౧౩
శకునపరిగణనము
అజ్ఞాననిహత మై యుండుటచే దేశమంతట నిట్టి యపభ్రంశపు తలఁపులు నిండారి యున్నవి. పెద్దపెద్దలు, కొమ్ములు దిరిగిన విద్వాంసులు, మహొన్నతపదవులం దున్నవారు గూడ నింటనుండి యే దేని పనిమిఁ బయటకి వెడలునపు డెదురుగా నెవ్వరు వచ్చుచున్నారో యని పరిశీలింతురు. కుగ్రామములో నట్టి పరిశీలనము తగు నేమో, అర్ధవంతమగు నేమో కానీ వేలకొలఁది ప్రజలు గల నగరములలో నట్టి పరిశీలనము చీకాకు గొల్పును. సమకాలమునే విధులలో ' పంచ శుభం పంచాశుభమ్' అన్నట్టు కలసికట్టు గానో, ముందు వెనుకలుగానో సభ ర్తుకలు, ఒంటి బ్రాహ్మణులు,పల్వురు న్రాహ్మనులు తారసిల్లుచునే యుందురు. ఇందు పౌర్వాపర్యములు పర్యాలోచించుచుందురు. మఱియు ఫలాని వితంతువు , ఫలాని బ్రాహ్మణుఁ డు ఎదురుగా వచ్చినప్పుడు కార్యము నిర్వక్రముగా నిర్వహణము చెందు నని వారు విశ్వసించుట కలదు. వా రేట్లు వచ్చినప్పుడు మంచి జరుగుట కేవో కారణములు,యుక్తులు నసందర్భముగా నుపాంశువుగా గణిం చుట కలదు.
తాము ప్రయాణ మగువేళకు బ్రాహ్మణుఁడేని, ఆతఁడు, కుమారుఁడో, అన్నో, తమ్ముఁడో,