుడు వేమగొరియనుజుండు సమున్నతి పై భవాధ్యుడై చీకటియుం గళింగయును జిల్క సరదము సింహ శైలమున్ .
అగ్రహార బ్రాహ్మణ వర్ణనము.
గౌతమి తటమునందు వేమభూ పొలుఁ డనుజన్ముఁడైన వీరభద్ర నృపాలని చేత ధాత్రిసేవించు కాలమున సగ్రహారములోని బ్రాహ్మణు లెట్టి యైశ్వర్యములతో నొప్పుచుండిరో యా వివరమును గూడ శ్రీనాథకవి సార్వభౌముడీ కైంది రీతి నభివర్ణించియున్నాఁడు,
« సీ. ధరియింప నేర్చిరి చర్భ పెట్టెడు వ్రేళ్ళ
లీల మాణిక్యాంగులీయక ముల
గల్పింప నేర్చిరి గంగమట్టియ మీఁదఁ
గస్తూరి పుండ్రకముల నొసల
సవరించు నేర్చిరి జన్నిదంబులమ్రోల
దారహారములు ముత్యాలసరులు
చేర్పంగ నేర్చిరి శిఖల నెన్నడుముల
గమ్మని కొత్త చెంగల్వ విరులు
తే. గ్రామముల వెండియును బైఁడి దడబడంగ
బాహ్మణోత్తము అగహారములలోన
వేమభూపాలుఁ డనుజన్ము వీరభద్రు
ధాతి యేలింప గౌతమీ తటమునందు
అనఁగా నంతకు బూర్వము బ్రాహ్మణులంత . మైశ్వర్యవంతులుగా లేరని భావము 'తేట తెల్లముగుచున్నది,