ఈ పుట ఆమోదించబడ్డది
104
ఛంద పరిచ్చేదము
షడంగములలో ఛందశ్శాస్త్ర మొకటి. ఛందస్సు అనగా పద్య లక్షణము. పద్య లక్షణమును తెల్పు శాస్త్రమును ఛందశ్శాస్త్ర మందురు.
కొన్ని అక్షరములు చేరి గణములగును.
కొన్ని గణములు చేరి యొక పద్యమగును.
గురు లఘువుల కలయికచే గణము లేర్పడును.
హ్రస్వాక్షరములు, లఘువులు (తేల్చి పలుకునవి)
దీర్ఘాక్షరములు, గురువులు (ఊది పలుకునవి) ఒక క్షణములో నాల్గవ భాగము మాత్ర.
ఒక మాత్ర కాలము లఘువు.
రెండు మాత్రల కాలము గురువు.
మూడు మాత్రల కాలము ప్లుతము.
లఘువును '|' ఈ గుర్తుతో చూపుదురు.
గురువును 'U' ఈ గుర్తుతో చూపుదురు.
గురువుల గుర్తించు విధానము : -
1. దీర్ఘములన్నియు గురువులు.
కా - రా - పా. మొదలైనవి.
2. బిందువుతో కూడినవి గురువులు.
కం - రం - పం మొదలైనవి.
3. విసర్గముతో కూడినవి గురువులు.
కః - దుః - మొదలైనవి.
సులభ వ్యాకరణము