రాజా సర్ మాధవరావు
293
యయ్యెను. మాధవరావు ముప్పదియేండ్లయిన నిండక మునుపే బుద్ధిబలము నీతిబలము విద్యాబలముగలవాఁడగుటచే గొప్ప సంస్థానమునకు మంత్రిత్వము వహింపఁ గలిగెను.
మాధవరావు మొట్టమొదట కొన్నియేండ్లు ప్రజాపీడకరములుగానున్న పన్నులఁ దగ్గించి మార్పుచేయుటలో గడపెను. క్రమము మితిమీర లేక వెనుకటి మంత్రులు పన్నులు గట్టుచు వచ్చినందున దేశస్థులు మిక్కిలి దరిద్రులైరి. సంస్థానమునందుఁ బ్రతివస్తువుఁగూడ నిజారా చేయఁబడుచువచ్చెను. పన్నులు ప్రజలను విసికించెను. అన్నింటిలో మిరియాల యిజారా జనులకు మిక్కిలి బాధకరముగ నుండెను. ఆ యిజారా మాధవరావు ముందుగాఁ గొట్టివేసి యందువలన సంస్థానమునకుం గలుగుఁ ధననష్టము గూడదీయుటకై నూటికి పదునైదు వంతున దానిమీఁద నెగుమతి పన్ను విధించెను. అదియు ప్రజలకు భారముగా నున్నందున గొంతకాలము కడచినపిదపనతడు నూటికి తొమ్మిదివంతున పన్నువిధించెను. మఱి కొన్నాళ్ళకదియే నూటికైదురూపాయల వంతగునట్లు చేసెను. ఆ సంస్థానమునం దది వఱకు పొగాకువర్తకము జనులుచేయుటకు వీలులేదు. సంస్థాన ప్రభుత్వమువారే విదేశ వర్తకులవద్దనుండి పొగాకు కొని నిలువజేసి చిల్లరగనమ్మి లాభము దీయుచువచ్చిరి. మాధవరావు పొగాకు యిజారా కొట్టివేసి యావర్తకము జనులేచేసి కొనవచ్చునని యుత్తరువుచేసి దానిమీద కొంతపన్ను విధించెను. ఆ పన్ను మొదట కొంచెము హెచ్చుగా నున్నందున నతడే కాలక్రమమున దానిని తగ్గించెను. ఇట్లుచేయుటచే దేశమున వర్తకము హెచ్చుటయు బ్రజలు బాగు పడుటయు సంభవించెను. అట్లు మాధవరా నిజారాలను రూపు మాపి తక్కిన పన్నులుతగ్గింప సంకల్పించి చిల్లరపన్నులు నూరుతీసివేసెను. ఈ నూరు పన్నులు సంస్థానమునకుఁ కలుగఁ జేయులాభముతక్కువ