విభీషణాయిలు
మనదేశ స్వాతంత్ర్యానికి విరోధులయిన ఆ విభీషణాయిలు ఏదో ఒక కులం పేరిటో, మతం పేరిటో, మరో రూపంలోనో తమకు రక్షణ కావాలంటూ, తమరిని ప్రత్యేక దృష్టితోనూ, అభిమానంతోనూ చూడవలసి ఉంటుందంటూ ఆ రౌండ్ టేబిల్ కాన్ఫరెన్స్కు హాజరయ్యారు. భారతీయులచే ఆంగ్లేయుల గడ్డపై ఆడించిన విషాద కరమయిన వింత నాటక మది. గాంధీగారికి దేశీయులూ, విదేశీయులూ కూడా ద్రోహం చేశారు.
భారత దేశం తరపున 'స్వాతంత్ర్య' తీర్మానం తీసుకువచ్చి నందుకు గాంధీగారిని ఎగతాళి చేశారు. గుంఫితంగా, గంభీరంగాను ఎగతాళి చేశాక, సర్ శామ్యూల్ హోర్ భారతదేశానికి గాంధీగారి అరెస్టుతో ఒక పాఠం చెప్పి తీరతానని భయపెట్ట సాగాడు. ఆయనే కాదు, యావత్తు భారతదేశంలోని నాయకులంతా జెయిళ్ళకు పోతా రన్నాడు. అన్న మాట ప్రకారం చెయ్యనూ చేశాడు. రెండవ రౌండ్టేబిల్ కాన్ఫరెన్స్ అనంతరం వెనువెంటనే దేశాన్ని అణగద్రొక్కడానికి జరిపిన చర్య ఇది. ఆ దేశవిస్తృతమైన చర్య సందర్భంగానే నేనూ అరెస్టయ్యాను.
తిరిగి వెల్లూరు జెయిలుకి
వెనుక పుటలలో నా అరెస్టూ, విచారణా, జెయిలు శిక్ష అన్న విషయాలను గురించి చెప్పే ఉన్నాను. శిక్ష విధించిన తరువాత నన్ను మదరాసు తీసుకు వెళ్ళారు. అక్కడనుంచి, రెండవ సారిగా నన్ను వెల్లూరు జెయిలుకు మార్చారు. ఆజెయిలు సూపరింటెండెంట్గా మేజర్ ఖాన్ పనిచేస్తూనే ఉన్నాడు. ఈ సారి ఒకరి నొకరం అర్థం చేసుకున్న కారణంగా, శిక్షాకాలం పూర్తి అయ్యేదాకా అక్కడే నన్ను ఉంచారు. వెనకటి లాగే ఈసారి కూడా చాలామంది హితులూ, స్నేహితులూ, సన్నిహితులు తోడి ఖైదీలుగా అక్కడికి వచ్చి చేరారు.
మామూలు జెయిలు పరిస్థితులు తప్ప చెప్పుకోతగ్గ క్రొత్త విశేషాలు ఏమీలేవు. మామూలు దోరణిలోనే జెయిలు పరిస్థితులు నడిచా