ఈ పుట అచ్చుదిద్దబడ్డది
'మన చెలిమి' అనే గేయంలో.
'ఎవరు నేనీ జగతి
ఎవరు నేనీ ప్రగతి'
అని బాపిరాజుగారు జీవితాంతమున ఆత్మపరిశోధన చేసుకున్నార.
శశికళ అనేకరూపాల్లో- సూర్యసుతగా, యోగినిగా, నర్తకిగా, గానసుందరిగా, దేశికగా, ప్రేయిగా, ఆయనకు దర్శనమిస్తుంది.
బాపిరాజుగారి జీవితమంతా కళామయంచేసి చివరికి ఆయననుతనలో లీనంచేసుకున్నది శశికళ.
బాపిరాజుగారు అదృశ్యులైనా ఆయన గ్రంధావళి దీపావళివలె ఎప్పుడూ జ్వలిస్తూనే ఉంటుంది.
శశికళా నిలయం
రామచంద్రపురం
1 జనవరి 1954
రావులపర్తి భద్రిరాజు.